50 ఏళ్ళ ‘మేరే అప్నే’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
(సెప్టెంబర్ 10న ‘మేరే అప్నే’కు 50 ఏళ్ళు పూర్తి)
మనసును కట్టి పడేసే కథలు ఎవరినైనా ఆకట్టుకుంటాయి. అలాంటి కథలను పేరున్నవారు సైతం రీమేక్ చేయడానికి ఇష్టపడతారు. బెంగాలీలో తపన్ సిన్హా రూపొందించిన ‘అపన్ జన్’ ఆధారంగా హిందీలో ‘మేరే అప్నే’ చిత్రాన్ని తెరకెక్కించారు గుల్జార్. ఈ ‘మేరే అప్నే’తోనే గుల్జార్ దర్శకునిగా మారడం విశేషం! ప్రముఖ చిత్ర నిర్మాత ఎన్.సి. సిప్పీ ఈ సినిమాను నిర్మించారు. మీనాకుమారి ప్రధాన పాత్రలో రూపొందిన ‘మేరే అప్నే’ చిత్రంతోనే వినోద్ ఖన్నా హీరోగా పరిచయం కావడం విశేషం. అలాగే ప్రముఖ నటుడు డానీ తొలిసారి తెరపై కనిపించింది కూడా ఈ చిత్రంతోనే. ఈ సినిమాలో శత్రుఘ్న సిన్హా మరో ప్రధాన భూమిక పోషించారు. 1971 సెప్టెంబర్ 10న విడుదలైన ‘మేరే అప్నే’ మంచి విజయం సాధించింది.
Also Read
- Varalaxmi Sarathkumar Controversy : నేను అరవను కరుస్తా... "పోలీస్ కంప్లైంట్" డైరెక్టర్ కు హీరోయిన్ వరలక్ష్మీ స్ట్రాంగ్ కౌంటర్
- Vadde Naveen : బాహుబలి కంటే పుష్పనే స్పెషల్... స్టార్స్ సినిమాలపై వడ్డే నవీన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
- Tollywood : తెలుగులో అప్పట్లో హ్యాట్రిక్ ఫ్లాప్స్.. అయినా వరుస ఛాన్సులు
- NBK 111 : దటీజ్ గాడ్ ఆఫ్ మాసెస్.. మాస్ అంటేనే బాలయ్య
‘మేరే అప్నే’ కథ విషయానికి వస్తే- ఈ కథ ప్రధానంగా ఓ ముసలమ్మ చుట్టూ తిరుగుతుంది. మారుమూల పల్లెలో ఉన్న ముసలమ్మను దూరపు బంధువు వచ్చి పట్నం రమ్మని, తమతోనే ఉండమని బలవంత పెట్టి తీసుకుపోతాడు. అక్కడకు వెళ్ళాక తెలుస్తుంది- వారికి పని మనిషి దొరకనందున తనపై ప్రేమ ఒలకబోశారని. దాంతో ముసలమ్మ వేరే చోటు చూసుకుంటుంది. ఆమె ఉండే ప్రాంతంలోనే శ్యామ్, ఛేను అనే ఇద్దరు రెండు వర్గాలకు నాయకులుగా చెలామణీ అవుతుంటారు. తరచూ వారి వర్గాలు పోట్లాడుకుంటూ ఉంటాయి. శ్యామ్ కొన్నిసార్లు ఈ శత్రుత్వం వదిలేద్దామని ఛేనుతో అంటూ ఉంటాడు. కానీ, వారి వర్గాల్లోని మనుషుల వల్ల పోట్లాటలు సాగుతూనే ఉంటాయి. ఓ అనాథ బాలుడు పదిపైసలిస్తే ఏమైనా తింటానని ముసలమ్మను అడుగుతాడు. ఆమె ఆ బాబును తనతోపాటే సాకుతుంది. ఆ బాబు ‘నానీ మా’ అంటూ ఆమెను పిలుస్తూంటాడు. శ్యామ్, ఛేను కూడా అలాగే పిలుస్తారు. ఓ సారి మళ్ళీ శ్యామ్, ఛేను వర్గాల మధ్య గొడవలు – వారిలో ఓ వ్యక్తి నాటు బాంబు వేస్తాడు. పోట్లాట సాగుతుంది. అందులో నానీ మా మరణిస్తుంది. ఆమె మరణం రెండు వర్గాల వారిని కలచివేస్తుంది. అందరినీ పోలీసులు అరెస్ట్ చేసి వ్యానులో తీసుకుపోతారు. అదే సమయంలో ఆసుపత్రి వ్యానులో ముసలమ్మ శవాన్ని తీసుకెళ్తారు. మళ్ళీ అనాథ బాలుడు ఒంటరి కావడంతో కథ ముగుస్తుంది.
ఈ చిత్రంలో ‘నాని మా’గా మీనా కుమారి నటించారు. వినోద్ ఖన్నా, శత్రుఘ్న సిన్హా, అస్రానీ, డానీ, పైనిటాల్, దినేశ్ ఠాకూర్, సుమితా సన్యాల్, మెహమూద్ తదితరులు నటించారు.
ఈ కథలోని పోరాటాలు చూస్తే తరువాత వచ్చిన ‘శివ’లాంటి పలు చిత్రాలు గుర్తుకు వస్తాయి. పైగా ఇందులో రాజకీయ నాయకుల ఊసు కూడా పలు సినిమాల్లో మనకు తారసపడిందే కనిపిస్తుంది. ఈ చిత్రానికి ఇందిరా మిత్రతో కలసి గుల్జార్ మాటలు రాశారు. ఇందులోని నాలుగు పాటలనూ గుల్జార్ కలం పలికించింది. సలీల్ చౌదరి బాణీల్లో అన్ని పాటలూ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా కిశోర్ కుమార్ పాడిన “కోయి హోతా జిస్కో అప్నా…” సాంగ్ ఇప్పటికీ సంగీతాభిమానులను అలరిస్తూనే ఉంది.
తాజావార్తలు
-
MLA Chirri Balaraju: పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కార్యాలయంలో ఉద్రిక్తత..
-
Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
-
Two Trains: ఒకే ట్రాక్పై ఎదురెదురుగా వచ్చిన ట్రైన్లు.. తృటిలో తప్పిన ప్రమాదం..
-
KC Venugopal: కాంగ్రెస్లో టీఎంసీ విలీనంపై కీలక వ్యాఖ్యలు.. సోనియా-మమత భేటీపై కేసీ.వేణుగోపాల్ క్లారిటీ
-
Rajya Sabha Elections: ఏపీ నుంచి రాజ్యసభకు నలుగురు సభ్యులు ఏకగ్రీవ ఎన్నిక.. అధికారిక ప్రకటన
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!