అప్పుడలా… ఇప్పుడిలా…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏ మనిషినైనా మంచివాడుగా, చెడ్డవాడుగా చిత్రీకరించేవి – అతని చుట్టూ ఉన్న పరిస్థితులే అని చెప్పవచ్చు. ఓ మనిషి దొంగకావడానికి అతనికి ఎదురైన పరిస్థితులు ఏంటి అని చర్చించవలసి ఉంటుంది. ఈ కోణంలో ఆలోచించే కరడు కట్టిన నేరస్థులలో సైతం పరివర్తన కలిగించాలని సామాజిక ఉద్యమకారులు గోరా, ఆయన కోడలు హేమలతా లవణం నడుం బిగించారు. ఎందరో దొంగలలో సత్ర్పవర్తన కలిగేలా చేశారు. అలా ప్రకాశం జిల్లాలో స్టూవర్ట్ పురం అనే ఊరిలో దొంగలలో మార్పు తీసుకు రాగలిగారు. అప్పట్లో రాష్ట్రంలో ఏదైనా పెద్ద దొంగతనం జరిగితే, అందులో స్టూవర్ట్ పురం దొంగల పాత్ర ఏమైనా ఉందా అని పోలీసులు ఆరా తీసేవారు. ఈ విషయాలను చర్చిస్తూ ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ 1990లో ‘స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్’ అనే సీరియల్ రాశారు. తరువాత అదే నవలగా వెలుగు చూసింది. ఈ కథతోనే మెగాస్టార్ చిరంజీవి, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి జంటగా కె.ఎస్.రామారావు, ఆ కథారచయిత యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వంలోనే ‘స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్’ చిత్రం నిర్మించారు. 1991 జనవరిలో సంక్రాంతి బరిలో ‘స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్’ నిలచింది. కానీ, జనం మదిని గెలవలేకపోయింది.
సరిగా ‘స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్’ విడుదలయిన సమయంలోనే అదే స్టూవర్ట్ పురం వాసుల నేపథ్యంలో ‘స్టూవర్ట్ పురం దొంగలు’ సినిమా తెరకెక్కింది. సాగర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో భానుచందర్, చరణ్ రాజ్, నాజర్, వల్లభనేని జనార్దన్, బాబూ మోహన్ నటించారు. చిత్రమేమంటే, టాప్ స్టార్స్ ఉన్న ‘స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్’ కంటే ‘స్టూవర్ట్ పురం దొంగలు’ జనాన్ని ఆకట్టుకుంది.
Also Read
- The Paradise: నానీ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్.. ఆగస్టు రేసు నుంచి తప్పుకున్న ‘ది ప్యారడైజ్’? కారణం ఇదేనట!
- Nag Ashwin: నిజమైన స్టార్డమ్ అంటే ఇదేనేమో! చెన్నై ఈవెంట్లో వైరల్ అవుతున్న నాగ్ అశ్విన్ వీడియో..
- Raghava Lawrence : జూన్ 11న రాజకీయ ఎంట్రీపై రాఘవ లారెన్స్ కీలక ప్రకటన..
- Raviteja : 'ఇరుముడి' రిలీజ్ డేట్ వచ్చేసింది.. సరైన డేట్ లాక్ చేసిన మేకర్స్
కట్ చేస్తే… మళ్ళీ ఇన్నాళ్ళకు స్టూవర్ట్ పురం నేపథ్యంలో రెండు చిత్రాలు తెరకెక్కనున్నాయి. అందులో ఒక సినిమాను బెల్లంకొండ సురేశ్, తన తనయుడు సాయిశ్రీనివాస్ హీరోగా ‘స్టూవర్ట్ పురం దొంగ’ పేరుతో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కె.ఎస్. దర్శకత్వం వహించనున్నారు. ఆగస్టు 11వ తేదీనే ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువడింది. అదే స్టూవర్ట్ పురం బ్యాక్ డ్రాప్ లో ఇంకో సినిమాగా ‘టైగర్ నాగేశ్వరరావు’ రూపొందనున్నట్టు నవంబర్ 3న ప్రకటించారు. ఈ చిత్రంలో రవితేజ కథానాయకుడు. ఇంతకు ముందు ‘దొంగాట, కిట్టూ ఉన్నాడు జాగ్రత్త’ చిత్రాలు తెరకెక్కించిన వంశీ ఈ ‘టైగర్ నాగేశ్వరరావు’ను రూపొందించనున్నారు. ఈ ప్రకటన రాగానే దీపావళి సందర్భంగా బెల్లంకొండ సాయిశ్రీనివాస్ తో తెరకెక్కబోయే ‘స్టూవర్ట్ పురం దొంగ’ లుక్ రిలీజ్ కావడం గమనార్హం! దీంతో ఆ నాటి రోజులు గుర్తుకు వచ్చాయి. 30 ఏళ్ళ క్రితం స్టూవర్ట్ పురం నేపథ్యంలోనే రెండు చిత్రాలు విడుదలై చర్చ సాగింది. మళ్ళీ ఇన్నాళ్ళకు అదే స్టూవర్ట్ పురం బ్యాక్ డ్రాప్ లో మరో రెండు చిత్రాలు తెరకెక్కబోవడం విశేషమే మరి. ఈ సినిమాలు ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తాయో, వీటిలో ఏ చిత్రం జనం మదిని దోచేస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Ashok Gehlot: కాంగ్రెస్లో నాపై కుట్ర.. అధ్యక్ష పదవి లాక్కున్నారు
-
Russia: చమురు మార్కెట్ను భారత్ శాసిస్తుంది.. రష్యా సంచలన వ్యాఖ్యలు..
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
The Paradise: నానీ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్.. ఆగస్టు రేసు నుంచి తప్పుకున్న ‘ది ప్యారడైజ్’? కారణం ఇదేనట!
-
School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా, సంక్రాంతి సెలవుల ప్రకటన.. ఎన్నిరోజులంటే..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!