మోహన్ లాల్ ను చూసి స్టన్ అయ్యాను: వెంకటేష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విక్టరీ వెంకటేష్ హీరోగా, జీతూ జోసెఫ్ దర్శకత్వంలో ‘దృశ్యం 2’ చిత్రాన్ని ఆంటోని పెరంబవూర్, రాజ్ కుమార్ సేతుపతి, సురేష్ బాబు సంయుక్తంగా నిర్మించారు. సూపర్ హిట్ థ్రిల్లర్ ‘దృశ్యం’కు సీక్వెల్గా ఈ చిత్రం నవంబర్ 25న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మీడియాతో ముచ్చటించింది.
తొలుత వెంకటేశ్ మాట్లాడుతూ, ” ఇవాళ ‘దృశ్యం 2’ ట్రైలర్ లాంచ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ‘దృశ్యం’ తర్వాత అలాంటి సినిమా మరొకటి చేయాలని అనుకున్నాను. జీతూ ‘దృశ్యం-2’ తో నా వద్దకు వచ్చారు. అది మలయాళంలో చాలా పెద్ద హిట్. దాంతో వెంటనే అంగీకరించాను. పైగా ‘దృశ్యం 2’ చేసేటప్పుడు ఎలాంటికి ఒత్తిడికి గురికాలేదు. మలయాళంలో మోహన్లాల్, మీనా అద్భుతంగా చేశారు. తెలుగులో టీమ్ అంతా చాలా కష్టపడి.. చక్కగా చేశారు. సినిమా నేను చూశాను. చాలా బాగా వచ్చింది. ఇలాంటి ఫ్యామిలీ థ్రిల్లర్ ఈ మధ్యకాలంలో రాలేదు. రాంబాబు క్యారెక్టర్ అందరికీ బాగా నచ్చుతుంది. ఆరేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఆ క్యారెక్టర్ తో, అతని ఫ్యామిలీతో జనం ముందుకు వస్తున్నాం. ఆ పాత్రల్లో ఇప్పటికీ ఓ కనిపించని భయం ఉంది. ఎప్పుడో జరిగిన ఓ హత్యకు సంబంధించి విచారణ ప్రారంభం కావడం… పోలీసుల ఎత్తుకు రాంబాబు పై ఎత్తులు వేయడం… చాలా థ్రిలింగ్గా ఉంటుంది సినిమా. నెక్స్ట్ ఏం జరుగుతుందనేది ఎవరూ గెస్ చేయలేరు. చాలా ట్విస్ట్లు, మలుపులు ఉంటాయి. చాలా ఎమోషనల్గా ఉంటుంది. నా విషయానికి వస్తే…సెట్కు వెళ్లగానే రాంబాబు వచ్చేస్తాడు. ఆ క్యారెక్టర్లో బ్యూటీ అలాంటిది. ఒరిజినల్ క్యారెక్టర్ చేసిన మోహనలాల్ను చూసి స్టన్ అయ్యాను. చాలా సీన్స్ నా హృదయానికి దగ్గరగా ఉన్నాయి. కోవిడ్ కారణంగా ఒక్క చిన్న టౌన్లో ఉండి సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేశాం” అని చెప్పారు. జీతూ మాట్లాడుతూ.. ”దర్శకుడు రాజమౌళి నుంచి ఈ మూవీకి మాస్టర్ పీస్ అనే కాంప్లిమెంట్ రావడం నిజంగా నమ్మలేకపోయాను. నేను హైదరాబాద్లో నా ఫ్యామిలీతో ఉన్నప్పుడు రాజమౌళి నుంచి మెసేజ్ వచ్చింది. రాజమౌళి పేరు చెప్పకుండా నా భార్య, పిల్లలకు ఆ మెసేజ్ చదివి వినిపించాను. నా కూతురు ఎవరూ పంపారు? అని అడిగింది. నేను రాజమౌళి అని చెప్పాను. కానీ నేను ట్రిక్స్ ప్లే చేస్తున్నానని నవ్వింది. కానీ తర్వాత మెసేజ్ చూసి.. ఆశ్చర్యంతో జంప్ చేసింది. గొప్ప దర్శకుడి నుంచి అలాంటి మెసేజ్ రావడం.. ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను. తర్వాత నేను వెంటనే దానిని ఫేస్బుక్, ఇన్స్టాలో పోస్ట్ చేశాను. నిజం చెప్పాలంటే.. తెలుగు వెర్షన్లో ఎలాంటి పెద్ద మార్పులు చేయలేదు. కల్చరల్గా కొన్ని మార్పులు చేశాం. ప్రజెంటేషన్లో కొంత మార్పు చేశాం. అంతే” అని అన్నారు.
Also Read
- Maharani Season 5: ఐదేళ్లుగా ఓటీటీని ఏలుతున్న పొలిటికల్ థ్రిల్లర్.. ఇప్పుడు ఐదో సీజన్కు కౌంట్డౌన్!
- OTT Releases: థ్రిల్లర్ నుంచి రొమాన్స్ వరకు...ఈ వారం ఓటీటీలో ఎంటర్టైన్మెంట్ జాతర..
- Suriya47: దీపావళి బరిలో 'సూర్య47'?.. హ్యాట్రిక్ రిలీజ్కు స్టార్ హీరో రెడీ!
- Dhanush : ధనుష్ నెక్ట్స్ లక్ష్యం రాజకీయాలేనా...? అగ్రెసివ్ స్పీచ్ ఇచ్చి ఫ్యాన్స్ను రెచ్చగొట్టాడా..?
మంచి ఫిల్మ్ ఎక్కువ కాలం హోల్డ్లో ఉంచకూడదని ‘దృశ్యం-2’ను అమెజాన్లో విడుదల చేస్తున్నామని, ఇంకా ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి జంకుతుండటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని నిర్మాతల్లో ఒకరైన రాజ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ‘దృశ్యం’ దర్శకురాలు శ్రీప్రియ, హీరోయిన్ మీనా, నటి ఎస్తర్, నరేశ్, సుజా, సంపత్ తదితరులు మాట్లాడారు.
తాజావార్తలు
-
RCB Brand Value: ఐపీఎల్లో ఆర్సీబీ ఆల్ టైమ్ రికార్డ్.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ ఫ్రాంచైజీగా..
-
Maharani Season 5: ఐదేళ్లుగా ఓటీటీని ఏలుతున్న పొలిటికల్ థ్రిల్లర్.. ఇప్పుడు ఐదో సీజన్కు కౌంట్డౌన్!
-
Marriage Cheating Case: ఎంతకు తెగించార్రా.. అమ్మాయి అని చెప్పి ట్రాన్స్జెండర్తో పెళ్లి చేశారంటూ యువకుడు ఫిర్యాదు
-
Abhijeet Dipke: ప్రధాని పదవి వదిలి ఇన్ఫ్లూయెన్సర్ అవ్వండి: మోదీపై అభిజిత్ దీప్కే సెటైర్లు
-
Assam Floods: అస్సాంలో ముంచెత్తిన వరదలు.. 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం
ట్రెండింగ్
-
Ajinkya Rahane Retirement: అజింక్య రహానే రిటైర్మెంట్.. ఇకపై క్రికెట్ ఆడనంటూ భావోద్వేగ పోస్ట్!
-
Vaibhav Sooryavanshi: నేను ఏ బౌలర్కు భయపడను.. వారే నన్ను చూసి వణికిపోతున్నారు!
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!