అర్జున్ రెడ్డి..ఈ సినిమా 2017 సంవత్సరం లో ఒక సంచలనం సృష్టించింది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ఈ సినిమా ఒక ప్రభంజనం సృష్టించింది.తన నిజ జీవితంలో ఉన్న లవ్ స్టోరీని ఆధారంగా చేసుకుని సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని తీసాడని సమాచారం.. కానీ ముందుగా సందీప్ షుగర్ ఫ్యాక్టరీ అనే పేరుతో కథ రాసుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల అర్జున్ రెడ్డి సినిమాని చేయాల్సి వచ్చింది. ఈ సినిమా కథని ఎంతోమంది నిర్మాతలకు చెప్పినా ఎవరూ కూడా తీయడానికి అంత సాహసం చేయలేదని తెలుస్తుంది.. అందుకే సందీప్ తన సొంత ఆస్తులు అన్ని తాకట్టు పెట్టి దాదాపు 3 కోట్లు ఖర్చుతో ఈ సినిమా తీశాడు.
ఈ సినిమా తీసినప్పటి నుండి సందీప్ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి అయితే వచ్చింది ఆస్తుల విషయంలో ఇంట్లో గొడవలు పడుతూనే ఒకానొక సమయంలో అవి పెద్ద తగాదాలకు కూడా కారణమయ్యాయని సమాచారం.అయినా కూడా ఎంతో కసితో ఈ సినిమా ను తీసి విడుదల చేయాలని భావించాడు. ఇక సినిమా తీసి తరవాత సురేష్ బాబు తనకైనా మూడు కోట్లు ఖర్చు ఇచ్చి సినిమాను కొనుక్కోవాలనుకున్నాడని సమాచారం. కానీ కొంత సమయం తీసుకుని బాగా ఆలోచించి ఆ సినిమాను విడుదల చేయాలని అయితే నిర్ణయించుకున్నాడు. కానీ విడుదల చేయడం అంటే ఎంత కష్టమో సందీప్ కి తెలిసి వచ్చింది. ఎట్టకేలకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని మరీ సినిమా ట్రైలర్ ని విడుదల చేశాడు. అర్జున్ రెడ్డి ట్రైలర్ సంచలనం సృష్టించింది.. ట్రైలర్ చూసిన తర్వాత దాదాపు 30 కోట్ల రూపాయలు ఆఫర్ చేసి ఈ చిత్రాన్ని కొనుక్కున్నారని తెలుస్తుంది.. ఈ సినిమాను కబీర్ సింగ్ రూపంలో హిందీలో కూడా తీయగా 60 కోట్ల రూపాయల కలెక్షన్స్ ను సాధించాడు అంతేకాదు దీని రీమేక్ హక్కుల ద్వారానే భారీ మొత్తాన్ని సాధించింది అర్జున్ రెడ్డి సినిమా.ఇక కబీర్ సింగ్ తర్వాత ఆనిమల్ అనే ఒక హిందీ సినిమా తప్ప మరో ఏ సినిమాను కూడా తీయలేదు సందీప్ రెడ్డి.