Tanikella Bharani : బహుముఖ ప్రజ్ఞాశాలి భరణి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
(జూలై 14న తనికెళ్ళ భరణి పుట్టినరోజు)
నేడు నటునిగా తనదైన బాణీ పలికిస్తూ అందరినీ అలరిస్తోన్న తనికెళ్ళ భరణి కలం బలం తెలియాలంటే ఓ మూడు దశాబ్దాలు పైగా వెనక్కి వెళ్ళాలి. జనబాహుళ్యంలో ఉన్న పదాలతో పసందైన సంభాషణలు రాసి ఆకట్టుకున్నారు భరణి. ఇక నటనలో అడుగు పెట్టాక, తనకు లభించిన ప్రతి పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయాలనే తపించారు. ఇప్పటికీ ఆ తపనతోనే సాగుతున్నారాయన. అందుకే భరణి అభినయం జనానికి మొహం మొత్తలేదు. ఆయన కామెడీ చేసినా, సెంటిమెంట్ పండించినా, విలనీ ప్రదర్శించినా జై కొడుతూనే ఉన్నారు జనం. మెగా ఫోన్ పట్టి దర్శకునిగానూ అలరించారు.
తనికెళ్ళ భరణి 1954 జూలై 14న జన్మించారు. తిరుపతి వేంకటకవుల్లో ఒకరైన దివాకర్ల తిరుపతి శాస్త్రి, విఖ్యాత రచయిత విశ్వనాథ సత్యనారాయణ వంటివారు తనికెళ్ళ భరణికి బంధువులు. అలా భరణి ఇంట్లోనూ సరస్వతీదేవి కటాక్షం పుష్కలంగా ఉండేది. చిన్నతనంలోనే భరణి తెలుగు, ఇంగ్లిష్, హిందీ సాహిత్యంలో మంచి ప్రవేశం సంపాదించారు. చదువుకొనే రోజుల్లోనే నాటకాలు, కవితలు రాస్తూ సాగారు. డిగ్రీ పూర్తయ్యాక నటుడు రాళ్ళపల్లి చెంత చేరారు భరణి. ఆయన సలహాలు, సూచనలు పాటించారు. చిత్రసీమలో అడుగు పెట్టారు. చెన్నై చేరి తొలిగా సుమన్ హీరోగా రూపొందిన ‘కంచు కవచం’కు మాటలు రాసేశారు. తొలి చిత్రంలోనే తనదైన మార్కు కనబరిచారు భరణి. ‘క’ భాషతో కబడ్డీ ఆడేశారు అంతకు ముందు ఎందరో రచయితలు. భరణి కూడా ఆ బాటలోనే పయనించినా, తనదైన బాణీ పలికిస్తూ ‘జ’భాష కనిపెట్టేశారు. ‘లేడీస్ టైలర్’లో పెట్టేశారు. ఇంకేముంది జనం భరణి రాసిన ‘జమజచ్చ’కు జేజేలు పలికారు. అదే సినిమాలో ఓ చిన్న పాత్రలోనూ భరణి కనిపించి ఆకట్టుకున్నారు. తరువాత వంశీ దర్శకత్వంలో రూపొందిన కొన్ని చిత్రాలకు మాటలు పలికిస్తూనే, నటునిగాను అలరించారు. రామ్ గోపాల్ వర్మ తొలి చిత్రం ‘శివ’కు కూడా భరణి మాటలే భలేగా పేలాయి. ఇక అందులో నానాజీ పాత్రలో ఆకట్టుకున్నారు. అటుపై నటరచయితగా సాగిన భరణికి, అభినయ పరంగానే అవకాశాలు అధికమయ్యాయి. దాంతో సినిమా రచనకు బై బై చెప్పాల్సి వచ్చింది.
Also Read
- Peddi Censor Review : 'రంగస్థలం'ను మించిన యాక్టింగ్.... లాస్ట్ 50 నిమిషాలు గూస్బంప్స్ గ్యారెంటీ!
- Purusha: ఫ్లాప్ అయితే మళ్లీ వ్యవసాయమే.. నిర్మాత షాకింగ్ కామెంట్స్
- Prashanth Neel : ఎన్టీఆర్ బక్క చిక్కడం చూసి భయపడిపోయా.. ఎన్టీఆర్ భార్య కూడా నాపై సీరియస్ అయింది
- He-Man: ‘హీ-మ్యాన్’గా యంగ్ హీరో నిఖిల్.. దద్దరిల్లుతున్న ట్రైలర్!
వందలాది చిత్రాలలో తనికెళ్ళ భరణి తనదైన బాణీ పలికిస్తూ నటించారు. అయితే తనకు అన్నం పెట్టిన రచనను మాత్రం వదలుకోకుండా, ‘ఆట కదరా శివా…’ అంటూ పాటలూ రాస్తూ భక్తి పారవశ్యం చెందారు. ఆపై మెగా ఫోన్ పట్టి ‘సిరా’ అనే లఘుచిత్రం రూపొందించారు. కేవలం రెండు పాత్రలతోనే ‘మిథునం’ చిత్రం తెరకెక్కించీ అలరించారు. ఈ సినిమా ద్వారా ఉత్తమ మాటల రచయితగా నందిని సొంతం చేసుకున్నారు భరణి. అంతకు ముందు బెస్ట్ విలన్ గా ‘సముద్రం’ సినిమాతోనూ, బెస్ట్ కేరెక్టర్ యాక్టర్ గా ‘నువ్వు-నేను’తోనూ నంది అవార్డులు అందుకున్నారాయన. ఇప్పటికీ నటునిగా బిజీగా సాగుతున్న తనికెళ్ళ భరణి మరిన్ని పుట్టినరోజులు జరుపుకుంటూ ఆనందంగా తనదైన పంథాలో సాగాలని ఆశిద్దాం.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!