IND Vs BAN: 314 పరుగులకు భారత్ ఆలౌట్.. 87 పరుగుల కీలక ఆధిక్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND Vs BAN: మీర్పూర్ వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 314 పరుగులకు ఆలౌటైంది. దీంతో 87 పరుగుల కీలక ఆధిక్యం లభించింది. రిషబ్ పంత్ (93), శ్రేయస్ అయ్యర్ (87) సెంచరీలు మిస్ చేసుకున్నారు. వీళ్లిద్దరూ రాణించకపోయి ఉంటే టీమిండియా పరిస్థితి దారుణంగా ఉండేది. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (10), శుభ్మన్ గిల్ (20) విఫలం అయ్యారు. స్టార్ ఆటగాళ్లు పుజారా (24), విరాట్ కోహ్లీ (24) రాణించలేకపోయారు. అయితే వికెట్ కీపర్ రిషబ్ పంత్ 93 పరుగులతో అదరగొట్టాడు. అతడు 104 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 93 పరుగులు రాబట్టాడు. పంత్కు శ్రేయస్ అయ్యర్ కూడా చక్కటి సహకారం అందించాడు.
Also Read
శ్రేయస్ 105 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్ల సహాయంతో 87 పరుగులు మాత్రమే చేశాడు. అయితే పంత్, శ్రేయస్ ఇద్దరూ సెంచరీలు చేయకపోవడం అభిమానులను నిరాశపరిచింది. వీళ్లిద్దరూ ఐదో వికెట్కు 159 పరుగులు జోడించి టీమిండియాను ఆదుకున్నారు. బంగ్లాదేశ్ బౌలర్లలో షకీబ్, తైజుల్ ఇస్లామ్లకు చెరో 4 వికెట్లు పడ్డాయి. టస్కిన్ అహ్మద్, మెహిదీ హసన్ మిరాజ్కు తలో ఒక వికెట్ పడింది. కాగా తొలి ఇన్నింగ్స్లో బంగ్లాదేశ్ 227 పరుగులకు ఆలౌటైంది.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!