‘Fateh’: సైబర్ క్రైమ్ నేపథ్యంలో సోనూసూద్ ‘ఫతే’ మూవీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sonu Sood: సోనూసూద్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ జంటగా వైభవ్ మిశ్రా దర్శకత్వంలో శాంతి సాగర్ ప్రొడక్షన్ నిర్మిస్తున్న సైబర్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఫతే’. ఈ చిత్రం షూటింగ్ పంజాబ్లోని అమృత్సర్లో గ్రాండ్ గా ప్రారంభం జరుపుకుంది. అనంతరం హీరో సోనూ సూద్ మాట్లాడుతూ, “సైబర్ క్రైమ్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రం ఇది. వాస్తవికతకు దగ్గర ఉండేలా ఇది రూపుదిద్దుకోనుంది . లాక్డౌన్ సమయంలో ప్రజలకు జరిగిన కొన్ని నిజ జీవిత సంఘటనల నుండి ప్రేరణ పొంది ఈ సినిమా తీయడం జరుగుతోంది” అని అన్నారు. హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మాట్లాడుతూ.. “దర్శకుడు వైభవ్ మిశ్రా చెప్పిన కథ నచ్చడంతో తనిచ్చిన స్క్రిప్టు చదివాను. చదివినప్పటి నుండి, ఇలాంటి మంచి చిత్రంలో నటించాలనే ఇంట్రెస్ట్ కలిగింది. మేం చేస్తున్న ఈ ‘ఫతే’ సినిమా ప్రేక్షకులందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది” అని చెప్పారు.
ఈ చిత్రాన్ని సమర్పిస్తున్న జీ స్టూడియోస్ సి.బి.ఓ. షరీక్ పటేల్ మాట్లాడుతూ, “మన దేశంలో అత్యంత గౌరవనీయమైన వ్యక్తులలో సోనూ ఒకరు. అలాంటి వ్యక్తితో ‘ఫతే’ సినిమా నిర్మించడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాకు హాలీవుడ్ టెక్నీషియన్స్ పని చేయబోతున్నారు. శరవేగంగా షూటింగ్ జరిపి, ఈ యేడాది చివర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తాం” అని అన్నారు.
Also Read
తాజావార్తలు
-
Tamil Nadu politics: తమిళనాడు రాజకీయాల్లో కొత్త ట్విస్ట్.. నకిలీ మద్దతు లేఖ వివాదం..! గవర్నర్, పీఎస్లో ఫిర్యాదు..
-
Kedar Jadhav: సచిన్తో పోలికలా? 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీపై కేదార్ జాదవ్ సంచలన వ్యాఖ్యలు!
-
Suvendu Adhikari: నేడే సువేందు ప్రమాణ స్వీకారం.. దీదీని గద్దె దించిన బెంగాల్ బాద్షా గురించి ఆసక్తికర విషయాలు..
-
Kriti-Rashmika: రష్మిక గురించి కృతి సనన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
-
Axar Patel-DC: వచ్చే ఏడాది చూసుకుంటాం.. ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు!