Ticket price hike: హీరోల ప్రమేయం కరెక్ట్ కాదు: అశ్వనీదత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ticket price hike: Involvement of heroes is not correct: Aswani Dutt
టిక్కెట్ రేట్ల విషయంలో హీరోలు ఇన్ వాల్వ్ కాకుండా ఉంటే బాగుండేదని, అది ట్రేడ్ బాడీస్ చేయాల్సిన పని అని ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ అన్నారు. చిరంజీవితో పాటు కొందరు హీరోలు పనికట్టుకుని సీఎం ను కలిసి, టిక్కెట్ రేట్లను పెంచాల్సిందిగా కోరారని, దాంతో కోట్లు రెమ్యూనరేషన్స్ తీసుకుంటున్నారు కాబట్టే, టిక్కెట్ రేట్లను వారు పెంచమంటున్నారనే భావన సాధారణ ప్రేక్షకుడికి కలిగిందని, నిజానికి టిక్కెట్ రేట్ల వ్యవహారం నిర్మాతలు, నిర్మాతల మండలి, ఫిల్మ్ ఛాంబర్ కు సంబంధించిందని, వ్యక్తి గత హోదాలో కొందరు సీఎం ను కలవడం వల్ల మంచి కంటే చెడే ఎక్కువ జరిగిందని ఆయన అభిప్రాయ పడ్డారు. అలానే ఇప్పుడు రకరకాల కారణంగా బంద్ చేయాలనుకోవడాన్ని కూడా ఆయన తప్పు పట్టారు. హీరోల రెమ్యూనరేషన్స్ ఇబ్బడి ముబ్బడిగా పెంచేసిన వారే ఇవాళ షూటింగ్స్ బంద్ చేయాలని అనుకుంటున్నారని, అది కరెక్ట్ కాదని చెప్పారు. కొందరు నిర్మాతలకు అవగాహన లేకపోవడం వల్ల ఇలా జరుగుతోందని, షూటింగ్స్ ఆపడం మరిన్ని అనర్థాలకు దారిస్తుందని చెప్పారు. తాను ఆ మధ్యలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బిజీగా ఉండటం వల్ల సినిమాలు చేయలేదు, తిరిగి నాగ్ అశ్విన్ కారణంగా చిత్ర నిర్మాణంలోకి వచ్చానని అన్నారు.
Also Read
- Jabardasth Mahesh: ‘ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో తెలీదు’.. సడన్గా కమెడియన్ మహేష్ షాకింగ్ వీడియో.. అసలేమైంది?
- Idupu Kayitham : 'ఇడుపు కాయితం' చుట్టూ కొత్త వివాదం.. అసలు ఈ పదం అర్ధమేంటి?
- Suhas: "చేతిలో కత్తి.. కళ్లలో కసి!" ‘సాట్టపులి’గా సుహాస్ ఊరమాస్ విధ్వంసం!
- Haiku : ‘కోర్ట్’ శ్రీదేవి సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే ‘నెట్ఫ్లిక్స్’ మైండ్ బ్లాక్ డీల్
తమ బ్యానర్ నుండి వచ్చిన ‘జాతి రత్నాలు’ సినిమా విషయం గురించి చెబుతూ, ”థియేటర్లకు జనం రాకపోవడం వల్ల దానిని ఓటీటీలో విడుదల చేయాలని మొదట నేను అనుకున్నాను. అయితే నాగ అశ్విన్ అందుకు అంగీకరించలేదు. అది థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయాల్సిన సినిమా అని నన్ను ఒప్పించాడు. అదే ఆ తర్వాత మంచిదయ్యింది. ఆ సినిమా బాగా ఆడింది. అయితే… ఇవాళ నిర్మాతలు కొందరు బిలో ఏవరేజ్ సినిమాలను వెంటనే ఓటీటీలో విడుదల చేయాలని చూస్తున్నారు. ముందు చేసుకున్న ఒప్పందాలను పక్కన పెట్టేసి, ఎక్కువ డబ్బులు ఓటీటీ సంస్థల నుండి డిమాండ్ చేసి తమ చిత్రాలను పది, పన్నెండు రోజులకూ వేసేస్తున్నారు. ఆ డబ్బులను లాస్ వచ్చిన ఎగ్జిబిటర్స్ కు ఇస్తున్నారు. ఇలా చేయడం వల్ల థియేటర్లలో సినిమా చూడకపోయినా నష్టం లేదని, రెండు వారాల్లో ఓటీటీలో వచ్చేస్తుందనే భావనకు జనం వచ్చేశారు. కొందరు నిర్మాతలు చేసిన ఇలాంటి పనుల వల్లే థియేటర్లకు జనం రావడం తగ్గింది” అని చెప్పారు.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!