మాస్ మహారాజా రవితేజ నటించిన తొలి పాన్ ఇండియా చిత్రం టైగర్ నాగేశ్వరరావు. స్టూవర్టుపురం పేరు మోసిన దొంగ నాగేశ్వర రావు బయోపిక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ గజదొంగగా నటించాడు..వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ ది కాశ్మీర్ ఫైల్స్ మరియు కార్తికేయ 2 సినిమాలను నిర్మించిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ అభిషేక్ అగర్వాల్ ప్రతిష్టాత్మకంగా భారీ స్థాయిలో నిర్మించారు. మూవీ విడుదల కు ముందు వచ్చిన ట్రైలర్కు బీభత్సమైన రెస్పాన్స్ వచ్చింది.జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించనన టైగర్ నాగేశ్వరరావు సినిమా లోని పాటలు కూడా పర్వాలేదనిపించాయి. ముఖ్యంగా జీవీ ప్రకాష్ బీజీఎమ్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.. సినిమాలో రవితేజకు సరసన నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా చేశారు. రేణు దేశాయ్ మరియు అనుపమ్ ఖేర్ వంటి వారు కీలక పాత్రలు పోషించారు.
ఎన్నో అంచనాలు నెలకొన్న ఈ సినిమా ఎట్టకేలకు నేడు (అక్టోబర్ 20) పాన్ ఇండియా స్థాయి లో విడుదల చేశారు. సినిమాకు ఫుల్ పాజిటివ్ టాక్ వస్తోంది.టైగర్ నాగేశ్వరరావు సినిమా లో రవితేజ తన యాక్టింగ్తో రఫ్పాడించేశాడని కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. రవితేజ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడని అంటున్నారు. ఈ నేపథ్యంలో టైగర్ నాగేశ్వరరావు ఓటీటీ వివరాలు ఎంతో ఆసక్తికరంగా మారాయి. టైగర్ నాగేశ్వరరావు డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. ఇందులో తెలుగుతో పాటు అన్ని భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.అయితే, టైగర్ నాగేశ్వరరావు సినిమాను థియేట్రికల్ విడుదల తర్వాత ఓటీటీలో 8 వారాలకు స్ట్రీమింగ్ చేయనున్నారని సమాచారం.. అలా అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తుంది.ఒప్పందం ప్రకారం థియేటర్ల లో దసరాకు విడుదలైన టైగర్ నాగేశ్వరరావు మూవీ ఈ ఏడాది క్రిస్మస్ కానుక గా ఓటీటీ లో స్ట్రీమింగ్ కానుందని సమాచారం.