పవన్ కళ్యాణ్ తన పాతికేళ్ళ కెరీర్ లో ఇప్పటి దాకా నటించిన చిత్రాలు పట్టుమని పాతికే! అందులో పవన్ కు, ఆయన ఫ్యాన్స్ కు ఆనందం పంచిన చిత్రాలు రీమేక్స్ కావడం గమనార్హం! ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’గా వస్తున్నాడు. ఈ సినిమా మళయాళంలో విజయవంతమైన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’కు రీమేక్! దాంతో పవన్ ఫ్యాన్స్ లో ఆనందం చిందులు వేస్తోంది. Read Also : Bheemla Nayak : ఫ్యాన్స్ విరాళాలు! పవన్ 1996లో…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘భీమ్లా నాయక్’ ఫిబ్రవరి 25న జనం ముందుకు వస్తోందని తెలిసినప్పటి నుంచీ అభిమానుల్లో సంబరం మొదలయింది. ఈ సినిమా రిలీజ్ నాటికి ఏపీ గవర్నమెంట్ ప్రదర్శన ఆటలు, టిక్కెట్ రేట్ల విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటుందని భావించారు. కానీ, ఎప్పటిలాగే పరిమిత ప్రదర్శనలు, మునుపటి రేట్లతోనే సాగాలని ప్రభుత్వం ఆదేశించడంతో అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు. పవన్ నటించిన ‘భీమ్లా నాయక్’ పలు రికార్డులు బద్దలు చేస్తుందని, నిర్మాతలకు, కొనుగోలుదారులకు…
పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ మూవీ శుక్రవారం వరల్డ్ వైడ్ రిలీజ్ కు రంగం సిద్ధమైంది. తెలంగాణలో ఈ మూవీ టిక్కెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటును ప్రభుత్వం ఇవ్వడంతో పాటు ఐదు షోస్ వేసుకోవడానికి అనుమతి కూడా ఇచ్చింది. కానీ ఏపీలో మాత్రం పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. అక్కడ అదనపు ఆటలు వేయడాన్ని, టిక్కెట్ రేట్లను పెంచి అమ్మడాన్ని ఎంత మాత్రం సహించమని రెవిన్యూ అధికారులు చెబుతున్నారు. ఈ విషయమై తెలుగు…
సూపర్ హిట్ మలయాళ చిత్రం అయ్యప్పనుమ్ కోషియుమ్ అధికారిక రీమేక్ “భీమ్లా నాయక్”. ‘భీమ్లా నాయక్’లో నిత్యా మీనన్, సంయుక్తా మీనన్, బ్రహ్మాజీ, రఘుబాబు, మురళీ శర్మ కీలకపాత్రలు పోషించారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ రాశారు. సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలుపోషిస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ని బుధవారం హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి…
పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన “భీమ్లా నాయక్” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈరోజు టీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ ట్విటర్లోకి వెళ్లి “భీమ్లా నాయక్” టీమ్ గురించి ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. “నా సోదరులు పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి, తమన్, దర్శకుడు సాగర్…
పంజాబీ బ్యూటీ పూనమ్ కౌర్ తాజాగా ఆర్జీవీని టార్గెట్ చేసింది. పైగా మరో డైరెక్టర్ నూ ఇన్వాల్వ్ చేస్తూ ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. “పాలిటిక్స్ ఎంటర్టైన్మెంట్ గా మారితే ఎంటర్టైన్మెంట్ పాలిటిక్స్ గా మారాయి” అంటూ మొదలెట్టిన పూనమ్ ఆర్జీవీ చేసిన ట్వీట్ ను ట్యాగ్ చేస్తూ సమాధానం ఇచ్చింది. ఆర్జీవీ నిన్న రాత్రి జరిగిన “భీమ్లా నాయక్” ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన వీడియోను…
సినిమా లేకపోతే ఈరోజు ప్రజల్లో తన ఉనికి ఉండేది కాదని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ.. నిజమైన కళాకారుడికి కులం, మతం, ప్రాంతం అనేది పట్టదని అన్నారు. ఎక్కడో చెన్నైలో ఉండే చిత్రపరిశ్రమను హైదరాబాద్కు తీసుకురావడంతో ఎందరో సినీ పెద్దలతో పాటు చెన్నారెడ్డి లాంటి మహనీయులు తోడ్పాటు అందించారని.. అలాంటి సినిమా ఇండస్ట్రీకి కేసీఆర్ లాంటి వాళ్లు సహకారం అందించడం ఎంతో సంతోషంగా ఉందని పవన్…
పవర్స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అభిమానులకు పండగ వాతావరణం తెచ్చింది. ఈ ఫంక్షన్ సందర్భంగా రానా ఉద్వేగంగా మాట్లాడారు. మీ సార్ పెద్ద గబ్బర్ సింగ్ అంట కదా.. నేనెవరో తెలుసా అన్నారు. ఈ సినిమాతో ఎంతోమంది మేధావుల్ని కలిశాను. చిన్నప్పుడు హీరో కావాలని అనుకున్నాను. హీరో ఎలా అవ్వాలో తెలీదు. ఇండియాలో పెద్ద సూపర్ స్టార్స్ తో చేశాను. పవన్ డిఫరెంట్. ఇప్పటివరకూ చేసిన సినిమాలు ఒకలా…
పవర్స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథులుగా మంత్రులు కేటీఆర్, తలసాని హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. నాలుగేళ్ల క్రితం యూసఫ్గూడ పోలీస్ గ్రౌండ్స్లో చిరంజీవి, రామ్చరణ్ పిలిచిన ఓ సినిమా ఫంక్షన్కు హాజరయ్యానని.. అప్పుడు మెగాస్టార్, ఆయన సోదరుడు పవర్స్టార్ అని మాట్లాడుతుంటే.. తనను అభిమానులు అరుపులతో మాట్లాడనివ్వలేదని.. ఇప్పుడు కూడా తనని మాట్లాడనివ్వడం లేదని కేటీఆర్ నవ్వుతూ అన్నారు. 26 ఏళ్లుగా ఒకే విధమైన స్టార్డమ్ను…
పవర్స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో ఘనంగా జరుగుతోంది. ఈ వేడుకలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్, డ్రమ్స్ స్పెషలిస్ట్ శివమణి భీమ్లా నాయక్ మూవీలో పాటలకు పర్ఫార్మ్ చేస్తూ డ్రమ్స్ వాయించారు. వీరిద్దరూ కలిసి డ్రమ్స్ వాయిస్తూ ఉండగా శివమణి వెళ్లి హీరో పవన్ కళ్యాణ్ను, మంత్రి కేటీఆర్ను స్టేజీ మీదకు తీసుకొచ్చి వారితో డ్రమ్స్ వాయించేలా చేశారు. పవన్ కళ్యాణ్, కేటీఆర్ ఇద్దరూ కూడా డప్పు వాయించారు. దీంతో…