75 ఏళ్ళ పవర్ తగ్గని పరుచూరి గోపాలకృష్ణ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు చిత్రసీమలో దాదాపు నాలుగు దశాబ్దాలుగా పరుచూరి బ్రదర్స్ మాటలు కోటలు దాటుతూ, సినీజనానికి కోట్లు సంపాదించి పెడుతూనే ఉన్నాయి. అన్న వెంకటేశ్వరరావు అనురాగం పలికిస్తే, తమ్ముడు గోపాలకృష్ణ ఆవేశం ఒలికిస్తారు. ఎంత అన్నదమ్ములైనా నలభై ఏళ్ళుగా కలసి రచనావ్యాసంగం సాగించడమంటే మాటలు కాదు. బహుశా చిత్రసీమలో ఇది ఓ అరుదైన విశేషమని చెప్పాలి. సెంటిమెంట్ ను వండడంలో మేటి వెంకటేశ్వరరావు అని పేరు, ఇక ఎమోషన్ పండించడంలో గోపాలకృష్ణకు సాటి లేరెవ్వరు అంటూ ఉంటారు. వారితో కలసి పనిచేసిన దర్శకనిర్మాతలు మళ్ళీ మళ్ళీ ఈ అన్నదమ్ముల రచన కోసమే పరితపించారంటే వారి పెన్ పవర్ ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు.
పరుచూరి బ్రదర్స్ లో చిన్నవారయిన గోపాలకృష్ణ 1946 సెప్టెంబర్ 25న జన్మించారు. వారి కన్నవారు పరుచూరి రాఘవయ్య, హైమావతమ్మ. గోపాలకృష్ణకు ఇద్దరు అన్నలు వారిలో పెద్దవారు వెంకటేశ్వరరావు, తరువాతి అన్న కుటుంబరావు. కనిష్ఠుడు పరుచూరి గోపాలకృష్ణ. వారిది రైతుకుటుంబం. “ముగ్గురు కొడుకులు ఉన్నారు కాబట్టి, ముగ్గురూ కూలీకి పోయినా మూడు కుంచాలు తీసుకు వస్తారు” అంటూ హైమావతమ్మతో బంధువులు అనేవారట. తన పిల్లలు కూలీపనికి పోవాలా అంటూ ఆమె ఆవేదన చెందేవారు. ఎలాగైనా ముగ్గురినీ చదించాలని తపించారామె. తల్లి తపన వల్లే ముగ్గురు కొడుకులు మంచి విద్యావంతులయ్యారు. పరుచూరి వెంకటేశ్వరరావుకు ఏజీ ఆఫీసులో ఉద్యోగం వచ్చింది. ఆయన పనిచేస్తూనే నాటకాలు రాస్తూ, పక్కనే ఉన్న రవీంద్ర భారతిలో ప్రదర్శించేవారు. గోపాలకృష్ణ ఎమ్.ఎ. తెలుగుచేశాక పశ్చిమ గోదావరిలోని లాల్ బహదూర్ శాస్త్రి కళాశాలలో తెలుగు అధ్యాపకునిగా పనిచేశారు. తరువాత కృష్ణాజిల్లా ఉయ్యూరులోని అడుసుమిల్లి గోపాలకృష్ణ అండ్ షుగర్ కేన్ గ్రోవర్స్ కాలేజ్ లో తెలుగు డిపార్ట్ మెంట్ హెడ్ గానూ ఉన్నారు. సెలవుల్లో అన్నయ్య వెంకటేశ్వరరావు వద్దకు వెళ్ళి, ఆయనతో పాటు కొన్ని చిత్రాలకు రచన చేసేవారు. 1981లో ఈ సోదరులిద్దరూ మహానటుడు యన్.టి.రామారావును కలుసుకున్నారు. ఆయన వారిద్దరినీ కలిపి ‘పరుచూరి బ్రదర్స్’గా మార్చి తన ‘అనురాగదేవత’తో తొలి అవకాశం కల్పించారు. ఆ తరువాత యన్టీఆర్ దర్శకత్వం వహించిన ‘చండశాసనుడు’కు కూడా వీరు రచన చేశారు. రామారావు ఈ బ్రదర్స్ కు నామకరణం చేసిన వేళావిశేషమేంటో కానీ, అప్పటి నుంచీ ఇప్పటి దాకా పరుచూరి సోదరులు తెలుగువారిని తమ రచనతో అలరిస్తూనే ఉన్నారు.
