స్నోబాల్ పిక్చర్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న తొలి చిత్రం ‘రెక్కీ’. ఈ సూపర్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ద్వారా అభిరామ్ హీరోగా పరిచయం అవుతుండగా, సెకండ్ హీరోగా భద్రమ్ నటిస్తున్నాడు. అమీక్షా పవార్, జస్విక హీరోయిన్లు. ఎన్.ఎస్.ఆర్. ప్రసాద్ దర్శకత్వంలో కమలకృష్ణ నిర్మిస్తున్న ‘రెక్కీ’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ లో విడుదల చేశారు. క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో తెలుగు తెరపై ఇప్పటివరకు రాని కథాంశంతో, ఎవరూ ఊహించని ట్విస్టులతో అత్యంత ఆసక్తికరంగా ‘రెక్కీ’ చిత్రం రూపుదిద్దుకుందని చిత్ర యూనిట్ సభ్యులు ఈ సందర్భంగా తెలిపారు.
ఇప్పటికే షూటింగ్ పార్ట్ పూర్తయ్యిందని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని దర్శకుడు ప్రసాద్ తెలిపారు. ఈ చిత్ర రూపకల్పనలో ప్రముఖ నిర్మాత జెమినీ కిరణ్ ఇచ్చిన మోరల్ సపోర్ట్ ను ఎప్పటికీ మర్చిపోలేమని నిర్మాత కమలకృష్ణ అన్నారు. నాగరాజు ఉండ్రమట్ట, దేవిచరణ్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎస్. చిన్నా నేపథ్య సంగీతం అందిస్తున్నారు.