Adivi Sesh: పోస్ట్ కరోనా తర్వాత ఆ విషయంలో ‘మేజర్’ రికార్డ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా అనంతరం రెండు తెలుగు రాష్ట్రాలలోనూ కొందరు నిర్మాతలు తమ చిత్రాల బడ్జెట్ ఎక్కువ అయ్యిందని టిక్కెట్ రేట్లు పెంచుకునే వెసులు బాటు కల్పించమని ప్రభుత్వాలను కోరారు. ఏపీ ప్రభుత్వం మొదట్లో టిక్కెట్ రేట్లను అమాంతంగా తగ్గించేసినా, ఆ తర్వాత బాగానే పెంచింది. ఇక భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాతలు అడగడం ఆలస్యం వాటి టిక్కెట్ రేట్లు పెంచుకోవడానికి సై అనేసింది. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు తన తాజా చిత్రం ‘ఎఫ్ 3’ని ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకే ప్రదర్శిస్తామని చెప్పారు. కానీ కొన్ని మల్టీప్లెక్స్ థియేటర్లలో మాత్రం ఈ సినిమా రేట్లు కూడా కొంత పెంచి అమ్మినట్టు తెలుస్తోంది.
అయితే… అడవి శేష్ హీరోగా తెరకెక్కిన ‘మేజర్’ చిత్రాన్ని తెలంగాణలో సింగిల్ థియేటర్లలో రూ. 150కు, మల్టీప్లెక్స్ లో రూ. 195కు, ఆంధ్ర ప్రదేశ్ లో సింగిల్ థియేటర్లలో రూ. 147కు, మల్టీప్లెక్స్ లలో రూ. 177కు జీఎస్టీతో కలిపి విక్రయించనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆ చిత్ర కథానాయకుడు అడివి శేష్ ట్వీట్ చేశాడు. ‘ఇది మన సినిమా. అందుకే కరోనా అనంతరం ఏ సినిమాకూ వర్తించని అతి తక్కువ టిక్కెట్ రేటుకు చూపించబోతున్నాం’ అని అడివి శేష్ అందులో పేర్కొన్నాడు. శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ‘మేజర్’ మూవీ జూన్ 3వ తేదీ తెలుగుతో పాటు హిందీ, మలయాళంలోనూ విడుదల కాబోతోంది.
Also Read
- Memu COPlam: కోడిపుంజు కోసం పోలీసుల వేట.. నవ్వుల విందుగా నాగబాబు ‘మేము ‘కాప్’లం’ ట్రైలర్!
- Gaurnaidu: ‘పెద్ది’ నుంచి ఊహించని ఊరమాస్ టీజర్.. ‘గౌర్నాయుడు’గా శివరాజ్కుమార్ విశ్వరూపం!
- Boycott Peddi: మెగా పవర్ స్టార్కు సింగిల్ స్క్రీన్ల షాక్.. ‘పెద్ది’ని బహిష్కరించిన తెలంగాణ ఎగ్జిబిటర్లు!
- Trigun: ప్రధాని మాటే మా సినిమాకు బలం.. ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ టీమ్!
#MajorTheFilm MANA cinema. So, we decided to give you the LOWEST PRICES for ANY film post pandemic. https://t.co/aAUhmKEO9u
Sharing my love ❤️ Sharing my heart. pic.twitter.com/wWPHLD4GOK
— Adivi Sesh (@AdiviSesh) May 27, 2022
తాజావార్తలు
-
Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
-
Bajirao Peshwa : గెరిల్లా వార్లో దిట్ట.. బాజీరావు స్టైల్ ఇదే.!
-
Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
-
Uttam Kumar Reddy: రాష్ట్ర వ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాలు.. ధాన్యం కొనుగోళ్లపై మంత్రి కీలక వ్యాఖ్యలు..
-
Work From Home ఇచ్చేందుకు కంపెనీలు సుముకంగాలేవా..?
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!