అప్పుడలా… ఇప్పుడిలా…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏ మనిషినైనా మంచివాడుగా, చెడ్డవాడుగా చిత్రీకరించేవి – అతని చుట్టూ ఉన్న పరిస్థితులే అని చెప్పవచ్చు. ఓ మనిషి దొంగకావడానికి అతనికి ఎదురైన పరిస్థితులు ఏంటి అని చర్చించవలసి ఉంటుంది. ఈ కోణంలో ఆలోచించే కరడు కట్టిన నేరస్థులలో సైతం పరివర్తన కలిగించాలని సామాజిక ఉద్యమకారులు గోరా, ఆయన కోడలు హేమలతా లవణం నడుం బిగించారు. ఎందరో దొంగలలో సత్ర్పవర్తన కలిగేలా చేశారు. అలా ప్రకాశం జిల్లాలో స్టూవర్ట్ పురం అనే ఊరిలో దొంగలలో మార్పు తీసుకు రాగలిగారు. అప్పట్లో రాష్ట్రంలో ఏదైనా పెద్ద దొంగతనం జరిగితే, అందులో స్టూవర్ట్ పురం దొంగల పాత్ర ఏమైనా ఉందా అని పోలీసులు ఆరా తీసేవారు. ఈ విషయాలను చర్చిస్తూ ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ 1990లో ‘స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్’ అనే సీరియల్ రాశారు. తరువాత అదే నవలగా వెలుగు చూసింది. ఈ కథతోనే మెగాస్టార్ చిరంజీవి, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి జంటగా కె.ఎస్.రామారావు, ఆ కథారచయిత యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వంలోనే ‘స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్’ చిత్రం నిర్మించారు. 1991 జనవరిలో సంక్రాంతి బరిలో ‘స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్’ నిలచింది. కానీ, జనం మదిని గెలవలేకపోయింది.
సరిగా ‘స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్’ విడుదలయిన సమయంలోనే అదే స్టూవర్ట్ పురం వాసుల నేపథ్యంలో ‘స్టూవర్ట్ పురం దొంగలు’ సినిమా తెరకెక్కింది. సాగర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో భానుచందర్, చరణ్ రాజ్, నాజర్, వల్లభనేని జనార్దన్, బాబూ మోహన్ నటించారు. చిత్రమేమంటే, టాప్ స్టార్స్ ఉన్న ‘స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్’ కంటే ‘స్టూవర్ట్ పురం దొంగలు’ జనాన్ని ఆకట్టుకుంది.
Also Read
- AP Theatres Crisis: టికెట్ ధరలు పెంచొద్దు.. ఏపీ సినీ ఎగ్జిబిటర్ల ఫోరం కీలక డిమాండ్లు..
- Tollywood : హాలీవుడ్ నుండి విలన్స్ను దిగుమతి చేస్తోన్న టాలీవుడ్
- Hanuman Ansh: అప్పుడు సహాయం చేయలేదు.. ఇప్పుడేమో పొగుడుతున్నారు.. బాలీవుడ్పై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!
- Baljit Singh: ఇంట్లో కుళ్లిన స్థితిలో పంజాబీ గాయకుడి మృతదేహం.. రక్తపు మరకలు, చివరికి షాకింగ్ ట్విస్ట్!
కట్ చేస్తే… మళ్ళీ ఇన్నాళ్ళకు స్టూవర్ట్ పురం నేపథ్యంలో రెండు చిత్రాలు తెరకెక్కనున్నాయి. అందులో ఒక సినిమాను బెల్లంకొండ సురేశ్, తన తనయుడు సాయిశ్రీనివాస్ హీరోగా ‘స్టూవర్ట్ పురం దొంగ’ పేరుతో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కె.ఎస్. దర్శకత్వం వహించనున్నారు. ఆగస్టు 11వ తేదీనే ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువడింది. అదే స్టూవర్ట్ పురం బ్యాక్ డ్రాప్ లో ఇంకో సినిమాగా ‘టైగర్ నాగేశ్వరరావు’ రూపొందనున్నట్టు నవంబర్ 3న ప్రకటించారు. ఈ చిత్రంలో రవితేజ కథానాయకుడు. ఇంతకు ముందు ‘దొంగాట, కిట్టూ ఉన్నాడు జాగ్రత్త’ చిత్రాలు తెరకెక్కించిన వంశీ ఈ ‘టైగర్ నాగేశ్వరరావు’ను రూపొందించనున్నారు. ఈ ప్రకటన రాగానే దీపావళి సందర్భంగా బెల్లంకొండ సాయిశ్రీనివాస్ తో తెరకెక్కబోయే ‘స్టూవర్ట్ పురం దొంగ’ లుక్ రిలీజ్ కావడం గమనార్హం! దీంతో ఆ నాటి రోజులు గుర్తుకు వచ్చాయి. 30 ఏళ్ళ క్రితం స్టూవర్ట్ పురం నేపథ్యంలోనే రెండు చిత్రాలు విడుదలై చర్చ సాగింది. మళ్ళీ ఇన్నాళ్ళకు అదే స్టూవర్ట్ పురం బ్యాక్ డ్రాప్ లో మరో రెండు చిత్రాలు తెరకెక్కబోవడం విశేషమే మరి. ఈ సినిమాలు ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తాయో, వీటిలో ఏ చిత్రం జనం మదిని దోచేస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Jasprit Bumrah: 2027 ప్రపంచకప్పై ఫోకస్.. బుమ్రా కోసం బీసీసీఐ ‘ప్లాన్ బీ’..!
-
RG Kar Case: ఆర్జీ కర్ కేసులో కీలక పరిణామం.. నిందితుడిపై రాళ్లు, ఇటుకలతో దాడి
-
Nepal Floods: 275 మంది భారతీయులు గల్లంతు.. 166 మంది క్షేమం.. కేంద్రం కీలక ప్రకటన
-
AP Collectors Conference: సీఎం అధ్యక్షతన 8వ కలెక్టర్ల కాన్ఫరెన్స్.. రెండు రోజులు కీలక సమీక్షలు.. అజెండా ఇదే
-
Kia Syros Flex Fuel: 100% ఇథనాల్తోనూ నడుస్తుంది.. కియా సైరస్ ఫ్లెక్స్-ఫ్యూయల్ వచ్చేసింది..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!