35 ఏళ్ళ ‘కలియుగ పాండవులు’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
(ఆగస్టు 14న ‘కలియుగ పాండవులు’కు 35 ఏళ్ళు పూర్తి)
విక్టరీ వెంకటేశ్ హీరోగా తెరపై కనిపించిన తొలి చిత్రం ‘కలియుగ పాండవులు’ ఆగస్టు 14తో 35 ఏళ్ళు పూర్తి చేసుకుంటోంది. అంటే, హీరోగా వెంకటేశ్ 35 ఏళ్ళు పూర్తి చేసుకున్నారన్న మాట! తొలి చిత్రంతోనే హీరోగా సక్సెస్ ను సొంతం చేసుకున్నారు వెంకటేశ్. ఈ చిత్రాన్ని కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో డి.రామానాయుడు తమ సురేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించారు. ఈ చిత్రం ద్వారాను ఖుష్బూ తెలుగు తెరకు పరిచయం అయ్యారు.
‘కలియుగ పాండవులు’ కథలో హీరో విజయ్ మొదట్లో దుర్యోధనునిలా కనిపిస్తాడు. తన ధనగర్వంతో ఇతరులను చులకనగా చూస్తూంటాడు. తనకు నచ్చిన అమ్మాయి భారతిని చెరపట్టాలని చూస్తాడు. అదే అతనిలోని మనిషిని నిద్రలేపుతుంది. భారతి మంచితనం తెలిసి, ఆమెను ప్రేమిస్తాడు. పెళ్ళి చేసుకోవాలనుకుంటాడు. అయితే విజయ్ తండ్రి కోటీశ్వరుడైన చక్రపాణి అందుకు అంగీకరించడు. అంతేకాదు, ఓ ప్లాన్ ప్రకారం భారతిని వేశ్యగా చిత్రీకరిస్తారు. అందుకు ఎమ్.ఎల్.ఏ. ఏకాంబరం, డాక్టర్ వాయునందనరావు, ఎస్.ఐ. మూర్తి, లాయర్ జలంధరరావు, భూదేవి అనే ఆమె సహకరిస్తారు. వీరితో పాటు భారతి బావ భైరవమూర్తి కూడా చేయి కలుపుతాడు. ఎందుకంటే భైరవ, భారతిని పెళ్ళాడాలని చూస్తాడు. చివరకు అవమానభారంతో భారతి ఆ ఊరు వదలి వెళ్తుంది. దాంతో తండ్రితో పోట్లాడి విజయ్ ఇంటి నుండి బయటకు వస్తాడు. భారతి కథ తెలుసుకున్న భీష్మనారాయణ అనే వ్యక్తి, ఆమెకు అండగా నిలుస్తాడు. ఆయన కూడా ఒకప్పుడు ఈ దుర్మార్గుల కారణంగా నష్టపోయి ఉంటాడు. భీష్మనారాయణ ఆదేశంతో విజయ్, అతని ముగ్గురు మిత్రులు, భారతి కలసి ‘కలియుగ పాండవులు’గా మారి అన్యాయాలను అక్రమాలను ఎదుర్కొంటూ ఉంటారు. చివరకు అసలు నేరస్థులను చట్టానికి పట్టిస్తారు. భారతి నిర్దోషి అని నిరూపిస్తారు. భవిష్యత్ లోనూ అన్యాయానికి గురయిన వారిని ఆదుకొనేందుకు ‘కలియుగ పాండవులు’ కొనసాగడంతో కథ ముగుస్తుంది.
Also Read
- Hrudayam Murali: ‘బాయ్స్’ తర్వాత మళ్లీ నటుడిగా తమన్.. 'హృదయం మురళి' ట్రైలర్ చూశారా?
- Tollywood : నిర్మాతల్లో మొదలైన మార్పు.. ఇక హీరోలకు నో రెమ్యునరేషన్స్
- Jayam Ravi: "నన్ను క్షమించండి.. ఇకపై మోసం చేయను".. భావోద్వేగానికి గురైన స్టార్ హీరో!
- Tridha Choudhury : నరకం చూశాను.. గదిలో బందీనై రోజూ ఏడ్చేదాన్ని: స్టార్ నటి షాకింగ్ నిజాలు!
వెంకటేశ్, ఖుష్బూ జంటగా నటించిన ఈ చిత్రంలో రావు గోపాలరావు, సరిత, అశ్వినీ, నూతన్ ప్రసాద్, రంగనాథ్, రాళ్ళపల్లి, శక్తి కపూర్, రాధారవి, రాజీవ్, నర్రా వెంకటేశ్వరరావు, చలపతిరావు, జె.వి.సోమయాజులు, పి.జె.శర్మ, పి.ఎల్.నారాయణ, మిక్కిలినేని, సూర్య, చిట్టిబాబు నటించారు. ఈ చిత్రానికి కథ, మాటలు పరుచూరి బ్రదర్స్ సమకూర్చగా, కె.ఎస్.ప్రకాశ్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు. వేటూరి పాటలకు చక్రవర్తి సంగీతం తోడై అలరించింది. “ఒక పాపకు పదహారేళ్ళు…”, “హా హా హా ఆగవా…”, “నేను పుట్టినరోజు…”, “ఎందుకో ఒళ్ళు…”, “బుగ్గా బుగ్గా చెప్పాలి…”, “ఈ కౌరవ ఈ దానవ …” పాటలు ఆకట్టుకున్నాయి.
‘కలియుగ పాండవులు’ చిత్రం మంచి విజయం సాధించింది. వెంకటేశ్ ను హీరోగా నిలిపింది. ఖుష్బూకు తెలుగులో ఆదరణ లభించేలా చేసింది. వెంకటేశ్ అభిమానులు ఇప్పటికీ ఈ చిత్రాన్ని గుర్తు చేసుకుని మురిసిపోతూనే ఉండడం విశేషం!
తాజావార్తలు
-
Satya Dev: రావు బహదూర్’లో నగ్నంగా నటించాలన్నారు
-
Shreyas Iyer: మ్యాచ్ ఫలితాలతో సంబంధం లేదు.. కెప్టెన్గా ఆ రికార్డ్ సాధించిన శ్రేయాస్ అయ్యర్..
-
IND Vs ENG: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. జట్టులోకి యువ ప్లేయర్..
-
Hormuz Tank Attacks: హోర్ముజ్ జలసంధిలో యుద్ధ వాతావరణం.. 24 గంటల్లో 3 ఆయిల్ ట్యాంకర్లపై దాడులు!
-
CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ ఓపెన్ ఛాలెంజ్.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వేడి ఆలూ తొక్క.. 10 సెకన్లలో ఊడిపోతుంది.! ఈ ట్రిక్ తెలుసా.?
-
Kitchen Tips : కుక్కర్లో అన్నం ముద్ద అవుతుందా? ఈ ట్రిక్తో మల్లెపూవులా వస్తుంది!
-
టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఒక్క రోజులో 5 అద్భుత గమ్యస్థానాలు.! TSTDC అదిరిపోయే టూర్ ప్యాకేజీ.!
-
7,200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Vivo నుంచి కొత్త G5i, G5z స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
Black Jamun Jam: ప్రిజర్వేటివ్స్ అవసరం లేకుండానే.. 6 నెలలు నిల్వ ఉండే ‘నేరేడు జామ్’ ఇంట్లోనే చేయండి ఇలా.!