Narsimha Nandi: “ప్రభుత్వ సారాయి దుకాణం” పేరుతో సినిమా మొదలెట్టిన నేషనల్ అవార్డ్ డైరెక్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prabhutva Sarai Dukanam Movie of Narsimha Nandi started today: 1940లో ఒక గ్రామం పేరుతో సినిమా తెరకెక్కించి బెస్ట్ నేషనల్ అవార్డు అందుకుని ఆ తర్వాత కమలతో నా ప్రయాణం, లజ్జా లాంటి ఆలోచింప చేసే సినిమాలకు దర్శకత్వం వహించిన నరసింహ నంది తాజాగా శ్రీలక్ష్మి నరసింహ బ్యానర్ మీద మరో సినిమా మొదలు పెట్టారు. ప్రభుత్వ సారాయి దుకాణం సినిమా అనే పేరుతో తెరకెక్కిస్తున్న సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. షేక్ స్పియర్ కథలోని పాత్రల ఆధారంగా తీసుకొని తెలంగాణలో ఒక మారుమూల ప్రాంతంలో జరిగే పొలిటికల్ ఫ్యామిలీ ఇతివృత్తంగా పగ ద్వేషం, ఈర్ష, అసూయ, ప్రేమ మనిషిలోని వివిధ కోణాలను చూపిస్తూ ప్రభుత్వ సారాయి దుకాణం సినిమా కథను తయారు చెయ్యడం జరిగిందని నరసింహ నంది పేర్కొన్నారు.
Charan Raj: పాము లాంటి క్యారెక్టర్ చేశా.. ఇలాంటివయితే ఫ్రీగా నటిస్తా : చరణ్ రాజ్
Also Read
1980 నాటి పరిస్థితులు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మలచడం జరిగిందని, పాత కొత్త నటీనటుల కలయికతో నిర్మితమవుతున్న ఈ సినిమాలో అదితి మైకల్, వినయ్, మల్లిక్, నరేష్ గౌడ్, మహంతి, వీరభద్రం, బాలు నాయక్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పరిగి స్రవంతి మల్లిక్, నరేష్ గౌడ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి వి నాగిరెడ్డి ఎడిటర్ గా వ్యవహరిస్తుండగా సుక్కు సంగీతం అందిస్తున్నారు. మహి రెడ్డి పండుగల కెమెరామెన్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి నరసింహ నంది దర్శకత్వం వహిస్తూనే కథ కూడా అందించడం గమనార్హం. అయితే ప్రస్తుతం బిగ్ బాస్ లో ఉన్న శివాజీ హీరోగా ఒక సినిమాను నరసింహ నంది కొన్నేళ్ల క్రితమే అనౌన్స్ చేశారు. అయితే ఎందుకో కానీ ఆ సినిమా తెరకెక్క లేదు.
తాజావార్తలు
-
Dragon : 4 నిమిషాల రన్ టైంతో ఎన్టీఆర్ ‘డ్రాగన్’ గ్లింప్స్.. ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్ ఇదే!
-
Telangana Cabinet : ఈనెల 21న తెలంగాణ కేబినెట్ సమావేశం
-
Siddipet: బీరు తాగబోతే షాక్.. బాటిల్లో కండోమ్ ప్యాకెట్ ప్రత్యక్షం..
-
Peddi: షేక్ చేస్తున్న పెద్ది ట్రైలర్
-
Mutual Funds: మ్యుచువల్ ఫండ్స్లో రూ.5 లక్షల పెట్టుబడి.. 10 ఏళ్ల తర్వాత చేతికి ఎంత వస్తుందో తెలుసా..?
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!