Ticket price hike: హీరోల ప్రమేయం కరెక్ట్ కాదు: అశ్వనీదత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ticket price hike: Involvement of heroes is not correct: Aswani Dutt
టిక్కెట్ రేట్ల విషయంలో హీరోలు ఇన్ వాల్వ్ కాకుండా ఉంటే బాగుండేదని, అది ట్రేడ్ బాడీస్ చేయాల్సిన పని అని ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ అన్నారు. చిరంజీవితో పాటు కొందరు హీరోలు పనికట్టుకుని సీఎం ను కలిసి, టిక్కెట్ రేట్లను పెంచాల్సిందిగా కోరారని, దాంతో కోట్లు రెమ్యూనరేషన్స్ తీసుకుంటున్నారు కాబట్టే, టిక్కెట్ రేట్లను వారు పెంచమంటున్నారనే భావన సాధారణ ప్రేక్షకుడికి కలిగిందని, నిజానికి టిక్కెట్ రేట్ల వ్యవహారం నిర్మాతలు, నిర్మాతల మండలి, ఫిల్మ్ ఛాంబర్ కు సంబంధించిందని, వ్యక్తి గత హోదాలో కొందరు సీఎం ను కలవడం వల్ల మంచి కంటే చెడే ఎక్కువ జరిగిందని ఆయన అభిప్రాయ పడ్డారు. అలానే ఇప్పుడు రకరకాల కారణంగా బంద్ చేయాలనుకోవడాన్ని కూడా ఆయన తప్పు పట్టారు. హీరోల రెమ్యూనరేషన్స్ ఇబ్బడి ముబ్బడిగా పెంచేసిన వారే ఇవాళ షూటింగ్స్ బంద్ చేయాలని అనుకుంటున్నారని, అది కరెక్ట్ కాదని చెప్పారు. కొందరు నిర్మాతలకు అవగాహన లేకపోవడం వల్ల ఇలా జరుగుతోందని, షూటింగ్స్ ఆపడం మరిన్ని అనర్థాలకు దారిస్తుందని చెప్పారు. తాను ఆ మధ్యలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బిజీగా ఉండటం వల్ల సినిమాలు చేయలేదు, తిరిగి నాగ్ అశ్విన్ కారణంగా చిత్ర నిర్మాణంలోకి వచ్చానని అన్నారు.
Also Read
- Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
- Ghani Movie Failure: 'గని' ఫ్లాప్ కావడానికి కారణం ఇదేనట! తొలిసారి స్పందించిన వరుణ్ తేజ్..
- Tollywood Ticket Prices: టాలీవుడ్లో మళ్లీ టికెట్ రేట్ల చర్చ.. కొత్త కమిటీ ఏర్పాటు చేసిన ఫిల్మ్ ఛాంబర్
- Varun Tej Love Story: ఏడేళ్ల పాటు సీక్రెట్గా సాగిన ప్రేమ.. ఆ హీరోయిన్తో బంధంపై మనసు విప్పిన వరుణ్ తేజ్
తమ బ్యానర్ నుండి వచ్చిన ‘జాతి రత్నాలు’ సినిమా విషయం గురించి చెబుతూ, ”థియేటర్లకు జనం రాకపోవడం వల్ల దానిని ఓటీటీలో విడుదల చేయాలని మొదట నేను అనుకున్నాను. అయితే నాగ అశ్విన్ అందుకు అంగీకరించలేదు. అది థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయాల్సిన సినిమా అని నన్ను ఒప్పించాడు. అదే ఆ తర్వాత మంచిదయ్యింది. ఆ సినిమా బాగా ఆడింది. అయితే… ఇవాళ నిర్మాతలు కొందరు బిలో ఏవరేజ్ సినిమాలను వెంటనే ఓటీటీలో విడుదల చేయాలని చూస్తున్నారు. ముందు చేసుకున్న ఒప్పందాలను పక్కన పెట్టేసి, ఎక్కువ డబ్బులు ఓటీటీ సంస్థల నుండి డిమాండ్ చేసి తమ చిత్రాలను పది, పన్నెండు రోజులకూ వేసేస్తున్నారు. ఆ డబ్బులను లాస్ వచ్చిన ఎగ్జిబిటర్స్ కు ఇస్తున్నారు. ఇలా చేయడం వల్ల థియేటర్లలో సినిమా చూడకపోయినా నష్టం లేదని, రెండు వారాల్లో ఓటీటీలో వచ్చేస్తుందనే భావనకు జనం వచ్చేశారు. కొందరు నిర్మాతలు చేసిన ఇలాంటి పనుల వల్లే థియేటర్లకు జనం రావడం తగ్గింది” అని చెప్పారు.
తాజావార్తలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
-
No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!