Tamil Rockerz: ‘తమిళ రాకర్స్’ స్ట్రీమింగ్ కు ముహూర్తం ఖరారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమా విడుదలైన గంటల్లోనే వెబ్ సైట్ లో అప్ లోడ్ చేస్తూ దక్షిణాది చిత్రాలకు కీడు చేస్తున్న ‘తమిళ్ రాకర్స్’ గురించి ప్రేక్షకులకు పరిచయం ఉంది. వీళ్ల నెట్ వర్క్ ఎలా పనిచేస్తోందనే నేపథ్యంతో ప్రముఖ నిర్మాణ సంస్థ రూపొందించిన వెబ్ సిరీస్ ‘తమిళ్ రాకర్స్’. అరుణ్ విజయ్, వాణి బోజన్ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. అరుణ నిర్మాణ సారథ్యంలో అరివఝగన్ దీన్ని రూపొందించారు. సోని లివ్ ఓటీటీలో ఈనెల 19న ఈ సిరీస్ స్ట్రీమింగ్ కు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం హైదరాబాద్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.
Also Read
- Ashwath Marimuthu: అనిల్ రావిపూడి స్పీడ్కి పోటీగా రజినీకాంత్ డైరెక్టర్.. 5 నెలల్లో సినిమా పూర్తి!
- Keerthy Suresh: నాని కోసం 13 ఏళ్ల తర్వాత స్పెషల్ సాంగ్.. ఐటం సాంగ్ కాదంటున్న కీర్తి సురేష్!
- Theatrical Releases: సెప్టెంబర్ లో సౌత్ సినిమాల జోరు… లవ్ స్టోరీల నుండి యాక్షన్ థ్రిల్లర్ల వరకు
- Spy Action Thriller: థియేటర్లలో పట్టించుకోలేదు.. ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్ లో స్పై యాక్షన్ థ్రిల్లర్
దర్శకుడు అరివఝగన్ మాట్లాడుతూ, ”తమిళ్ రాకర్స్ దక్షిణాది చిత్రాలతో పాటు బాలీవుడ్ కు కూడా ప్రమాదకరంగా తయారయ్యారు. వీళ్లు ఎలా పనిచేస్తున్నారు అనే అంశాన్ని కథగా చేసుకుని ఈ వెబ్ సిరీస్ రూపొందించాం. వాళ్లు సినిమాలను ఎలా ఫిల్మింగ్ చేస్తున్నారు? ఎలా అప్ లోడ్ చేస్తున్నారు? వీళ్లు ఇలా కొత్త సినిమాలను వెబ్ సైట్ పెట్టడం వల్ల ఏ ప్రయోజనం ఆశిస్తున్నారు? వీళ్ల నెట్ వర్క్ ఎలా పనిచేస్తోంది? అనే ప్రశ్నలకు మా చిత్రంలో సమాధానం చెప్పబోతున్నాం” అని అన్నారు. హీరో అరుణ్ విజయ్ మాట్లాడుతూ, ”దర్శకుడు అరివఝగన్ తో గతంలో ‘ఈరమ్’, ‘కుట్రమ్ 23’ మూవీస్ చేశాను. ప్రస్తుతం ఆయనతో ‘బార్డర్’ అనే సినిమా చేస్తున్నాను. యూనిక్ కాన్సెప్ట్ తో ప్రతిసారీ ఆయన సినిమాలు చేస్తుంటారు. తమిళ్ రాకర్స్ గురించి మనకు తెలుసు. ఈ సిరీస్ ద్వారా వాళ్ల ముఠాను వెలుగులోకి తీసుకురావాలని ప్రయత్నించాం. ఒక సినిమా మేకింగ్ లో ఎంత శ్రమ ఉంటుందో మీకు తెలుసు. ఆ కష్టం ఇలా పైరసీ వల్ల దోపిడీకి గురవుతోంది. మనం వీళ్లను పట్టించడం ఈ సమస్యకు ఒక పరిష్కారం అయితే రెండోది ప్రేక్షకులు ఎవరూ పైరసీ సినిమాలు చూడకుండా బహిష్కరించాలి. అప్పుడే తమిళ్ రాకర్స్ లాంటి వెబ్ సైట్స్ పతనం అవుతాయి” అని చెప్పారు.
నిర్మాత అరుణ గుహ మాట్లాడుతూ, ”మా ఏవీఎం సంస్థ అనేక భారతీయ భాషల్లో చిత్రాలను నిర్మించింది. తొలిసారి వెబ్ సిరీస్ ను నిర్మించాం. ఓటీటీ, సినిమా రెండూ మనకు ముఖ్యమే. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా మనమూ మారాలి. ఈ వెబ్ సిరీస్ తో ఫిల్మ్ ప్రొడక్షన్ లో మా బౌండరీస్ ను మరింత విస్తృతం చేశాం. ప్రేక్షకులు చూడకుంటే ఇలాంటి సైట్ లు తగ్గిపోతాయి. ఏవైనా ఇలాంటి యాప్ లు ఉన్నా వాటిని బ్లాక్ చేయొచ్చు. ఈ వెబ్ సిరీస్ తో వాస్తవ ఘటనలను కల్పిత సన్నివేశాలతో కలిపి తెరకెక్కించాం” అని అన్నారు. హీరోయిన్ వాణి బోజన్ మాట్లాడుతూ, ”ఈ వెబ్ సిరీస్ లో సంధ్య అనే క్యారెక్టర్ లో నటించాను. ఇది మీకొక మంచి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అనుభూతిని పంచుతుంది” అని చెప్పింది.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!