తమిళ హీరో సూర్య కు తమిళ్ తో పాటు తెలుగులోను భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమాకు హిట్ టాక్ వచ్చిందంటే భారీ కలెక్షన్స్ కూడా రాబడతాయి. అలంటి సూర్య తెలుగు సినిమా ఎప్పుడు చేస్తాడా అని ఎంతగానో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కున సూర్య గుడ్ న్యూస్ చెప్పాడు. సూర్య నటించిన లేటెస్ట్ సినిమా రెట్రో. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు.
Also Read : Tollywood : వీళ్లు మారరు.. HIT – 3 కోసం అదనపు రేట్లు
చాలా రోజుల నుండి సూర్య స్ట్రయిట్ తెలుగు సినిమా చేయబోతున్నాడు అని వార్తలు వస్తున్నాయి కానీ అధికారకంగా ఎక్కడ ప్రకటించలేదు. తాజాగా జరిగిన రెట్రో ప్రీ రిలీజ్ ఈ ఈవెంట్ లో వెంకీ అట్లూరి సినిమాను సూర్య అఫీషియల్ గా ప్రకటించాడు. సూర్య మాట్లాడుతూ ‘ తెలుగులో నా జర్నీ అల్లు అరవింద్ గారితో స్టార్ట్ అయింది. ఆయన అశీసులతో త్వరలో సితార ఎంటర్టైన్మెంట్స్ లో సినిమా చేయబోతున్నాను. ఈ సినిమాకు నా తమ్ముడు లాంటి వాడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు. నేను నెక్ట్స్ చేయబోయే సినిమా ఇదే. మే నెలలో స్టార్ట్ చేయబోతున్నాను. ఫ్యాన్స్ అందరి ప్రేమ, సపోర్ట్ కావాలి. మీరు ఇచ్చే సపోర్ట్ తో మరిన్నిమంచి సినిమాలు చేస్తాను’ అని అభిమానులనుద్దేశించి ప్రసంగించారు సూర్య. ఈ సినిమాకు సంబందించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కాగా తమిళ్ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేసిన రెట్రో మే 1న న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.