Rajkummar Rao: తల్లిదండ్రులైన.. బాలీవుడ్ క్యూటెస్ట్ కపుల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్లో అత్యంత క్యూటెస్ట్ మరియు లవ్లీ కపుల్గా పేరుపొందిన రాజ్కుమార్ రావు – పత్రలేఖ దంపతులు ఎట్టకేలకు తల్లిదండ్రులయ్యారు. వారి నాలుగో వివాహ వార్షికోత్సవం రోజే పండంటి ఆడబిడ్డ జన్మించింది. ఈ హ్యాపీ న్యూస్ను ఇద్దరూ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ.. “దేవుడు మాకు ఒక చిన్న దేవదూతను ఇచ్చాడు. మా హృదయాలు ఆనందంతో నిండిపోయాయి” అని భావోద్వేగంగా పేర్కొన్నారు. వివాహ వార్షికోత్సవానికే ఇదొక ప్రత్యేక గిఫ్ట్గా మారిందని వారు క్యాప్షన్లో తెలిపారు. వారి పోస్ట్కు సెలబ్రిటీలు, ఫ్యాన్స్ నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read : Chandini Chowdary: ఆ సీన్స్ చేయమంటూ నన్ను బలవంతం చేశారు..
Also Read
- Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
- Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
- Krrish 4 : 'క్రిష్ 4' ఆలస్యానికి కారణం అదే?
- LGBT - A Legal Battle: 'ఎల్జీబీటీ'ల ఆక్రందనలపై సినిమా.. జూన్ 19న విడుదల!
రాజ్కుమార్–పత్రలేఖ జంట అనేక సంవత్సరాల ప్రేమ అనంతరం, 2021 నవంబర్ 15న చండీగఢ్లో సింపుల్ & ఎలిగెంట్ వెడ్డింగ్ చేసుకున్నారు. ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత వారి కుటుంబంలోకి చిన్నారి రావడంతో అభిమానులు “డబుల్ హ్యాపీ మోమెంట్”గా సెలబ్రేట్ చేస్తున్నారు. ఇకపోతే, ఒక ఇంటర్వ్యూలో పత్రలేఖ మాట్లాడుతూ.. బిడ్డ పుట్టిన తర్వాత సౌత్ న్యూజిలాండ్ ట్రిప్ ప్లాన్ చేసినట్టు, అది చాలాకాలంగా వారి బకెట్లిస్ట్లో ఉందని చెప్పింది. అక్కడ బంగీ జంపింగ్ చేయడం, బేబీతో కలిసి ఎంజాయ్ చేసే యాడ్వెంచర్ యాక్టివిటీల్లో పాల్గొనడం తమ డ్రీమ్ అని కూడా వెల్లడించింది. ఇక సినిమాల విషయానికి వస్తే .. రాజ్కుమార్ రావు వరుస సినిమాలతో బిజీగా ఉండగా, పత్రలేఖ కూడా హీరోయిన్గా మరియు ముఖ్య పాత్రలతో సినిమాల్లో కొనసాగుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
తాజావార్తలు
-
Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
-
Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
-
Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
-
PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!