Mega Prince: వరుణ్ తేజ్ హీరోగా ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో సినిమా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు, హిందీ భాషల్లో రూపుదిద్దుకున్న ‘మేజర్’ మూవీ నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరించిన సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ఇప్పుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో ద్విభాషా చిత్రాన్ని నిర్మిస్తోంది. రెనైసెన్స్ పిక్చర్స్ తో కలిసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో భారీ యాక్షన్ డ్రామాను ప్రారంభించింది. 2014లో ‘ముకుంద’ సినిమాతో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్ ఇప్పుడు ఈ మూవీతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టబోతున్నాడు. సోమవారం హైదరాబాద్ లోని చిత్ర నిర్మాణ సంస్థ కార్యాలయంలో జరిగిన పూజ కార్యక్రమాలతో సినిమా ప్రారంభమైయింది. వరుణ్ తేజ్ తల్లి, పద్మజా కొణిదెల కెమెరా స్విచ్ ఆన్ చేయగా, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు క్లాప్ ఇచ్చారు. తొలి సన్నివేశానికి బాపినీడు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో అనుభవజ్ఞుడైన యాడ్-ఫిల్మ్ మేకర్, సినిమాటోగ్రాఫర్, వీ ఎఫ్ ఎక్స్ పై గొప్ప ప్యాషన్ వున్న శక్తి ప్రతాప్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
Also Read
- Tollywood : చేతులు దాటుతున్న సినిమా బడ్జెట్లు.. కుదేలవుతున్న టాలీవుడ్ నిర్మాతలు!
- Peddi : 'పెద్ది' ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్... డిలీటెడ్ సీన్లన్నీ ఇక్కడ చూడొచ్చు
- Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
- Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!



ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ, ”ఇండియన్ ఎయిర్ఫోర్స్ ఆఫీసర్ గా నటించే అవకాశం రావడంతో పాటు బిగ్ స్క్రీన్పై వారి సాహసాలని చూపిస్తుండటం గర్వంగా భావిస్తున్నాను. గ్లోబల్ దిగ్గజం సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, సందీప్ ముద్దా, దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ భాగస్వామ్యంతో మేం చేస్తున్న ఈ చిత్రం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి గొప్ప నివాళి. ఈ చిత్రంలో ఇదివరకు ఎన్నడూ చేయని పాత్రని చేస్తున్నాను. నా పాత్రలో చాలా లేయర్స్ వుంటాయి. ఈ పాత్రకోసం ప్రత్యేకమైన శిక్షణ పొందాను” అని అన్నారు.
ఇండియా సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ జనరల్ మేనేజర్ లాడా గురుదేన్ సింగ్ మాట్లాడుతూ, ”ఒక స్టూడియోగా దేశం గర్వించదగ్గ నిజమైన హీరోల కథలను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం. మా గత చిత్రం ‘మేజర్’ కూడా అదే కోవకు చెందిన సినిమా. ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన సినిమాటిక్ అనుభూతిని అందించడానికి వరుణ్ తేజ్, శక్తి ప్రతాప్ సింగ్, సందీప్ ముద్దాతో కలిసి పని చేయడంపై ఆనందంగా ఉంది” అని చెప్పారు. నిర్మాత సందీప్ ముద్దా మాట్లాడుతూ, ”ఈ సినిమా ప్రయాణంలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉన్నాను. అందరూ కలిసి ఒక గొప్ప చిత్రాన్ని ఇవ్వడం కోసం కష్టపడుతున్నాం. నవంబర్ లో సెట్స్పైకి వెళ్ళబోతున్న ఈ చిత్రం 2023లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది” అని చెప్పారు.
తాజావార్తలు
-
నేటి నుంచి FIFA World Cup షురూ.. ఆటలో కొత్త నియమాలు ఇవే.!
-
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ మూడు రాశుల వారికి నేడు పండగే!
-
Tollywood : చేతులు దాటుతున్న సినిమా బడ్జెట్లు.. కుదేలవుతున్న టాలీవుడ్ నిర్మాతలు!
-
Strait of Hormuz Closure: ఇరాన్ తీవ్ర హెచ్చరిక.. హార్మూజ్ గుండా వచ్చే నౌకలపై దాడులకు సిద్ధం.. చమురు సరఫరాకు ముప్పు
-
Peddi : ‘పెద్ది’ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… డిలీటెడ్ సీన్లన్నీ ఇక్కడ చూడొచ్చు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!