ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నా సినిమా RAPO 22. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ఫేమ్ మహేష్ బాబు. పి దర్శకత్వం వహిస్తున్నాడు. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మాతలు. రామ్ 22వ సినిమాగా వస్తున్న ఈ సినిమాలో రామ్ సరసన అందాల భామ భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇస్మార్ట్ వంటి డిజాస్టర్ తర్వాత రామ్ చేస్తున్న ఈ సినిమాతో తమ హీరో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
Also Read : Suriya : డిజాస్టర్ తర్వాత వస్తున్న సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ అదుర్స్
కాగా ఈ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్ర కోసం ఎప్పటినుండో సీనియర్ నటుడి కోసం అనేక పేర్లు పరిశీలిస్తున్నారు. మొదట ఈ పాత్ర కోసం గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాలకృష్ణ పేరు వినిపించింది. అలాగే మోహన్ లాల్, సూపర్ స్టార్ రజనీకాంత్, శివరాజ్ కుమార్ పేర్లు కూడా వినిపించాయి. కానీ వారెవరు ఫైనల్ కాలేదు. లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం ప్రకారం కన్నడ రియల్ స్టార్ ను సంప్రదించారట మేకర్స్. ఇప్పటికే ఈ విషయమై ఉపేంద్రతో దర్శకులు చర్చలు జరిపారట. సినిమాలో ఆయన పాత్ర వంటివి వివరించగా క్యారెక్టర్ నచ్చడంతో అందుకు ఉపేంద్ర గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసింది. త్వరలోనే దీనిపై అధికారక ప్రకటన రానుంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో శరవేగంగా జరుగుతుండగా ఈ ఏడాది చివర్లో థియేటర్లలోకి వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. తమిళ ద్వయం వివేక్ – మెర్విన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.