Sapta Sagaralu Dhaati: ‘సప్త సాగరాలు దాటి’ టెన్షన్ పెట్టింది కానీ.. రిలీజ్ కి స్పెషల్ ప్లాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sapta Sagaralu Dhaati Hero Rakshit Shetty Interview: కన్నడలో ఘన విజయం సాధించిన ‘సప్త సాగర దాచే ఎల్లో’ సినిమాను ‘సప్త సాగరాలు దాటి’ పేరుతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది. ‘అతడే శ్రీమన్నారాయణ’, ‘777 చార్లీ’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరైన రక్షిత్ శెట్టి హీరోగా నటిస్తూ నిర్మించిన ఈ సినిమా ‘సప్త సాగర దాచే ఎల్లో’ కన్నడలో సూపర్ హిట్ అందుకుంది. హేమంత్ ఎం రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటించగా ‘సప్త సాగరాలు దాటి’ అనే టైటిల్ తో సెప్టెంబర్ 22న ఈ తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో తెలుగు విలేకర్లతో ముచ్చటించిన రక్షిత్ శెట్టి పలు కీలక విషయాలు పంచుకున్నారు. దర్శకుడు హేమంత్ తో ఇది నాకు రెండో సినిమా అని తన మొదటి సినిమా ‘గోధి బన్న సాధారణ మైకట్టు’లో కూడా నేను నటించానని అన్నారు. తన రెండో సినిమా కూడా నాతో చేయాలి అనుకున్నా కానీ అప్పుడు నేను ‘అతడే శ్రీమన్నారాయణ’తో బిజీగా ఉండటం వల్ల కుదరలేదని కానీ ఇప్పుడు మూడో సినిమాకి ఇలా కుదిరిందని అన్నారు.. దర్శకుడిగా హేమంత్ ది ఒక విభిన్న శైలి అని, అతని మొదటి రెండు సినిమాలకే కన్నడ పరిశ్రమకు మరో మంచి దర్శకుడు దొరికాడనిపించిందని అన్నారు. చిత్రీకరణకు ముందు ఈ సినిమాని ఎలా తెరకెక్కిస్తారా అనే ఆసక్తి ఉండేది కానీ ఆయన ఈ కథని పొయెటిక్ గా ఎంతో అందంగా రూపొందించారని అన్నారు.
Anasuya Bharadwaj: ‘రంగమ్మత్త’ను మర్చిపోతారంటున్న అనసూయ
Also Read
మొదట రెండు భాగాలు అనే ఆలోచన లేదు అయితే షూటింగ్ సమయంలో ప్రధాన పాత్రలు మను-ప్రియ మధ్య కెమిస్ట్రీ చూసి హేమంత్ రెండు భాగాలుగా చెప్పాలి అనుకున్నారని అన్నారు. హేమంత్ బౌండెడ్ స్క్రిప్ట్ తో రెడీగా ఉంటారు, ఏం చేయాలో క్లారిటీ ఉంటుంది అయినప్పటికీ షూటింగ్ సమయంలో ఇంకా ఏమైనా మెరుగు పరచగలమా అని ఆలోచిస్తూనే ఉంటారని అన్నారు. అలా కొంత భాగం షూటింగ్ అయ్యాక రెండు భాగాలుగా విడుదల చేయాలని ఆయన భావించారని అన్నారు.. మొదట నాకు కాస్త ఆందోళన కలిగినప్పటికీ.. కథ మీద, ఆయన విజన్ మీద నమ్మకంతో అంగీకరించానని షూట్ అయ్యాక ఎడిటింగ్ టేబుల్ లో చూసుకున్నాక రెండు భాగాలుగా చెప్పాలనే ఆయన ఆలోచన సరైనది అనిపించిందని అన్నారు. మామూలుగా మొదటి భాగం, రెండవ భాగం ఎక్కువ వ్యవధితో విడుదల చేస్తున్నారు కానీ మేము ఏడు వారాల వ్యవధిలోనే విడుదల చేస్తున్నాం కాబట్టి ప్రేక్షకులు కథతో, పాత్రలతో తేలికగా పయనిస్తారని అన్నారు. ఇది 2010 సమయంలో జరిగే కథ కావడంతో క్యాసెట్లతో ముడిపడి ఉంటుందని, అప్పుడు మనకు పాటల క్యాసెట్లు ఉండేవని అన్నారు. వాటిలో సైడ్-A, సైడ్-B అని ఉంటాయి, సైడ్-A పూర్తయిన తర్వాత సైడ్-B ప్లే చేస్తాం ఆ ఉద్దేశంతో ఇలా సైడ్-A, సైడ్-B అని పెట్టడం జరిగిందని అన్నారు.
తాజావార్తలు
-
Paper Leaks: పంజాబ్లో పేపర్ లీక్.. చిక్కుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ..
-
CM Revanth Reddy vs KTR : సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య సవాళ్లు.. మాటల తూటాలు.!
-
CJI Protest: నిరసనకారులకు ఢిల్లీ పోలీసులు బిగ్ షాక్.. అలా చేస్తే పాస్పోర్టులు రద్దు!
-
Whisky Business: విస్కీ కిక్కు మామూలుగా లేదు.. మూడు నెలల్లోనే రూ.391 కోట్ల లాభం!
-
Shikhar Dhawan: కాక్రోచ్ ఉద్యమంపై శిఖర్ ధావన్ పోస్ట్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్..
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?