మోహన్ లాల్ ను చూసి స్టన్ అయ్యాను: వెంకటేష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విక్టరీ వెంకటేష్ హీరోగా, జీతూ జోసెఫ్ దర్శకత్వంలో ‘దృశ్యం 2’ చిత్రాన్ని ఆంటోని పెరంబవూర్, రాజ్ కుమార్ సేతుపతి, సురేష్ బాబు సంయుక్తంగా నిర్మించారు. సూపర్ హిట్ థ్రిల్లర్ ‘దృశ్యం’కు సీక్వెల్గా ఈ చిత్రం నవంబర్ 25న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మీడియాతో ముచ్చటించింది.
తొలుత వెంకటేశ్ మాట్లాడుతూ, ” ఇవాళ ‘దృశ్యం 2’ ట్రైలర్ లాంచ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ‘దృశ్యం’ తర్వాత అలాంటి సినిమా మరొకటి చేయాలని అనుకున్నాను. జీతూ ‘దృశ్యం-2’ తో నా వద్దకు వచ్చారు. అది మలయాళంలో చాలా పెద్ద హిట్. దాంతో వెంటనే అంగీకరించాను. పైగా ‘దృశ్యం 2’ చేసేటప్పుడు ఎలాంటికి ఒత్తిడికి గురికాలేదు. మలయాళంలో మోహన్లాల్, మీనా అద్భుతంగా చేశారు. తెలుగులో టీమ్ అంతా చాలా కష్టపడి.. చక్కగా చేశారు. సినిమా నేను చూశాను. చాలా బాగా వచ్చింది. ఇలాంటి ఫ్యామిలీ థ్రిల్లర్ ఈ మధ్యకాలంలో రాలేదు. రాంబాబు క్యారెక్టర్ అందరికీ బాగా నచ్చుతుంది. ఆరేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఆ క్యారెక్టర్ తో, అతని ఫ్యామిలీతో జనం ముందుకు వస్తున్నాం. ఆ పాత్రల్లో ఇప్పటికీ ఓ కనిపించని భయం ఉంది. ఎప్పుడో జరిగిన ఓ హత్యకు సంబంధించి విచారణ ప్రారంభం కావడం… పోలీసుల ఎత్తుకు రాంబాబు పై ఎత్తులు వేయడం… చాలా థ్రిలింగ్గా ఉంటుంది సినిమా. నెక్స్ట్ ఏం జరుగుతుందనేది ఎవరూ గెస్ చేయలేరు. చాలా ట్విస్ట్లు, మలుపులు ఉంటాయి. చాలా ఎమోషనల్గా ఉంటుంది. నా విషయానికి వస్తే…సెట్కు వెళ్లగానే రాంబాబు వచ్చేస్తాడు. ఆ క్యారెక్టర్లో బ్యూటీ అలాంటిది. ఒరిజినల్ క్యారెక్టర్ చేసిన మోహనలాల్ను చూసి స్టన్ అయ్యాను. చాలా సీన్స్ నా హృదయానికి దగ్గరగా ఉన్నాయి. కోవిడ్ కారణంగా ఒక్క చిన్న టౌన్లో ఉండి సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేశాం” అని చెప్పారు. జీతూ మాట్లాడుతూ.. ”దర్శకుడు రాజమౌళి నుంచి ఈ మూవీకి మాస్టర్ పీస్ అనే కాంప్లిమెంట్ రావడం నిజంగా నమ్మలేకపోయాను. నేను హైదరాబాద్లో నా ఫ్యామిలీతో ఉన్నప్పుడు రాజమౌళి నుంచి మెసేజ్ వచ్చింది. రాజమౌళి పేరు చెప్పకుండా నా భార్య, పిల్లలకు ఆ మెసేజ్ చదివి వినిపించాను. నా కూతురు ఎవరూ పంపారు? అని అడిగింది. నేను రాజమౌళి అని చెప్పాను. కానీ నేను ట్రిక్స్ ప్లే చేస్తున్నానని నవ్వింది. కానీ తర్వాత మెసేజ్ చూసి.. ఆశ్చర్యంతో జంప్ చేసింది. గొప్ప దర్శకుడి నుంచి అలాంటి మెసేజ్ రావడం.. ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను. తర్వాత నేను వెంటనే దానిని ఫేస్బుక్, ఇన్స్టాలో పోస్ట్ చేశాను. నిజం చెప్పాలంటే.. తెలుగు వెర్షన్లో ఎలాంటి పెద్ద మార్పులు చేయలేదు. కల్చరల్గా కొన్ని మార్పులు చేశాం. ప్రజెంటేషన్లో కొంత మార్పు చేశాం. అంతే” అని అన్నారు.
Also Read
- Mohanlal: కుర్ర హీరోలకే షాకిచ్చేలా .. ఒకేసారి 7 స్టార్ డైరెక్టర్లతో సినిమాలు అనౌన్స్ చేసిన లెజెండరీ హీరో!
- Prabhas-Hanu Raghavapudi: ‘ఫౌజీ’తో ఆగదట.. హను రాఘవపూడితో ప్రభాస్ మరోసారి జతకట్టనున్నాడా?
- Vishwanath & Sons : 4 రోజుల్లో ₹150 కోట్ల మార్క్ దాటిన 'విశ్వనాథ్ & సన్స్'!
- Varanasi: ‘వారణాసి’పై జక్కన్న మరో క్రేజీ ప్లాన్.. షూటింగ్ వెనుక సీక్రెట్స్ అన్నీ బయట పెడతాడట?
మంచి ఫిల్మ్ ఎక్కువ కాలం హోల్డ్లో ఉంచకూడదని ‘దృశ్యం-2’ను అమెజాన్లో విడుదల చేస్తున్నామని, ఇంకా ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి జంకుతుండటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని నిర్మాతల్లో ఒకరైన రాజ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ‘దృశ్యం’ దర్శకురాలు శ్రీప్రియ, హీరోయిన్ మీనా, నటి ఎస్తర్, నరేశ్, సుజా, సంపత్ తదితరులు మాట్లాడారు.
తాజావార్తలు
-
VMC Contractors Strike: వీఎంసీ కాంట్రాక్టర్లతో మంత్రి నారాయణ చర్చలు సఫలం.. సమ్మె విరమణ
-
Sonia Gandhi: ‘బిలాంగింగ్’ పేరుతో సోనియాగాంధీ ఆత్మకథ.. రాజీవ్గాంధీతో ప్రేమ ముచ్చట్లు
-
Hockey World Cup 2026: మహిళల హాకీ ప్రపంచకప్లో భారత్ జోరు.. దక్షిణాఫ్రికాపై 6-1 ఘన విజయం
-
TGSRTC Bus Route Changes: కేబీఆర్ పార్క్ చుట్టూ వన్వే ఎఫెక్ట్… ఆర్టీసీ బస్సు రూట్లలో కీలక మార్పులు.. పూర్తి వివరాలు ఇవిగో..
-
Sheikh Hasina: షేక్ హసీనా అప్పగింతపై కేంద్రం కీలక ప్రకటన
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!