Bheemla Nayak: అలా చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ మూవీ శుక్రవారం వరల్డ్ వైడ్ రిలీజ్ కు రంగం సిద్ధమైంది. తెలంగాణలో ఈ మూవీ టిక్కెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటును ప్రభుత్వం ఇవ్వడంతో పాటు ఐదు షోస్ వేసుకోవడానికి అనుమతి కూడా ఇచ్చింది. కానీ ఏపీలో మాత్రం పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. అక్కడ అదనపు ఆటలు వేయడాన్ని, టిక్కెట్ రేట్లను పెంచి అమ్మడాన్ని ఎంత మాత్రం సహించమని రెవిన్యూ అధికారులు చెబుతున్నారు. ఈ విషయమై తెలుగు నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్, ప్రముఖ నిర్మాత నట్టికుమార్ తో పాటు ఇతర కార్యవర్గ సభ్యులు గురువారం మీడియాతో మాట్లాడారు.
Read Also : Bigg Boss Ultimate : హోస్ట్ గా స్టార్ హీరో
Also Read
- Lenin: అఖిల్ కోసం తిరుపతి వస్తున్న యంగ్ టైగర్.. ‘లెనిన్’ ఈవెంట్కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్?
- Jeethu Joseph: ‘దృశ్యం-3’ తెలుగులో ఎందుకు రీమేక్ కాలేదు? అసలు రీజన్ చెప్పేసిన డైరెక్టర్ జీతూ జోసెఫ్!
- Alpha Teaser : ఆలియా భట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ఆల్ఫా' టీజర్ రిలీజ్... గూస్బంప్స్ గ్యారెంటీ!
- God of Masses Birthday Special : నటసింహం 'బంగారు బాలయ్య'.. బర్త్ డే స్పెషల్
‘కొంతమంది ప్రభుత్వ అధికారులు జీవో 35 ప్రకారమే టిక్కెట్లు విక్రయించాలని చెబుతున్నారని, నిజానికి అది కోర్టు ధిక్కారం కిందకు వస్తుంద’ని ప్రసన్న కుమార్ అన్నారు. ‘జీవో నంబర్ 35ను కోర్టు పక్కన పెట్టి, థియేటర్ల యాజమాన్యం సబ్ కలెక్టర్ల నుండి అనుమతి పొంది టిక్కెట్ రేట్లను పెంచి అమ్ముకోమని చెప్పిందని, ఆ రకంగా కొన్ని చిత్రాల ప్రదర్శన జరుగుతోందని, ఇప్పుడు కోర్టు పక్కన పెట్టిన ఆ పాత జీవోను అమలు చేయాలని అధికారులు చెప్పడం తీవ్ర పరిణామాలకు దారి తీసే ఆస్కారం ఉంద’ని ప్రసన్న కుమార్ చెప్పారు. ఒకవేళ ప్రభుత్వం టిక్కెట్ రేట్లను పెంచుకోవడానికి అనుమతి ఇవ్వని పక్షంలో, గతంలో రాజశేఖర్ రెడ్డి హయాంలో విడుదల చేసి జీవో 100ను అమలు చేయాలని, పెద్ద సినిమాలకు 75శాతం టిక్కెట్ రేట్లు పెంచి అమ్ముకోమని రాజశేఖర్ రెడ్డి కూడా చెప్పారని, ఆయన మాటకు విలువ ఇచ్చి జగన్ ప్రభుత్వం దాన్ని అమలు చేయాలని ఆయన కోరారు. సినిమా రంగంలోని కొందరు రాజకీయాలలో ఉండొచ్చని, అంతమాత్రాన సినిమాలను, రాజకీయాలను కలిపి చూడవద్దని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని ప్రసన్న అభ్యర్థించారు.
ఇదే విషయమై నిర్మాత నట్టికుమార్ మాట్లాడుతూ ”ప్రభుత్వం టిక్కెట్ రేట్ల క్రమబద్ధీకరణ నిమిత్తం ఓ కమిటీని వేసింది. దాని రిపోర్ట్ త్వరలోనే రానుంది. అయితే ఈ లోపుగా విడుదలయ్యే సినిమాలకు జీవో 35ను వర్తింపచేయాలని అధికారులు ఒత్తిడి చేయడం సబబు కాదు. సబ్ కలెక్టర్ల అనుమతితో టిక్కెట్ రేట్లను పెంచుకుని సినిమాలను ప్రదర్శించే హక్కు ఎగ్జిబిటర్లకు ఉంది. వారికి సహకరించాలని అధికారులను కోరుతున్నాం. స్థానిక అధికారులు థియేటర్ల యాజమాన్యలను ఇబ్బంది పెడుతున్న విషయం సీఎం జగన్ దృష్టికి వెళ్ళి ఉండదని అనుకుంటున్నాం. దయచేసి ముఖ్యమంత్రి జగన్ ఈ విషయంలో కల్పించుకుని, ఎగ్జిబిటర్స్ కు న్యాయం జరిగేలా చూడాలి” అని అన్నారు.
తాజావార్తలు
-
Heavy Rain and Thunderstorms: రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం..!
-
Lenin: అఖిల్ కోసం తిరుపతి వస్తున్న యంగ్ టైగర్.. ‘లెనిన్’ ఈవెంట్కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్?
-
Parama Ekadashi: జూన్ 11న పరమ ఏకాదశి.. విష్ణుమూర్తి కటాక్షం పొందాలంటే ఈ నియమాలు తప్పక పాటించాలి.
-
Jeethu Joseph: ‘దృశ్యం-3’ తెలుగులో ఎందుకు రీమేక్ కాలేదు? అసలు రీజన్ చెప్పేసిన డైరెక్టర్ జీతూ జోసెఫ్!
-
Janvi Kapoor: ‘పెద్ది’ దెబ్బకైనా జాన్వీ తీరు మారుతుందా?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!