Ticket price hike: హీరోల ప్రమేయం కరెక్ట్ కాదు: అశ్వనీదత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ticket price hike: Involvement of heroes is not correct: Aswani Dutt
టిక్కెట్ రేట్ల విషయంలో హీరోలు ఇన్ వాల్వ్ కాకుండా ఉంటే బాగుండేదని, అది ట్రేడ్ బాడీస్ చేయాల్సిన పని అని ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ అన్నారు. చిరంజీవితో పాటు కొందరు హీరోలు పనికట్టుకుని సీఎం ను కలిసి, టిక్కెట్ రేట్లను పెంచాల్సిందిగా కోరారని, దాంతో కోట్లు రెమ్యూనరేషన్స్ తీసుకుంటున్నారు కాబట్టే, టిక్కెట్ రేట్లను వారు పెంచమంటున్నారనే భావన సాధారణ ప్రేక్షకుడికి కలిగిందని, నిజానికి టిక్కెట్ రేట్ల వ్యవహారం నిర్మాతలు, నిర్మాతల మండలి, ఫిల్మ్ ఛాంబర్ కు సంబంధించిందని, వ్యక్తి గత హోదాలో కొందరు సీఎం ను కలవడం వల్ల మంచి కంటే చెడే ఎక్కువ జరిగిందని ఆయన అభిప్రాయ పడ్డారు. అలానే ఇప్పుడు రకరకాల కారణంగా బంద్ చేయాలనుకోవడాన్ని కూడా ఆయన తప్పు పట్టారు. హీరోల రెమ్యూనరేషన్స్ ఇబ్బడి ముబ్బడిగా పెంచేసిన వారే ఇవాళ షూటింగ్స్ బంద్ చేయాలని అనుకుంటున్నారని, అది కరెక్ట్ కాదని చెప్పారు. కొందరు నిర్మాతలకు అవగాహన లేకపోవడం వల్ల ఇలా జరుగుతోందని, షూటింగ్స్ ఆపడం మరిన్ని అనర్థాలకు దారిస్తుందని చెప్పారు. తాను ఆ మధ్యలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బిజీగా ఉండటం వల్ల సినిమాలు చేయలేదు, తిరిగి నాగ్ అశ్విన్ కారణంగా చిత్ర నిర్మాణంలోకి వచ్చానని అన్నారు.
Also Read
- Next Year Movies : 2027లో టాలీవుడ్లో రికార్డ్స్ మోత మోగనున్నాయా..
- Maremma Review: మారెమ్మ సినిమా రివ్యూ..
- Udaya Bhanu: 15 ఏళ్లుగా తపస్సు చేస్తున్నా.. ప్రశాంతంగా 2 గంటలు కూడా నిద్రపోలేదు.. ఉదయ భాను ఎమోషనల్ కామెంట్స్!
- Vrushakarma Release Update: 'వృషకర్మ' కీలక అప్డేట్.. ప్రభాస్ను ఢీకొట్టబోతున్న నాగ చైతన్య?
తమ బ్యానర్ నుండి వచ్చిన ‘జాతి రత్నాలు’ సినిమా విషయం గురించి చెబుతూ, ”థియేటర్లకు జనం రాకపోవడం వల్ల దానిని ఓటీటీలో విడుదల చేయాలని మొదట నేను అనుకున్నాను. అయితే నాగ అశ్విన్ అందుకు అంగీకరించలేదు. అది థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయాల్సిన సినిమా అని నన్ను ఒప్పించాడు. అదే ఆ తర్వాత మంచిదయ్యింది. ఆ సినిమా బాగా ఆడింది. అయితే… ఇవాళ నిర్మాతలు కొందరు బిలో ఏవరేజ్ సినిమాలను వెంటనే ఓటీటీలో విడుదల చేయాలని చూస్తున్నారు. ముందు చేసుకున్న ఒప్పందాలను పక్కన పెట్టేసి, ఎక్కువ డబ్బులు ఓటీటీ సంస్థల నుండి డిమాండ్ చేసి తమ చిత్రాలను పది, పన్నెండు రోజులకూ వేసేస్తున్నారు. ఆ డబ్బులను లాస్ వచ్చిన ఎగ్జిబిటర్స్ కు ఇస్తున్నారు. ఇలా చేయడం వల్ల థియేటర్లలో సినిమా చూడకపోయినా నష్టం లేదని, రెండు వారాల్లో ఓటీటీలో వచ్చేస్తుందనే భావనకు జనం వచ్చేశారు. కొందరు నిర్మాతలు చేసిన ఇలాంటి పనుల వల్లే థియేటర్లకు జనం రావడం తగ్గింది” అని చెప్పారు.
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?