మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పారు. గత వారం రోజుల క్రితం ఆమె కరోనా బారిన పడినట్లు తెలిపారు. రెండేళ్ల నుంచి ప్రజలను పీడిస్తున్న ఈ మహమ్మారి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పట్టిందని ఆనందించేలోపు మరోసారి ఎటాక్ అవ్వడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఉపాసన తాజాగా ఈ విషయాన్నీ అభిమానులతో పంచుకుంది. “గత వారం కోవిడ్ పాజిటివ్గా తేలింది. ముందే వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపించాయి. దీంతో డాక్టర్స్ నన్ను కేవలం పారాసిటమల్, విటమిన్ టాబ్లెట్స్ మాత్రమే వాడమని సూచించారు.
ఈ మహమ్మారి సోకడంతో చాలా మంది నేను నీరసించిపోతానని, జుట్టు రాలిపోవచ్చని, బాడీ పెయిన్స్ వంటి సమస్యలు రావోచ్చని చెప్పారు. అయితే ఇప్పడూ ఆ సమస్యలు ఏమి నాలో కనిపించడంలేదు. ఎందుకంటే నేను మెంటల్గా, ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉన్నాను. అందుకే నాకు ఎలాంటి సమస్యలు తలెత్తలేదు. మళ్లీ వైరస్ విజృంభిస్తుందా? అంటే చెప్పలేను. కానీ, మనం జాగ్రత్తగా ఉండటం తప్పనిసరి. చెన్నైలోని తాతయ్య-అమ్మమ్మలను కలిసేందుకు కోవిడ్ పరీక్షలు చేసుకోవడం వల్ల వైరస్ బయటపడింది. లేదంటే అసలు తెలిసేదే కాదు.. అందుకోసం ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలని” ఉపాసన సూచించారు. ఇక ఈ విషయం తెలుసుకున్న మెగా ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు.