20 ఏళ్ళ ‘నువ్వు-నేను’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
(ఆగస్టు 10తో ‘నువ్వు-నేను’కు 20 ఏళ్ళు)
తొలి ప్రయత్నంగా దర్శకుడు తేజ రూపొందించిన ‘చిత్రం’ అప్పట్లో యువతను విశేషంగా ఆకట్టుకొని సంచలన విజయం సాధించింది. ఆ చిత్ర కథానాయకుడు ఉదయ్ కిరణ్ కు యూత్ లో మంచి ఫాలోయింగ్ ను సంపాదించి పెట్టింది. తరువాత ఉదయ్ కిరణ్ హీరోగా తేజ రూపొందించిన చిత్రం ‘నువ్వు-నేను’. ఇందులోనూ ప్రేమకథనే తీసుకొని మరోమారు యువతను రంజింప చేస్తూ అంతకు మించిన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు తేజ. ఈ చిత్రంతో నవతరం కథానాయకుల్లో స్టార్ గా స్థానం సంపాదించారు ఉదయ్ కిరణ్. 2001 ఆగస్టు 10న విడుదలైన ‘నువ్వు-నేను’లోని ప్రేమకథ జనానికి గిలిగింతలు పెట్టింది.
Also Read
- Tollywood First Half Results : టాలీవుడ్ ఫస్ట్ హాఫ్.. అదరగొట్టిన చిరు.. ఆదుకున్న సమంత
- God of Masses Birthday Special : నటసింహం 'బంగారు బాలయ్య'.. బర్త్ డే స్పెషల్
- Bharathiraja Special : భారతీయ సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే దర్శకులు 'భారతీరాజా'
- NTR : తెలుగువారి ఆత్మగౌరవం.. అఖండ తెలుగు జాతి కీర్తి పతాకం.. 'ఎన్టీఆర్' 103వ జయంతి సందర్భంగా ఘన నివాళి!
‘నువ్వు-నేను’ కథ విషయానికి వస్తే, ఓ ధనవంతుల అబ్బాయికి, పాల వ్యాపారం చేసుకొనే నాటు రకం మనిషి కూతురుకి మధ్య సాగే ప్రేమకథ ఇది. ఈ రెండు పంక్తులు వినగానే రాజ్ కపూర్ రూపొందించిన ‘బాబీ’ చిత్రం గుర్తుకు వస్తుంది. అయితే ఇక్కడ ‘నువ్వు-నేను’లో ఆటలతో కాలక్షేపం చేసే అబ్బాయికి, అదే కళాశాలలో అతని క్లాస్ మేట్ పెట్టే చీవాట్లు ఆమెపై ప్రేమకలిగేలా చేస్తాయి. అబ్బాయి తండ్రి వారి ప్రేమను అంగీకరించడు. తాను తెచ్చిన కోటీశ్వరుల అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలంటాడు. అందుకు తనయుడు ఒప్పుకోడు. ప్రేమించిన అమ్మాయిని తీసుకువెళ్ళి పడరాని పాట్లు పడతారు. ఇక్కడ మళ్ళీ ‘దిల్’ గుర్తుకు రాకమానదు. చివరకు తండ్రి ధనం జులుమ్ చూపించాలనుకుంటాడు. మరోవైపు అమ్మాయి మేనత్త ఆమెను రాచిరంపాన పెడుతుంది. చివరకు విద్యార్థులంతా ఏకమై అనుకున్న ప్రకారం అసెంబ్లీ ముందు వారిద్దరి వివాహం చేయించడంతో కథ సుఖాంతమవుతుంది.
చెప్పుకోవడానికి కథ ఇంతే అయినా, తేజ కథను నడిపిన తీరు ఆకట్టుకుంటుంది. ఇందులో రవిగా ఉదయ్ కిరణ్, వసుంధరగా అనిత నటించారు. సునీల్, బెనర్జీ, తనికెళ్ళ భరణి, రాధికా చౌదరి, సుప్రియా కార్నిక్, వైజాగ్ ప్రసాద్, శకుంతల, రాళ్ళపల్లి, ఆహుతి ప్రసాద్, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, సంగీత తదితరులు అభినయించారు. ఈ చిత్రానికి ఆర్పీ పట్నాయక్ సంగీతం పెద్ద ఎస్సెట్. కులశేఖర్ పలికించిన తొమ్మిది పాటలూ ఆకట్టుకున్నాయి. “గాజువాక పిల్లా మేం గాజులోల్లం కాదా…”, “ప్రియతమా తెలుసునా…”, “అయ్యయ్యో… అయ్యయ్యో…”, “నువ్వు నేను…”, “నీ కోసమే…”, “నా గుండెలో…”, “నువ్వే నాకు ప్రాణం…”, “గున్నమావి…” పాటలు ఆదరణ పొందాయి.
‘నువ్వు-నేను’ చిత్రం ఉత్తమదర్శకునిగా తేజకు, ఉత్తమ కేరెక్టర్ యాక్టర్ గా తనికెళ్ళ భరణికి, ఉత్తమ హాస్యనటునిగా సునీల్ కు, ఉత్తమ సంగీత దర్శకునిగా ఆర్పీ పట్నాయక్ కు, ఉత్తమ ఛాయాగ్రాహకునిగా రసూల్ ఎల్లోర్ కు నంది అవార్డులు సంపాదించిపెట్టింది. ఇప్పటికీ ఈ సినిమా బుల్లితెరపై ప్రసారమవుతున్న సమయంలో జనం కట్టుకదలక చూస్తూనే ఉండడం కనిపిస్తూ ఉంటుంది.
తాజావార్తలు
-
Praful Hinge: SRH పేసర్ ప్రఫుల్ హింగేకు అరుదైన అవకాశం.. భారత్ ‘ఏ’ జట్టులోకి ఎంట్రీ..
-
Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
-
No UPI-Only Cash: నో యూపీఐ ఓన్లీ క్యాష్.. దుకాణాల ముందు ప్రత్యక్షమవుతున్న బోర్డులు..
-
Rahul Gandhi: ఈ వ్యవస్థలో విద్యార్థులు భవిష్యత్ను చూడలేకపోతున్నారు.. రాహుల్గాంధీ కీలక వ్యాఖ్యలు
-
BJP: ‘‘ప్రతిధ్వని’’ ఎక్కడ.? ‘‘ధమకా’’ ఇక్కడే.. రాహుల్పై బీజేపీ సెటైర్లు..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!