Posani Krishna Murali: టికెట్ రేట్స్.. చిరంజీవి ముందే చెప్పా.. కాదని చెప్తే చెప్పుతో కొట్టుకుంటా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Posani Krishna Murali: మెగాస్టార్ చిరంజీవి, తమన్నా నటించిన చిత్రం భోళా శంకర్. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ఏకే ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుపోవడమే కాకుండా భారీ అంచనాలను రేకెత్తించాయి. రేపు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ప్రతిసారి పవన్ కళ్యాణ్ సినిమా కానీ, చిరంజీవి సినిమా కానీ రిలీజ్ అవుతుందంటే.. ఏపీలో టికెట్ రేట్స్ పెంచాలని ప్రభుత్వాన్ని అడగడం.. అదిపెద్ద చర్చనీయాంశం కావడం జరిగేదే. ఇక భోళా శంకర్ కు సైతం మేకర్స్ టికెట్ రేట్స్ పెంచమని అడగడం.. ఏపీ ప్రభుత్వం కాదు అని చెప్పడం జరిగాయి. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. తాజాగా టికెట్ రేట్ గురించి, చిరు, పవన్ రెమ్యూనిరేషన్స్ గురించి నటుడు పోసాని కృష్ణ మురళి సంచలన వ్యాఖ్యలు చేశాడు. గతంలో సీఎం జగన్ తో ఇండస్ట్రీ పెద్దలు ఏం మాట్లాడారో తెలుపుతూ రెమ్యూనిరేషన్స్ తగ్గించుకోమని హీరోలకు తెలిపినట్లు చెప్పుకొచ్చాడు.
Jailer Disaster: జైలర్ డిజాస్టర్.. విజయ్ ఫ్యాన్స్ అరాచకం
Also Read
- Pawan Kalyan :మీరు అడిగారు, మేము విన్నాం.. ఓజీ యూనివర్స్లోకి స్వాగతం
- Pradeep Ranganathan: ఆ డైరెక్టర్'తో ప్రదీప్ రంగనాథన్ స్ట్రెయిట్ తెలుగు సినిమా!
- Rao Bahadur: "మీ కాలర్ పట్టుకుని లాగుతుంది.. బాడీలోకి పూనకాలు తెప్పిస్తుంది!" రావు బహదూర్’ మహేష్ బాబు రివ్యూ!
- Bunny Vas : తెలుగుమ్మాయని అవకాశం ఇస్తే.. మాకు 15 రూల్స్ పెట్టింది.
” గతంలో యుద్ధం జరిగినప్పుడు సినిమా ఇండస్ట్రీలో కూడా టికెట్ రేట్ పెంచండి.. కొంచెం హెల్ప్ అవుతుంది అని అప్పట్లో పెద్దలు చెప్పడం వలన టికెట్ రేట్స్ పెంచారు అని విన్నాను. మళ్లీ రేట్లు పెంచండి అని అడగడం ఇప్పుడే వింటున్నాను. అప్పుడంటే.. రీజన్ ఉంది.. యుద్ధం, ఆర్థిక వ్యవస్థ.. ఉండడం వలన పెంచారు. కానీ, ఇప్పుడు ఏం ఆర్థిక వ్యవస్థ దెబ్బ తిన్నది అని వీళ్లు టికెట్ రేట్స్ పెంచమని అడుగుతున్నారు అని అందరి ముందు జగన్ అన్నను అడిగాను. అందరు ఉన్నారు. పేర్ని నాని, చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, ఆలీ అందరు ఉన్నారు. ఇవన్నీ అన్నారో లేదో వారిని అడగండి.. నేను అనకపోతే ఇక్కడే అబద్దం చెప్పాను అని చెప్పుతో కొట్టుకుంటాను. అందరి ముందు నేనే చెప్పాను .. వీళ్లు.. 40 కోట్లు, 60 కోట్లు రెమ్యునిరేషన్ తీసుకుంటున్నారు. దేనికి పెంచాలి ఇంకా.. ఏ .. 10 కోట్లు, 20 కోట్లు తగ్గించుకొని సినిమా చేసుకోవచ్చుగా.. చిరంజీవి నా ఎదురుగా ఉన్నారు.. ఎందుకు పెంచాలి సర్.. వీళ్ళందరూ వెల్ సెటిల్డ్ .. ఎవరు సెటిల్ అవ్వలేదు.. చిన్న చిన్న జూనియర్ ఆర్టిస్టులు, లైట్ బాయ్స్, పనిచేసేవారు, చిన్న నిర్మాతలు నాశనం అయిపోయారు. నేను చెప్పింది అంతా అబద్దం అయితే.. వాళ్లనే నిజం చెప్పమనండి.. పేర్ని నాని.. నన్ను ఆపాడు. జగన్ అన్నకు సమస్య ఏంటో తెలియాలి అని ఇదంతా చెప్పాను” అని అడిగినట్లు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం పోసాని వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
తాజావార్తలు
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
-
Giorgia Meloni: మెలోని ఢిల్లీలో పోటీ చేస్తే లక్షల ఓట్లు గ్యారెంటీ..
-
Story Board: కులం ప్లస్ రాజకీయం.. ఏపీలో ఎప్పుడూ ఇదే కాంబినేషన్..!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!