తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు 2026 సమీపిస్తున్న వేళ ఆ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి, పార్టీల పొత్తు లెక్కలు, సీట్ల సర్దుబాట్లు ఒకవైపు జరుగుతుండగానే ‘పుతియ నీది కచ్చి’ (New Justice Party) తన అభ్యర్థుల ప్రకటనతో రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టించింది. ముఖ్యంగా మధురై సెంట్రల్ నియోజకవర్గం నుంచి ప్రముఖ సినీ దర్శకుడు, నటుడు సుందర్ సి’ని బరిలోకి దించుతున్నట్లు ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఏసీ షణ్ముగం అధికారికంగా ప్రకటించారు, తమిళ సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న సుందర్ సి, ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టడం హాట్ టాపిక్ అయింది. ‘సన్ ఆఫ్ చిదంబరం పిళ్ళై’గా గుర్తింపు పొందిన ఆయన, మధురై ప్రజలతో ఉన్న అనుబంధాన్ని ఓట్లుగా మలుచుకోవాలని భావిస్తున్నారు.
Also Read : Manchu Lakshmi: ప్రతి రూపాయి ఒక చిన్నారి భవిష్యత్తును మారుస్తుంది
నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA)లో భాగంగా ఉన్న పుతియ నీది కచ్చి, అన్నా డీఎంకే మద్దతుతో ఈ స్థానాన్ని దక్కించుకోవాలని పక్కా ప్లాన్ వేసి, ఒక స్టార్ దర్శకుడిని రంగంలోకి దించి యువతను, సినీ అభిమానులను ఆకట్టుకోవచ్చని కూటమి ధీమా వ్యక్తం చేస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ప్రస్తుతం తమిళనాడు బీజేపీలో కీలకంగా వ్యవహరిసున్న ఖుష్బూ సుందర్ సి భార్య కావడం గమనార్హం. మధురై అభ్యర్థి ప్రకటన కేవలం ఆరంభం మాత్రమేనని ఏసీ షణ్ముగం స్పష్టం చేశారు, రాబోయే మార్చి 30, సోమవారం నాడు మరిన్ని కీలక నిర్ణయాలను ప్రకటించబోతున్నారు.