Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కుడిచేతి మణికట్టుకు ఇటీవల విజయవంతంగా శస్త్రచికిత్స జరిగిన సంగతి తెలిసిందే. కోయంబత్తూరులోని ప్రముఖ గంగా హాస్పిటల్లో నిర్వహించిన ఈ సర్జరీ అనంతరం ఆయన కోలుకుంటున్నారని వైద్యులు వెల్లడించారు. ఆపరేషన్ పూర్తయిన తర్వాత మొదటిసారి ఈ రోజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోయంబత్తూరులోని అయ్యప్ప స్వామి ఆలయంలో పూజలు చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కోయంబత్తూరులోని అయ్యప్ప స్వామి ఆలయంలో రామ్ చరణ్ – ఉపాసన దంపతులు పూజలు నిర్వహించారు. అనంతరం రామ్ చరణ్ దంపతులకు ఆలయ అధికారులు స్వామి వారి ప్రసాదాలు అందజేశారు.
ఇటీవల గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కుడిచేతి మణికట్టు (Right Wrist) తీవ్ర సమస్యకు గురికావడంతో కోయంబత్తూరులోని ప్రముఖ గంగా హాస్పిటల్లో ఆయనకు శస్త్రచికిత్స జరిగింది. ఈ శస్త్రచికిత్సను అత్యంత పకడ్బందీగా నిర్వహించేందుకు ఆర్థోపెడిక్ రంగంలో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన లెజెండరీ డాక్టర్ ఎస్.రాజశేఖరన్ నాయకత్వం వహించారు. గతంలో మెగాస్టార్ చిరంజీవికి ఎదురైన అత్యంత క్లిష్టమైన వెన్నెముక సమస్యను కూడా ఈయనే విజయవంతంగా నయం చేశారు. రామ్ చరణ్ మణికట్టు సమస్యకు అత్యుత్తమ చికిత్స అందించాలనే ఉద్దేశంతో అమెరికాలోని మయామికి చెందిన ప్రముఖ హ్యాండ్ అండ్ రిస్ట్ సర్జన్ డాక్టర్ అలెహాండ్రో బాడియాను ప్రత్యేకంగా కోయంబత్తూరుకు రప్పించారు. విజయవంతం సర్జరీ పూర్తి అయిన తర్వాత ఈ రోజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దంపతులు కోయంబత్తూరులోని అయ్యప్ప స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు.

