(సెప్టెంబర్ 25న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వర్ధంతి) గానగంధర్వుడుగా జనం మదిలో నిలచిన ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం మనవాడు. తెలుగువాడు. బాలు పాటే మనకు తోడు. మనసు బాగోలేనప్పుడు ఆయన గానం మనకు ఓదార్పు. బాలు గాత్రంలో జాలువారిన హుషారయిన పాటలు వింటే చాలు జోష్ కలగాల్సిందే! అంతలా మనలను అలరించిన బాలు భారతీయుడు కావడం మహదానందం. ఇంకా చెప్పాలంటే బాలు పాట విన్నప్రతీవారూ పులకించిపోతారు. ఆ కోణంలో బాలు విశ్వమానవుడు కూడా! ఏ తీరున చూసినా బాలు అందరివాడు. అందరినీ…
గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గతేడాది వైరస్ బారిన పడి స్వర్గస్తులయ్యారు. 2020, ఆగస్టు 5 తేదీన కరోనా వ్యాధి బారినపడ్డ బాలు.. చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్లో చికిత్స పొందుతూ సెప్టెంబర్ 25న కన్నుమూశారు. భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన పాడిన వేలాది పాటలతో మనందరి హృదయాల్లో చిరస్థాయిగా గుర్తుండిపోతాయని అభిమానులు ఆయన్ను స్మరించుకుంటున్నారు. పలువురు ప్రముఖులు కూడా ఆయనను గుర్తు చేసుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ‘ఆ గాన గంధర్వుని స్మృతికి నివాళులర్పిస్తున్నాను అంటూ ట్వీట్…