Sapta Sagaralu Dhaati: ‘సప్త సాగరాలు దాటి’ టెన్షన్ పెట్టింది కానీ.. రిలీజ్ కి స్పెషల్ ప్లాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sapta Sagaralu Dhaati Hero Rakshit Shetty Interview: కన్నడలో ఘన విజయం సాధించిన ‘సప్త సాగర దాచే ఎల్లో’ సినిమాను ‘సప్త సాగరాలు దాటి’ పేరుతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది. ‘అతడే శ్రీమన్నారాయణ’, ‘777 చార్లీ’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరైన రక్షిత్ శెట్టి హీరోగా నటిస్తూ నిర్మించిన ఈ సినిమా ‘సప్త సాగర దాచే ఎల్లో’ కన్నడలో సూపర్ హిట్ అందుకుంది. హేమంత్ ఎం రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటించగా ‘సప్త సాగరాలు దాటి’ అనే టైటిల్ తో సెప్టెంబర్ 22న ఈ తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో తెలుగు విలేకర్లతో ముచ్చటించిన రక్షిత్ శెట్టి పలు కీలక విషయాలు పంచుకున్నారు. దర్శకుడు హేమంత్ తో ఇది నాకు రెండో సినిమా అని తన మొదటి సినిమా ‘గోధి బన్న సాధారణ మైకట్టు’లో కూడా నేను నటించానని అన్నారు. తన రెండో సినిమా కూడా నాతో చేయాలి అనుకున్నా కానీ అప్పుడు నేను ‘అతడే శ్రీమన్నారాయణ’తో బిజీగా ఉండటం వల్ల కుదరలేదని కానీ ఇప్పుడు మూడో సినిమాకి ఇలా కుదిరిందని అన్నారు.. దర్శకుడిగా హేమంత్ ది ఒక విభిన్న శైలి అని, అతని మొదటి రెండు సినిమాలకే కన్నడ పరిశ్రమకు మరో మంచి దర్శకుడు దొరికాడనిపించిందని అన్నారు. చిత్రీకరణకు ముందు ఈ సినిమాని ఎలా తెరకెక్కిస్తారా అనే ఆసక్తి ఉండేది కానీ ఆయన ఈ కథని పొయెటిక్ గా ఎంతో అందంగా రూపొందించారని అన్నారు.
Anasuya Bharadwaj: ‘రంగమ్మత్త’ను మర్చిపోతారంటున్న అనసూయ
Also Read
- Peddi Censor Review : 'రంగస్థలం'ను మించిన యాక్టింగ్.... లాస్ట్ 50 నిమిషాలు గూస్బంప్స్ గ్యారెంటీ!
- Purusha: ఫ్లాప్ అయితే మళ్లీ వ్యవసాయమే.. నిర్మాత షాకింగ్ కామెంట్స్
- Prashanth Neel : ఎన్టీఆర్ బక్క చిక్కడం చూసి భయపడిపోయా.. ఎన్టీఆర్ భార్య కూడా నాపై సీరియస్ అయింది
- He-Man: ‘హీ-మ్యాన్’గా యంగ్ హీరో నిఖిల్.. దద్దరిల్లుతున్న ట్రైలర్!
మొదట రెండు భాగాలు అనే ఆలోచన లేదు అయితే షూటింగ్ సమయంలో ప్రధాన పాత్రలు మను-ప్రియ మధ్య కెమిస్ట్రీ చూసి హేమంత్ రెండు భాగాలుగా చెప్పాలి అనుకున్నారని అన్నారు. హేమంత్ బౌండెడ్ స్క్రిప్ట్ తో రెడీగా ఉంటారు, ఏం చేయాలో క్లారిటీ ఉంటుంది అయినప్పటికీ షూటింగ్ సమయంలో ఇంకా ఏమైనా మెరుగు పరచగలమా అని ఆలోచిస్తూనే ఉంటారని అన్నారు. అలా కొంత భాగం షూటింగ్ అయ్యాక రెండు భాగాలుగా విడుదల చేయాలని ఆయన భావించారని అన్నారు.. మొదట నాకు కాస్త ఆందోళన కలిగినప్పటికీ.. కథ మీద, ఆయన విజన్ మీద నమ్మకంతో అంగీకరించానని షూట్ అయ్యాక ఎడిటింగ్ టేబుల్ లో చూసుకున్నాక రెండు భాగాలుగా చెప్పాలనే ఆయన ఆలోచన సరైనది అనిపించిందని అన్నారు. మామూలుగా మొదటి భాగం, రెండవ భాగం ఎక్కువ వ్యవధితో విడుదల చేస్తున్నారు కానీ మేము ఏడు వారాల వ్యవధిలోనే విడుదల చేస్తున్నాం కాబట్టి ప్రేక్షకులు కథతో, పాత్రలతో తేలికగా పయనిస్తారని అన్నారు. ఇది 2010 సమయంలో జరిగే కథ కావడంతో క్యాసెట్లతో ముడిపడి ఉంటుందని, అప్పుడు మనకు పాటల క్యాసెట్లు ఉండేవని అన్నారు. వాటిలో సైడ్-A, సైడ్-B అని ఉంటాయి, సైడ్-A పూర్తయిన తర్వాత సైడ్-B ప్లే చేస్తాం ఆ ఉద్దేశంతో ఇలా సైడ్-A, సైడ్-B అని పెట్టడం జరిగిందని అన్నారు.
తాజావార్తలు
-
Peddi Censor Review : ‘రంగస్థలం’ను మించిన యాక్టింగ్…. లాస్ట్ 50 నిమిషాలు గూస్బంప్స్ గ్యారెంటీ!
-
Acer Aspire 5 AI Laptop: 32GB ర్యామ్, 14-అంగుళాల డిస్ప్లేతో.. ఏసర్ కొత్త ఆస్పైర్ 5 ల్యాప్టాప్ విడుదల
-
NTR : ఎన్టీఆర్ ‘బాల రామాయణం’ కంటే ముందే తాతతో కలిసి ఆ సినిమాలో నటించాడని మీకు తెలుసా?
-
Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో ఎన్ఐఏ సంచలన ఛార్జిషీట్.. ఆ ఇద్దరి గైడ్స్ ఎంత పని చేశారంటే..!
-
Congress: డీఎంకే వల్ల కాలేదు, 59 ఏళ్ల కాంగ్రెస్ కోరిక తీర్చిన విజయ్..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!