Ram Charan: ఇండియా నుంచి స్వామిమాలలో వెళ్లి.. అక్కడ ఈ డ్రెస్ ఏంటీ.. ఎలా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇండియా గర్వించదగ్గ విధంగా ఎదుగుతున్నాడు. మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన చరణ్.. ఇప్పుడు చరణ్ తండ్రి చిరంజీవి అని అనిపించుకుంటున్నాడు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ఇక హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డుకు హాజరు అయిన మొట్ట మొదటి భారతీయుడు రామ్ చరణ్. దానికన్నా ముందు జరగబోయే ఇంటర్వ్యూ కోసం చరణ్ నిన్ననే అమెరికాలో ఎంట్రీ ఇచ్చాడు. ఇక తాజాగా న్యూయార్క్ లో జరుగుతున్న ఇంటర్వ్యూకి అల్ట్రా స్టైలిష్ లుక్ లో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచాడు. చరణ్ ను ఒక్కసారిగా చూస్తే హాలీవుడ్ స్టార్ అనుకోకుండా మానరు. ఇక ఇదంతా పక్కన పెడితే ప్రస్తుత అభిమానులకు ఒకే ఒక సందేహం తలెత్తుతోంది.
అదేంటంటే.. గత కొన్నిరోజులుగా చరణ్ స్వామి మాలలో ఉన్నారు. ఎక్కడికి వెళ్లిన పాదరక్షలు విడిచి.. నల్ల దుస్తుల్లోనే కనిపించారు. నిన్న కూడా అమెరికాకు మాలలోనే వెళ్లారు.. మరీ ఈరోజు ఎలా వేరే డ్రెస్ లో కనిపించాడు అందరు తలలు కొట్టుకుంటున్నారు. మెడలో మాల ఉంటే సరిపోతుంది ఎలాంటి డ్రెస్ వేసుకున్నా సరిపోతుందని కొందరు చెప్పుకొస్తున్నారు. అయితే అసలు నిజం ఏంటంటే.. చరణ్ మాల తీసేశాడట. మాల వేసుకొని 21 రోజులు పూర్తి కావడంతో న్యూయార్క్ ఆలయంలో మాల తీసినట్లు చరణ్ పీఆర్ టీం తెలిపింది. స్వామి మాల తీసివేశాకనే చరణ్ ఈ లుక్ లో కనిపించాడు అన్నమాట. ఇక ఈ విషయం తెలియడంతో అభిమానులు చరణ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎలాంటి వివాదాలకు రాకుండా చరణ్ మంచి పని చేసినట్లు చెప్పుకొస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం చరణ్ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
Also Read
- Fauzi Shooting Update: 'ఫౌజీ' కోసం డార్లింగ్ స్పీడ్ చూసి ఫ్యాన్స్ ఫిదా! ఒకేసారి రెండు యూనిట్స్..
- Spirit: స్పిరిట్ షూటింగ్'కి నెల రోజుల బ్రేక్
- Irumudi : అయ్యప్ప ‘బంగారు పల్లకి’ సాంగ్ రెడీ అవుతోంది..!
- Korean Kanakaraju First Review: ‘కొరియన్ కనకరాజు’ ఫస్ట్ రివ్యూ.. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఇవే.. అసలు మేటర్ ఏంటంటే?
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!