Prakash Raj : బాలీవుడ్ స్టార్లు అమ్ముడుపోయారు.. ప్రకాశ్ రాజ్ సంచలనం..
- అందుకే వారంతా సైలెంట్
- ప్రభుత్వాన్ని ప్రశ్నించరు
- ప్రకాశ్ రాజ్ వివాదాస్పద కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prakash Raj : బాలీవుడ్ మీద నటుడు ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ లోని సగం మంది అమ్ముడు పోయారంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ప్రకాశ్ రాజ్ తరచూ రాజకీయాలపై స్పందిస్తూనే ఉంటారు. ప్రతి ఘటనపై తన వాయిస్ ను సోషల్ మీడియా వేదికగా వినిపిస్తూ ఉంటారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. రాజకీయాలపై మాట్లాడారు. ‘చాలా మంది సినీ సెలబ్రిటీలు రాజకీయాలపై మాట్లాడరు. ముఖ్యంగా హిందీ పరిశ్రమలోని హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు, నటులు రాజకీయాలపై సైలెంట్ గా ఉంటారు. ఎందుకంటే బాలీవుడ్ లోని సగం మంది ఈ ప్రభుత్వానికి అమ్ముడు పోయారు. అందుకే సైలెంట్ గా ఉంటారు.
Read Also : Suhas : ఊరమాస్ లుక్ లో సుహాస్.. పోస్టర్ తోనే హైప్..
అందుకే దేశంలో జరుగుతున్న అనేక అవినీతి ఘటనలపై వాళ్లు వాయిస్ రైజ్ చేయరు. ప్రభుత్వం ఏదైనా సరే వ్యతిరేక చర్చలను అణచివేయాలనే చూస్తుంది. హిందీ పరిశ్రమలో చాలా మందికి మాట్లాడే ధైర్యం లేదు. నా మిత్రుడు ఒకరు నాకు ఇదే విషయాన్ని చెప్పారు. ప్రకాశ్ రాజ్ నీకు ధైర్యం ఉంది కాబట్టే నువ్వు మాట్లాడుతావు. కానీ మా పరిస్థితి అలా కాదు అన్నాడు. అలాంటి వారిని నేను అర్థం చేసుకోగలను. కానీ అందరూ సైలెంట్ అవడం క్షమించరానిది. చరిత్ర తప్పు చేసిన వారినైనా క్షమిస్తుందేమో గానీ.. తప్పును ప్రశ్నించని వారిని కాదు’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వెల్లడవుతున్నాయి.
Read Also : NANI : హిట్ 3.. డిస్ట్రిబ్యూటర్స్ కి డేంజర్ బెల్స్..
Also Read
తాజావార్తలు
-
Petrol-Diesel Prices: వాహనదారులకు తగలనున్న షాక్.. పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!
-
YS Jagan: హలో ఇండియా అంటూ వైఎస్ జగన్ ఆసక్తికర ట్వీట్..
-
Crispy Ragi Murukku: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. టీతో ఈ రాగి మురుకులు తింటే ఆ మజానే వేరు!
-
CM Chandrababu: శాంతిభద్రతలపై సీఎం కీలక సమీక్ష.. సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు
-
Ragi Halwa: రాగి పిండితో నోరూరించే స్వీట్ హల్వా.. వంట రాని వారు కూడా ఈజీగా చేసేయొచ్చు!