50 ఏళ్ళ ‘మేరే అప్నే’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
(సెప్టెంబర్ 10న ‘మేరే అప్నే’కు 50 ఏళ్ళు పూర్తి)
మనసును కట్టి పడేసే కథలు ఎవరినైనా ఆకట్టుకుంటాయి. అలాంటి కథలను పేరున్నవారు సైతం రీమేక్ చేయడానికి ఇష్టపడతారు. బెంగాలీలో తపన్ సిన్హా రూపొందించిన ‘అపన్ జన్’ ఆధారంగా హిందీలో ‘మేరే అప్నే’ చిత్రాన్ని తెరకెక్కించారు గుల్జార్. ఈ ‘మేరే అప్నే’తోనే గుల్జార్ దర్శకునిగా మారడం విశేషం! ప్రముఖ చిత్ర నిర్మాత ఎన్.సి. సిప్పీ ఈ సినిమాను నిర్మించారు. మీనాకుమారి ప్రధాన పాత్రలో రూపొందిన ‘మేరే అప్నే’ చిత్రంతోనే వినోద్ ఖన్నా హీరోగా పరిచయం కావడం విశేషం. అలాగే ప్రముఖ నటుడు డానీ తొలిసారి తెరపై కనిపించింది కూడా ఈ చిత్రంతోనే. ఈ సినిమాలో శత్రుఘ్న సిన్హా మరో ప్రధాన భూమిక పోషించారు. 1971 సెప్టెంబర్ 10న విడుదలైన ‘మేరే అప్నే’ మంచి విజయం సాధించింది.
Also Read
- Dancers Association Rift: 'ఉప ఎన్నికల'కే మొగ్గు చూపిన అధ్యక్షురాలు.. 'పూర్తి ఎన్నికలు' కావాలంటున్న అసమ్మతి వర్గం!
- TamannaahBhatia : బోల్డ్ హారర్ థ్రిల్లర్లో తమన్నా భాటియా.. రసహృదయాలు కాస్త జాగ్రత్త
- NBK 111 Release Date : సంక్రాంతి కాదు.. బాలయ్య - గోపీచంద్ మలినేని NBK111 రిలీజ్ డేట్ ఫిక్స్?
- Mahendragiri Varahi : థియేటర్లలోకి వారాహి అమ్మవారి ఆగమనం.. 'మహేంద్రగిరి వారాహి' టీమ్ వినూత్న ప్రమోషన్స్!
‘మేరే అప్నే’ కథ విషయానికి వస్తే- ఈ కథ ప్రధానంగా ఓ ముసలమ్మ చుట్టూ తిరుగుతుంది. మారుమూల పల్లెలో ఉన్న ముసలమ్మను దూరపు బంధువు వచ్చి పట్నం రమ్మని, తమతోనే ఉండమని బలవంత పెట్టి తీసుకుపోతాడు. అక్కడకు వెళ్ళాక తెలుస్తుంది- వారికి పని మనిషి దొరకనందున తనపై ప్రేమ ఒలకబోశారని. దాంతో ముసలమ్మ వేరే చోటు చూసుకుంటుంది. ఆమె ఉండే ప్రాంతంలోనే శ్యామ్, ఛేను అనే ఇద్దరు రెండు వర్గాలకు నాయకులుగా చెలామణీ అవుతుంటారు. తరచూ వారి వర్గాలు పోట్లాడుకుంటూ ఉంటాయి. శ్యామ్ కొన్నిసార్లు ఈ శత్రుత్వం వదిలేద్దామని ఛేనుతో అంటూ ఉంటాడు. కానీ, వారి వర్గాల్లోని మనుషుల వల్ల పోట్లాటలు సాగుతూనే ఉంటాయి. ఓ అనాథ బాలుడు పదిపైసలిస్తే ఏమైనా తింటానని ముసలమ్మను అడుగుతాడు. ఆమె ఆ బాబును తనతోపాటే సాకుతుంది. ఆ బాబు ‘నానీ మా’ అంటూ ఆమెను పిలుస్తూంటాడు. శ్యామ్, ఛేను కూడా అలాగే పిలుస్తారు. ఓ సారి మళ్ళీ శ్యామ్, ఛేను వర్గాల మధ్య గొడవలు – వారిలో ఓ వ్యక్తి నాటు బాంబు వేస్తాడు. పోట్లాట సాగుతుంది. అందులో నానీ మా మరణిస్తుంది. ఆమె మరణం రెండు వర్గాల వారిని కలచివేస్తుంది. అందరినీ పోలీసులు అరెస్ట్ చేసి వ్యానులో తీసుకుపోతారు. అదే సమయంలో ఆసుపత్రి వ్యానులో ముసలమ్మ శవాన్ని తీసుకెళ్తారు. మళ్ళీ అనాథ బాలుడు ఒంటరి కావడంతో కథ ముగుస్తుంది.
ఈ చిత్రంలో ‘నాని మా’గా మీనా కుమారి నటించారు. వినోద్ ఖన్నా, శత్రుఘ్న సిన్హా, అస్రానీ, డానీ, పైనిటాల్, దినేశ్ ఠాకూర్, సుమితా సన్యాల్, మెహమూద్ తదితరులు నటించారు.
ఈ కథలోని పోరాటాలు చూస్తే తరువాత వచ్చిన ‘శివ’లాంటి పలు చిత్రాలు గుర్తుకు వస్తాయి. పైగా ఇందులో రాజకీయ నాయకుల ఊసు కూడా పలు సినిమాల్లో మనకు తారసపడిందే కనిపిస్తుంది. ఈ చిత్రానికి ఇందిరా మిత్రతో కలసి గుల్జార్ మాటలు రాశారు. ఇందులోని నాలుగు పాటలనూ గుల్జార్ కలం పలికించింది. సలీల్ చౌదరి బాణీల్లో అన్ని పాటలూ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా కిశోర్ కుమార్ పాడిన “కోయి హోతా జిస్కో అప్నా…” సాంగ్ ఇప్పటికీ సంగీతాభిమానులను అలరిస్తూనే ఉంది.
తాజావార్తలు
-
6500mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే , 90W ఛార్జింగ్.. ఐఫోన్ 17 ప్రో మాక్స్ లా కనిపించే ఫోన్ అందుబాటులోకి..
-
ENG Vs IND, 3rd ODI : టీమిండియాకు మరో బిగ్ షాక్.. మూడో వన్డేకు స్టార్ ప్లేయర్ దూరం..
-
Devendra Fadnavis: సీఎం పదవికి ఫడ్నవీస్ రాజీనామా.. సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు..
-
Citizenship: భూమి పత్రాలు పౌరసత్వానికి ఆధారం కాదు: కలకత్తా హైకోర్టు..
-
UK: బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్హామ్.. సోమవారం బాధ్యతలు స్వీకరణ
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?