ఓటీటీలోకి గ్రాండ్ వేలో అడుగుపెట్టబోతున్న టీ-సిరీస్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇప్పటి వరకూ మ్యూజిక్ అండ్ ఫిల్మ్ ప్రొడక్షన్ లో ఉన్న టీ-సీరిస్ సంస్థ త్వరలో భారీ స్థాయిలో ఓటీటీ కంటెంట్ ను అందించే ప్రయత్నం చేయబోతోంది. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా వినోదం ప్రజల చేతి మునివేళ్ళలోనే స్మార్ట్ ఫోన్ రూపంలో లభ్యం అవుతోందని, దానిని దృష్టిలో పెట్టుకుని అన్ని వర్గాల వారిని అలరించేలా ఓటీటీ కంటెంట్ ను రూపొందించాలనే నిర్ణయం తీసుకున్నామని టీ-సీరిస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ భూషణ్ కుమార్ తెలిపారు.
Read Also : తలైవా కంటే ఎక్కువ ఫాలోయింగ్… సౌత్ లో అత్యధికంగా ఫాలో అవుతున్న స్టార్
Also Read
- Ramayana vs Godzilla: ‘రామాయణం’ vs ‘గాడ్జిల్లా'.. దీపావళికి గ్లోబల్ క్లాష్ తప్పదా ?
- Missing Meghana First Look: ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్గా తెలుగు సినిమా.. వి.వి. వినాయక్ చేతుల మీదుగా ‘మిస్సింగ్ మేఘన’ ఫస్ట్ లుక్ రిలీజ్
- Preity Zinta: 'సగం ఇండియన్, సగం అమెరికన్... పిల్లలకు ఇండియన్ రూట్స్... ఎనిమిదేళ్ల రీఎంట్రీపై ప్రీతి ఆసక్తికర వ్యాఖ్యలు!
- Mega Multistarrer : ఒకే స్క్రీన్పై వరుణ్ తేజ్ - నాగబాబు.. భారీ బడ్జెట్ పై నిర్మిస్తున్న నిహారిక
ఈ వివరాలను ఆయన తెలియచేస్తూ, ”కథాబలంతో పాటు సంగీత ప్రధానమైన చిత్రాలు తప్పనిసరిగా ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తాయనే నమ్మకం మొదటి నుండి మాకు ఉంది. ఆ దిశగానే చిత్ర నిర్మాణం జరిపాం. యూ ట్యూబ్ లో మా కంటెంట్ ను వీక్షకలకు అందుబాటులోకి తీసుకొచ్చాం. అయితే ఇప్పుడు మారిన కాలమన పరిస్థితులలో స్టోరీబేస్డ్ వెబ్ సీరిస్ ను తయారు చేసి ఓటీటీల ద్వారా అందించాలని అనుకుంటున్నాం. ఇందు కోసం ఆనంద్ ఎల్. రాయ్, అనుభవ్ సిన్హా, నిఖిల్ అద్వానీ, హన్సల్ మెహతా, సంజయ్ గుప్తా, బిజోయ్ నంబియార్, సుపర్న్ ఎస్ వర్మ, మిఖిల్ ముసాలే, సౌమేంద్ర పథి వంటి ప్రముఖులతో చర్చలు జరుపుతున్నాం. వారంతా ఓటీటీ కంటెంట్ ఇవ్వడానికి అంగీకారం తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వీక్షకులను దృష్టిలో ఉంచుకుని వీరితో ఓరిజినల్, ఎక్స్ క్యూజీవ్ స్టోరీస్ ను రూపొందిస్తాం.
ఇందులో యాక్షన్ థ్రిల్లర్స్, బయోపిక్స్, మర్డర్ మిస్టరీస్, జైల్ బ్రేక్ డ్రామాస్ లాంటి వాటిని సినిమాలు, వెబ్ షోస్, వెబ్ సీరిస్ ద్వారా త్వరలోనే తీసుకొస్తాం” అని అన్నారు. తాజాగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ 2025 నాటికి ఆప్టిక్ ఫైబర్ ద్వారా దేశంలోని గ్రామీణ ప్రాంతాలకు సైతం 5జీ స్పెక్ట్రమ్ ను వినియోగంలోకి తీసుకొస్తామని చెప్పిన నేపథ్యంలో ఓటీటీ మార్కెట్ కు గణనీయమైన ఆదరణ పల్లె ప్రాంతాల నుండి కూడా లభిస్తుందనే ఆశాభావాన్ని భూషణ్ కుమార్ వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Ramayana vs Godzilla: ‘రామాయణం’ vs ‘గాడ్జిల్లా’.. దీపావళికి గ్లోబల్ క్లాష్ తప్పదా ?
-
Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి.. మంత్రులకు నారా లోకేష్ దిశానిర్దేశం!
-
Vivo S2: భారత్లో వివో S2 విడుదల.. 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 7,050mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Missing Meghana First Look: ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్గా తెలుగు సినిమా.. వి.వి. వినాయక్ చేతుల మీదుగా ‘మిస్సింగ్ మేఘన’ ఫస్ట్ లుక్ రిలీజ్
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!