Vamsi Paidipally: ఎవడ్రా సీరియల్ ను తక్కువ చేసి మాట్లాడింది.. మీకు తెలుసా వారి కష్టం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vamsi Paidipally: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, రష్మిక జంటగా తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వారసుడు. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే తెలుగు, తమిళ్ లో కూడా ఈ సినిమా సీరియల్ లా అనిపిస్తోందని, ల్యాగ్ ఎక్కువ అవ్వడమే కాకుండా కుటుంబ కథా చిత్రమని, విజయ్ తో వంశీ సీరియల్ తీశాడని ట్రోల్స్ చేస్తున్నారు. ముఖ్యంగా తమిళ్ తంబీలు.. తెలుగు డైరెక్టర్ ను ఆడుకుంటున్నారు. తెలుగు సీరియల్ ను తమిళ్ వారికి ఇచ్చాడంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇక ఈ ట్రోల్స్ పై వంశీ గట్టిగా ఫైర్ అయ్యాడు. తమ సినిమాను సీరియల్ అని ఎలా అంటారని, ఒక సినిమా ఎంతమంది కష్టమో మీకు తెలుసా..? అని మండిపడ్డాడు.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వంశీ పైడిపల్లి మాట్లాడుతూ.. “సీరియల్, సీరియల్ అంటున్నారు.. అసలు సీరియల్ ను అంత డీగ్రేడ్ చేసి ఎలా మాట్లాడతారు. అసలు సీరియల్ అంటే అంత తక్కువ అని ఎవరు చెప్పారు. ఎంతోమంది మహిళలకు సాయంత్రం ఎంటర్ టైన్ చేసేవి సీరియల్స్..సినిమా లాగే సీరియల్ కూడా క్రియేటివ్ వర్క్. అయినా ఒక సినిమాను సీరియల్స్ తో ఎలా పోలుస్తారు. వారు పడిన కష్టం ఎలాంటిదో మీకు తెలుసా.,.? విజయ్ ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో తెలుసా..? నిర్మాతలు ఈ సినిమా కోసం ఎంత ఖర్చు పెట్టారో తెలుసా..? సినిమా సీరియల్ లా ఉందని ఎలా పోల్చి చెబుతారు అంటూ సీరియస్ అయ్యారు. ఫైనల్ జడ్జిమెంట్ అనేది ప్రేక్షకుల నుంచి వస్తుంది. అది అసలైన రివ్యూ. మేము దాన్ని అంగీకరిస్తాం. మీరెలా సీరియల్ లా ఉందని రివ్యూలు రాస్తారు.అసలు సినిమా సిరియా ఉందని మీరెలా జడ్జ్ చేస్తారు.. ఇది పద్దతి కాదు” అంటూ మండిపడ్డాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
Also Read
- The Odyssey: రూ.2000 కోట్ల బడ్జెట్.. నోలన్ మ్యాజిక్కు ఇండియా ఫిదా.. 'ది ఒడిస్సీ'కి అదిరిపోయే ఓపెనింగ్!
- Fauji: ఇన్స్టాగ్రామ్ను షేక్ చేసిన ప్రభాస్.. 'ఫౌజీ' ఫస్ట్ లుక్తో ఆల్టైమ్ రికార్డు!
- The RajaSaab: థియేటర్లలో నిరాశ.. ఓటీటీలో దుమ్మురేపిన 'ది రాజాసాబ్'.. ప్రభాస్కు మరో అరుదైన రికార్డు!
- Mahesh Babu-Varanasi: రెడీ అయిపోండమ్మా.. బాబు బర్త్డేకు భారీ సర్ప్రైజ్?
తాజావార్తలు
-
UCC Bill: ‘ఒక్క పెళ్లి చేసుకున్నవారికే రాష్ట్రంలో ఉండే హక్కు’.. సీఎం సంచలన ప్రకటన..
-
CM Chandrababu : అమరావతి దేవతల రాజధాని.. నవ్యాంధ్రను నెంబర్ వన్ చేయడమే నా లక్ష్యం
-
Success Story: 20 గంటల పోలీసు డ్యూటీ, గర్భం, రెండు వైఫల్యాలు..అయినా ఒక రైతు కూతురు డీఎస్పీ అయింది..
-
Shocking Statistics: 6 నెలల్లో 554 మంది భర్తల మృతి.. దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన సంచలన నివేదిక!
-
Pawan Kumar Chandana: మ్యాథ్స్లో 51 మార్కులు.. నేడు భారత తొలి ప్రైవేట్ రాకెట్ విజయవంతం.. హైదరాబాద్ కుర్రాడి విజయగాథ!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!