Raja Saab : డార్లింగ్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. 10 రోజుల పాటు హైక్.. ఏపీ జీవోలో ఏముందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభాస్ ఫాన్స్ కి గుడ్ న్యూస్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’ చిత్రానికి సంబంధించి టికెట్ ధరల పెంపు మరియు ప్రత్యేక షోలకు అనుమతినిస్తూ అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కానున్న ఈ సినిమా కోసం చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చేసిన విన్నపాన్ని ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించింది. జనవరి 8, 2026న సాయంత్రం 6 గంటల నుండి అర్ధరాత్రి 12 గంటల మధ్య ఒక ప్రత్యేక షోను ప్రదర్శించుకోవడానికి అనుమతి లభించింది. ఈ ప్రత్యేక షో కోసం ఒక టికెట్ ధరను గరిష్టంగా ₹1000 (జీఎస్టీతో కలిపి) గా నిర్ణయించారు. సినిమా విడుదలైన మొదటి 10 రోజుల పాటు (జనవరి 9 నుండి) సాధారణ టికెట్ ధరలపై అదనపు పెంపునకు అనుమతినిచ్చారు. సింగిల్ స్క్రీన్స్ లో ఒక్కో టికెట్పై ₹150 అదనంగా పెంచుకోవచ్చు. మల్టీప్లెక్స్ లలో ఒక్కో టికెట్పై ₹200 అదనంగా పెంచుకోవచ్చు. రోజుకు గరిష్టంగా ఐదు (05) షోలు ప్రదర్శించుకోవడానికి వెసులుబాటు కల్పించారు.
Also Read :Jana Nayagan: ‘జన నాయగన్’కు కోర్టు షాక్.. ‘రాజా సాబ్’ సోలో ఎంట్రీ!
Also Read
- Jagapathi Babu: రామ్ చరణ్ ‘పెద్ది’ అసలు కథను లీక్ చేసిన అప్పలసూరి!
- Jagapathi Babu: "నాకు యాక్టింగ్ తప్ప ఇంకేం రాదు.. ఆ విషయంలో నేను జీరో": జగపతి బాబు
- Romanchakam: డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మనసు దోచిన లవ్ స్టోరీ.. ‘రోమాంచకం’ తో సరికొత్త ప్రయాణం!
- Memu Kapulam: 'మేము కాపులం' టైటిల్ పబ్లిసిటీ కోసమే.. కానీ అందులో బూతులుండవు: బి.వి.ఎస్.రవి
ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు రావడంతో ప్రభాస్ అభిమానుల్లో పండుగ వాతావరణం నెలకొంది, భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ హారర్ కామెడీ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు టికెట్ ధరల పెంపు మరియు స్పెషల్ షోల అనుమతి సినిమా వసూళ్లకు పెద్ద ప్లస్ కానుంది, ఈ నిర్ణయం కేవలం ‘రాజా సాబ్’కే కాకుండా, సంక్రాంతి బరిలో ఉన్న ఇతర పెద్ద సినిమాలకు కూడా సానుకూల సంకేతంగా మారుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఈ భారీ ఊరటతో ‘రాజా సాబ్’ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి ఓపెనింగ్స్ సాధించడం ఖాయంగా కనిపిస్తోంది, మరి తెలంగాణ ప్రభుత్వం కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుంటుందో లేదో వేచి చూడాలి.
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఎమ్మెల్యేలు జమీందార్లలా మారొద్దు.. పార్టీ కోసం పనిచేయాల్సిందే
-
Ravindra Jadeja: రవీంద్ర జడేజాకు ఏమైంది.. మ్యాచ్ మధ్యలో ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది..?
-
Russia-Taliban: రష్యా-ఆప్ఘనిస్థాన్ మధ్య సైనిక ఒప్పందం.. ఎవరికి ముప్పు పొంచి ఉందో..!
-
Smartphone Prices Hike: స్మార్ట్ఫోన్ ప్రియులకు షాక్.. చుక్కలు చూపిస్తున్న ధరలు! పండగ సీజన్లో కొత్త ఫోన్ల కొనుగోళ్లు డౌటే..
-
CM Revanth Reddy : ‘ఒక్క ఓటు కూడా డిలీట్ కావొద్దు’.. కాంగ్రెస్ నేతలకు రేవంత్ అలర్ట్.!
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..