ఆ ప్రశ్నలతో ఎన్టీఆర్ ని టార్గెట్ చేశారా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూ. ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. జనవరి 7 న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ ని వేగవంతం చేశారు మేకర్స్. గత రెండు రోజుల నుంచి అన్ని భాషల్లో ప్రెస్ మీట్లు పెట్టి మీడియా ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నారు. ఇక నేడు హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ ఆద్యంతం ఆసక్తిగా జరిగింది. కొన్ని ఫన్నీ మూమెంట్స్, మరికొన్ని సినిమా విశేషాలతో ప్రెస్ మీట్ అద్భుతంగా జరిగింది. ఇక ఈ నేపథ్యంలో కొన్ని ప్రశ్నలు ఎన్టీఆర్ ని టార్గెట్ చేసి అడిగినట్లు అభిమానులు భావిస్తున్నారు.
ప్రస్తుతం ఏపీ లో టికెట్ ఇష్యూ నడుస్తున్న సంగతి తెలిసిందే. అకస్మాత్తుగా టికెట్ ధరలు తగ్గించడంతో అనేక సినిమాలకు ఇది ఎక్కువ ప్రభావం చూపడం జరుగుతుంది. ఈ క్రమంలోనే ఒక రిపోర్టర్ .. ఏపీ టికెట్ ధరల విషయంలో ఎన్టీఆర్ హెల్ప్ ఏమైనా తీసుకున్నారా..? ఆయన ఫ్రెండ్స్ ఏపీలో మంచి పొజిషన్ లో ఉన్నారు కదా..? అని అడగడం అక్కడ సంచలనంగా మారింది. ఈ ప్రశ్నకు కొద్దిగా ఎన్టీఆర్ షాక్ అయినట్లు కనిపిస్తోంది. అంతేకాకుండా ఆయన మౌనంగా ఉండడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది అని అంటున్నారు నెటిజన్లు.
Also Read
- Nagarjuna: ‘గీతాంజలి’ నా కెరీర్ను మార్చేసింది.. చైతూ, అఖిల్కు నాగార్జున బిగ్ అడ్వైజ్ ఇదే!
- Sai Abhyankkar: ఎక్స్ గర్ల్ఫ్రెండ్ పేరుతోనే పాట.. సాయి అభ్యంకర్ ‘రాధిమా’ వెనుక అసలు కథ ఇదే!
- Varanasi Music Album: వారణాసి ఆల్బమ్ అదిరిపోద్ది.. మొత్తం ఎన్ని పాటలంటే?
- RC17లో రామ్ చరణ్కు జోడీగా ధురంధర్ బ్యూటీ.. లెక్కల మాస్టర్ స్కెచ్ ఇదేనా?
ఇకపోతే ఈ ప్రశ్నకు నిర్మాత డీవీవీ దానయ్య స్పందిస్తూ ” భారతదేశం అంతా ఉన్న ధరలు ఏపీలో మాత్రం ఉన్న వేరే ధరలు ఖచ్చితంగా ప్రభావం చూపుతున్నాయి. మేము వారిని అడిగాము.. ఇంకా ప్రస్తుతం చర్చలు సాగుతున్నాయి. ఒక సానుకూలమైన స్పందనే వస్తుందని ఆశిస్తున్నాం” అని తెలిపారు. అయితే ఈ ప్రశ్న ఎన్టీఆర్ ని టార్గెట్ చేసినట్లుగానే ఉందని నెటిజన్స్ నొక్కి వక్కాణిస్తున్నారు. ఎన్టీఆర్ ఫ్రెండ్స్ అంటే వల్లభనేని వంశీ, కొడాలి నాని అని , వారు ఏమైనా ఎన్టీఆర్ కి హెల్ప్ చేయనున్నారా..? అని రాజకీయాలలోకి ఎన్టీఆర్ ని లాగుతున్నారని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ప్రశాంకు ఎన్టీఆర్ సమాధానం చెప్పకపోవడం కూడా ఒక్కందుకు మంచిదేనని మరికొందరు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రశ్నలు నెట్టింట వైరల్ గా మారాయి.
తాజావార్తలు
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
Congress Leader: సినిమా డైలాగులు రాజకీయాల్లో నడవవు.. కొండా సుష్మితపై ఇందిరా శోభన్ ఫైర్…
-
Nagarjuna: ‘గీతాంజలి’ నా కెరీర్ను మార్చేసింది.. చైతూ, అఖిల్కు నాగార్జున బిగ్ అడ్వైజ్ ఇదే!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
Amit Shah: 1937 నిర్ణయంతోనే విభజనకు పునాది.. ‘వందే మాతరం’ను విభజించిన తప్పును మళ్లీ చేయొద్దు.. కాంగ్రెస్పై అమిత్ షా ఫైర్
ట్రెండింగ్
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!