Jayamma Panchayati : ఢీలా పడిన ‘లేడీ’ ఓరియెంటెడ్ మూవీస్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్యకాలంలో అంటే ప్యాండమిక్ తరువాత ప్రేక్షకులు థియేటర్లకు రావడమే తగ్గించేశారు అని ఆ మధ్య భలేగా టముకు సాగింది. అయితే వారికి నచ్చిన, వారిని మెప్పించిన చిత్రాలకు మాత్రం జనం భలేగా పరుగులు తీశారు. ఈ తీరును గమనిస్తే లాక్ డౌన్స్ తరువాత కొన్ని చిత్రాలనే ప్రేక్షకులు ఆదరించారని తెలుస్తోంది. చిత్రమేమంటే, తెలుగు సినిమాలో అంతకు ముందు కొన్ని ‘లేడీ ఓరియెంటెడ్ మూవీస్’ భలేగా మురిపించాయి. కానీ, కరోనా కల్లోలం తరువాత ఏ ఒక్క స్త్రీ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రమూ జనాన్ని ఆకర్షించ లేదు. ఆకట్టుకోక పోవడానికి కథల్లో పట్టు లేకపోవడమే కారణమని అంటున్నారు సినీజనం. తాజాగా విడుదలైన ‘విరాటపర్వం’లో పేరుకు రాణా వంటి నోటెడ్ హీరో ఉన్నప్పటికీ, ఇది నక్సలైట్ తూము సరళ కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం. ‘విరాటపర్వం’లోని ప్రధాన కథ అంతా సాయిపల్లవి పోషించిన వెన్నెల పాత్ర చుట్టూనే తిరుగుతుంది. కానీ, జనాన్ని ఎందుకనో ఈ సినిమా అలరించలేక పోయింది. అలాగే ప్రముఖ యాంకర్ సుమ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘జయమ్మ పంచాయితీ’ పంచాయతీ అన్నదే లేకుండా మొదటి ఆటకే చాప చుట్టేసింది.
ఈ సినిమాలే కాదు, అనుష్క నటించి, ఓటీటీలో నేరుగా విడుదలైన ‘నిశ్శబ్దం’ టైటిల్ కు తగ్గట్టుగానే నిశ్శబ్దంగా సాగింది. నిజానికి ‘అరుంధతి’ చిత్రంతో మళ్ళీ లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కు క్రేజ్ సంపాదించి పెట్టిన అనుష్క, ఆ తరువాత కూడా “రుద్రమదేవి, భాగమతి” వంటి చిత్రాలలో నటించింది. ఇక ‘మహానటి’తో జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా నిలచిన కీర్తి సురేశ్ తోనూ “మిస్ ఇండియా, గుడ్ లక్ సఖీ” వంటి లేడీ ఓరియెంటెడ్ మూవీస్ తెరకెక్కాయి. అవీ అంతగా ఆకట్టుకోలేక పోయాయి. ఒకప్పుడు తనదైన అభినయంతో జనాన్ని ఎంతగానో అలరించిన ఆమనితోనూ ‘అమ్మ దీవెన’ అనే స్త్రీ ప్రధానాంశ చిత్రం రూపొందింది. ఆ సినిమా ఫలితమూ అంతే! ఆ రోజుల్లో ‘అంకురం’తో విశేషాదరణ చూరగొన్న దర్శకుడు సి.ఉమామహేశ్వరరావు, ఆ సినిమా నాయిక రేవతి ప్రధాన పాత్రలోనే ‘ఇట్లు అమ్మ’ రూపొందించారు. ఈ అమ్మను కూడా జనం ఆదరించలేకపోయారు. యాంకర్ గా అదరహో అనిపించిన అనసూయతో తెరకెక్కిన ‘థ్యాంక్యూ బ్రదర్’ కూడా ఏ మాత్రం ఆకట్టుకోలేదు.
Also Read
ఈ తరం ముద్దుగుమ్మల్లో ఒకరైన నిత్య మీనన్ నటించడమే కాదు, చిత్ర నిర్మాణంలో పాలుపంచుకొనీ ‘స్కైలాబ్’ నిర్మించింది. ఆ ల్యాబ్ సైతం లాభాలు చూడలేకపోయింది. టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరితో మురిపించిన శ్రియాశరణ్ ప్రధాన పాత్రలో రూపొందిన ‘గమనం’ కూడా సరైన గమ్యం చేరుకోలేదు. దిశా ఎన్ కౌంటర్ నేపథ్యంలో తెరకెక్కిన ‘ఆశా ఎన్ కౌంటర్’ ఏ మాత్రం అలరించలేదు. తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో వచ్చిన ‘మిషన్ ఇంపాజిబుల్’ కూడా జనాన్ని ఆకట్టుకోవడం ఇంపాజిబుల్ అని తెలుసుకుంది. ప్రియమణి ప్రధాన పాత్రలో రూపొంది, నేరుగా ఓటీటీలో వెలుగు చూసిన ‘భామాకలాపం’ కూడా సందడి చేయలేకపోయింది. నందితాశ్వేత ప్రధాన పాత్రలో రూపొందిన ‘అక్షర’ పరిస్థితీ అంతే! తాజాగా ‘విరాటపర్వం’ చూసిన తరువాత జనం ఎందుకని ‘లేడీ ఓరియెంటెడ్ మూవీస్’ వైపు మొగ్గు చూపడం లేదన్న ఆసక్తికరమైన చర్చ మొదలయింది. స్త్రీ ప్రధాన పాత్రతో రూపొందే చిత్రాలలో నవతరం ప్రేక్షకులను అలరించడానికి ఏ యే అంశాలను చొప్పించాలో ముందు దర్శకనిర్మాతలు అధ్యయనం చేయాలి. ఆ తరువాతే లేడీ ఓరియెంటెడ్ మూవీస్ వైపు దృష్టి సారించాలి. మరి ఏ లేడీ ఓరియెంటెడ్ మూవీ తెలుగువారిని మళ్ళీ ఆకట్టుకొని ముందుగా బాక్సాఫీస్ ను కొల్లగొడుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Mahanadu : ‘స్త్రీ శక్తి’ థీమ్తో టీడీపీ మహానాడు.. 20 కీలక తీర్మానాలకు పొలిట్ బ్యూరో ఆమోదం.!
-
PM Modi: పొదుపు వేళ మోడీకి సినీ వర్కర్స్ అసోసియేషన్ లేఖ.. ఏముందంటే..!
-
CM Revanth Reddy : బండి భగీరథ్ అరెస్ట్ పై సీఎం రేవంత్ రియాక్షన్..
-
RG Kar Case: ఆర్జీకర్ కేసులో ట్విస్ట్.. మళ్లీ దర్యాప్తుకు హైకోర్టు ఆదేశం
-
GT vs CSK: టాస్ గెలిచిన రుతురాజ్ గైక్వాడ్.. గిల్ సేనకు మొదట బ్యాటింగ్ సవాల్..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!