Also Read
- NTR - Trivikram Movie: రేపే ఎన్టీఆర్-త్రివిక్రమ్ ‘God Of War’ అనౌన్స్మెంట్!
- Idupu Kayitham : రచ్చ రచ్చ చేస్తున్న 'ఇడుపు కాయితం'.. నేషనల్ ఇష్యూ చేశారంటూ నరేశ్ ఫైర్!
- Ravi Kishan: కూతురికి తల్లి లేని లోటు తెలియకూడదని.. మీసం తీసి, చీర కట్టేందుకు రెడీ అయిన స్టార్ విలన్!
- Srinivasa Mangapuram: ఘట్టమనేని ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్.. జూలై రేస్ నుంచి తప్పుకున్న జయకృష్ణ ‘శ్రీనివాసమంగాపురం’?
సమకాలీన సమస్యలను పురాణగాథలతో పోల్చి, వాటిని అనుసంధానించి రచనలు చేయడంలో మేటి అనిపించుకున్నారు పరుచూరి బ్రదర్స్. ఎమోషన్ పండించే సమయంలో పరుచూరి గోపాలకృష్ణ తన పురాణ పరిజ్ఞానాన్ని చక్కగా వినియోగించుకొనేవారు. అందుకే ఆయన రాసిన సంభాషణల్లో తరచూ మన పురాణగాథల్లోని విశేషాలు వినిపిస్తూ ఉంటాయి. యన్టీఆర్ తో వారి అనుబంధం ప్రత్యేకమైనది. ఆయన రాజకీయాల్లోకి వెళ్తూ చివరగా నటించిన ‘నాదేశం’ చిత్రానికి పరుచూరి బ్రదర్స్ రచన చేశారు. ఆయన నటజీవితంలో చివరి సినిమాగా రూపొందిన ‘మేజర్ చంద్రకాంత్’కు కూడా వారే కథ, మాటలు రూపొందించారు. ఇక చిరంజీవిని ‘ఖైదీ’గా జనం మదిలో నిలపడంలోనూ, బాలకృష్ణను పవర్ ఫుల్ మాస్ హీరోగా మలచడంలోనూ, వెంకటేశ్ ను స్టార్ గా మార్చడంలోనూ పరుచూరి బ్రదర్స్ కలం బలం దాగుంది. ఈ టాప్ స్టార్సే కాకుండా ఎంతోమంది యంగ్ హీరోస్ కు కూడా పరుచూరి బ్రదర్స్ పలికించిన మాటల తూటాలు, వడ్డించిన భాషాపరోటాలు తెలుగువారికి ఆనందం పంచాయి.
రచనలోనే కాదు నటనలోనూ భళా అనిపించారు పరుచూరి సోదరులు. అభినయంలోనూ తన రూటే సెపరేటు అంటూ సాగారు పరుచూరి గోపాలకృష్ణ. సమకాలీన సమస్యలపై వెటకారంగా మాట్లాడుతూ గోపాలకృష్ణ సంధించే సంభాషణలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకొనేవి. వెకిలిగా నవ్వుతూనే గోతులు తీసే పాత్రల్లోనూ భళా అనిపించారు గోపాలకృష్ణ. ఇప్పటికీ తన దరికి చేరిన చిత్రాలకు రచన చేస్తూ, పాత్రలకు ప్రాణం పోస్తూ సాగుతున్నారు పరుచూరి గోపాలకృష్ణ. 75 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్నా, ఇప్పటికీ మునుపటి ఉత్సాహంతోనే పరుచూరి గోపాలకృష్ణ సాగుతూ ఉండడం విశేషం. ఆయన మరిన్ని పుట్టినరోజులు జరుపుకుంటూ, మరింతగా అలరించాలని ఆశిద్దాం.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
-
T20 World Cup: టీమిండియా ఘోర ఓటమి.. వరల్డ్ కప్ నుంచి ఔట్..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!