Saidharam Tej: అనుకున్నంతా అయ్యింది… తెలుగులోనే ‘విరూపాక్ష’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virupaksha: సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ నటించిన పాన్ ఇండియా మిస్టీక్ థ్రిల్లర్ ‘విరూపాక్ష’. నిన్నటి వరకూ ఇదే భావనలో అందరూ ఉన్నారు. అయితే… ఈ సినిమా శుక్రవారం జనం ముందుకు రాబోతున్న నేపథ్యంలో హీరో సాయిధరమ్ తేజ్ ఓ నిజం బయట పెట్టాడు. ప్రస్తుతానికి ఈ సినిమా మొదట తెలుగులోనే రిలీజ్ చేస్తున్నామని, ఇక్కడ గెలిచిన తర్వాతే రచ్చ గెలవడానికి వెళతామని స్పష్టం చేశాడు. ఇటీవల తెలుగు నుండి విడుదలైన పాన్ ఇండియా చిత్రాలు ఇతర రాష్ట్రాలలో ఆశించిన ఫలితాలను పొందకపోవడం కూడా ఈ నిర్ణయానికి ఓ కారణం కావచ్చు.
బుధవారం మీడియాతో సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ మనసులోని మాటలను పంచుకున్నాడు. ‘విరూపాక్ష’ మూవీ స్టోరీ అండ్ టైటిల్ గురించి చెబుతూ, “80, 90వ దశకంలో ఈ కథ సాగుతుంది. వరుసగా జరిగే మిస్టరీ డెత్స్ ఏమిటీ? ఊరి మీద చేతబడి చేశారా? చేస్తే ఎవరు చేసి ఉంటారు? అనే దాని చుట్టూ జరిగే కథ ఇది. నేను చేతబడిని నమ్మను. కానీ ఆంజనేయుడ్ని నమ్ముతాను. ఆయన తోడుంటే మనకు ఏం కాదని నమ్ముతాను. విరూపాక్ష అంటే రూపం లేని కన్ను. అంటే శివుడి మూడో కన్ను. రూపం లేని దాంతో ఈ సినిమాలో పోరాటం చేస్తాం. అందుకే ‘విరూపాక్ష’ అని టైటిల్ పెట్టాం. నేను మొదటిసారి ఇలాంటి జానర్ చేశాను. చాలామంది ఈ సినిమాను ‘కాంతార’తో పోల్చుతున్నారు. అది కల్ట్ క్లాసిక్ మూవీ. ఆ సినిమాకు దీనికి ఎలాంటి సంబంధం ఉండదు” అని అన్నారు. సుకుమార్ గురించి చెబుతూ, “సుకుమార్ రైటింగ్స్ అంటే ప్రేమ కథలుంటాయి. ఈ సినిమాలోనూ అండర్ లైన్గా లవ్ స్టోరీ, ఎమోషన్స్ ఉంటాయి. సినిమా చూశాకా ఆడియెన్స్కే అర్థం అవుతుంది. నేను ఇప్పుడేం చెప్పలేను. ఇది టిపికల్ జానర్. సుకుమార్ ఇచ్చిన స్క్రీన్ ప్లే సినిమాకు అద్భుతంగా సెట్ అయింది. నిజానికి ఈ సినిమా కోసం వర్క్ షాప్స్ చేసిన సమయంలో నా పరిస్థితి ఏం బాగా లేదు. నేను చేయలేని పరిస్థితుల్లో ఉంటే కూడా అడ్జస్ట్ అయ్యేవారు. మా నిర్మాతలు నాకు ఎంతో సపోర్టివ్గా నిలిచారు. నా జీవితం అన్నీ సవాళ్లతోనే నిండింది. నేను ఎప్పుడూ కొత్త సవాళ్లని స్వీకరించేందుకు సిద్దంగానే ఉంటాను. అయినా సవాళ్లనేవి లేకుంటే జీవితం చప్పగా అనిపిస్తుంది” అని అన్నారు.
Also Read
- Secret Soldiers: 'చైనా' పేరుతో సెన్సార్ బోర్డ్లో ప్రకంపనలు.. రంగంలోకి విదేశీ వ్యవహారాల శాఖ!
- Nehal Vadoliya : ప్రాణాలకు ముప్పు ఉంది.. తమన్నా మాజీ ప్రియుడు విజయ్ వర్మపై నటి సంచలన ఆరోపణలు!
- Pranay Reddy Vanga: కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్లకు ఓపెన్ ఛాలెంజ్.. ‘స్పిరిట్’ను ఆపే దమ్ముందా?
- Amit Majithia: స్టార్ క్రికెటర్ల పరువు గంగపాలు? దుబాయ్ రహస్య విందుల్లో బయటపడ్డ దిమ్మతిరిగే నిజాలు!
బైక్ యాక్సిడెంట్ తదనంతర పరిణామాల గురించి చెబుతూ, “ప్రమాదం జరిగిన తర్వాత మళ్లీ నేను సినిమాలు చేస్తానా? లేదా? అని అంతా అనుకున్నారు. కానీ మా అమ్మ 36 సంవత్సరాల వయసులో నాకు మళ్లీ మాటలు నేర్పించారు. ఎంతో సపోర్ట్గా నిలిచారు. మనం ఏది చేసినా కూడా అమ్మానాన్న, గురువు కోసం చేయాలి. జీవితం అంటే కష్టాలు వస్తాయి. వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్ళాలి. కష్టాలను, బాధలను చూసి బాధపడకూడదు. యాక్సిడెంట్ తరువాత చిరంజీవి గారు ఓ కొటేషన్ పంపించారు. ‘ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి.. ఎన్నడూ వదులుకోవద్దురా ఓరిమి’ అంటూ సిరివెన్నెల గారు రాసిన పాటలోని లైన్స్ను పంపించారు” అని చెప్పారు.
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!