నమ్మిన వాళ్ళను మోసం చేయడం దారుణం- వెంకటేష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిత్రపరిశ్రమలో హేటర్స్ లేని ఒకేఒక్క హీరో వెంకటేష్.. ఎప్పుడు వివాదాలకు దూరంగా ఉండే వెంకీ గతకొద్ది రోజులుగా తనలోని భావాలను కోట్స్ రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాడు. అవన్నీ ఇప్పుడు వైరల్ గా మారాయి. మేనల్లుడు నాగచైతన్య- సమంత విడాకులపై ఇప్పటివరకు నోరు మెదపని వెంకీ మామ పరోక్షంగా వారికి ఈ కోట్స్ ద్వారా హితబోధ చేస్తున్నాడా..? అని నెటిజన్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారి విడాకులు అయినప్పటినుంచి అయన పెట్టే కొటేషన్స్ అన్ని ప్రేమ, బంధం, విరహం మీదే ఉండడం ఈ అనుమానాలకు ఆయువు పోస్తున్నాయి.
ఇక తాజాగా వెంకీ పోస్ట్ చేసిన మరో కొటేషన్ నెట్టింట వైరల్ గా మారింది. ” నిన్ను ఇష్టపడేవాళ్ళను ఎప్పుడు దుర్వినియోగం చేయకు.. నువ్వే కావాలనుకుంటున్న వాళ్లకు బిజీగా ఉన్నానని చెప్పకు. ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్ముతారో వాళ్లను ఎప్పుడూ మోసం చేయకు. నిన్ను ఎప్పుడూ గుర్తుపెట్టుకునే వాళ్లని మర్చిపోకు’ అంటూ ఇన్స్టా స్టోరీలో పంచుకున్నారు. ఇక ఈ స్టోరీ కూడా పరోక్షంగా సామ్- చై ల గురించెనని నెట్టింట చర్చ జరుగుతుంది. మరి ఈ విషయమై వెంకీ ఏమైనా స్పందిస్తాడేమో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
Petrol-Diesel Prices: వాహనదారులకు తగలనున్న షాక్.. పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!
-
YS Jagan: హలో ఇండియా అంటూ వైఎస్ జగన్ ఆసక్తికర ట్వీట్..
-
Crispy Ragi Murukku: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. టీతో ఈ రాగి మురుకులు తింటే ఆ మజానే వేరు!
-
CM Chandrababu: శాంతిభద్రతలపై సీఎం కీలక సమీక్ష.. సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు
-
Ragi Halwa: రాగి పిండితో నోరూరించే స్వీట్ హల్వా.. వంట రాని వారు కూడా ఈజీగా చేసేయొచ్చు!