Posani Krishna Murali: టికెట్ రేట్స్.. చిరంజీవి ముందే చెప్పా.. కాదని చెప్తే చెప్పుతో కొట్టుకుంటా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Posani Krishna Murali: మెగాస్టార్ చిరంజీవి, తమన్నా నటించిన చిత్రం భోళా శంకర్. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ఏకే ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుపోవడమే కాకుండా భారీ అంచనాలను రేకెత్తించాయి. రేపు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ప్రతిసారి పవన్ కళ్యాణ్ సినిమా కానీ, చిరంజీవి సినిమా కానీ రిలీజ్ అవుతుందంటే.. ఏపీలో టికెట్ రేట్స్ పెంచాలని ప్రభుత్వాన్ని అడగడం.. అదిపెద్ద చర్చనీయాంశం కావడం జరిగేదే. ఇక భోళా శంకర్ కు సైతం మేకర్స్ టికెట్ రేట్స్ పెంచమని అడగడం.. ఏపీ ప్రభుత్వం కాదు అని చెప్పడం జరిగాయి. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. తాజాగా టికెట్ రేట్ గురించి, చిరు, పవన్ రెమ్యూనిరేషన్స్ గురించి నటుడు పోసాని కృష్ణ మురళి సంచలన వ్యాఖ్యలు చేశాడు. గతంలో సీఎం జగన్ తో ఇండస్ట్రీ పెద్దలు ఏం మాట్లాడారో తెలుపుతూ రెమ్యూనిరేషన్స్ తగ్గించుకోమని హీరోలకు తెలిపినట్లు చెప్పుకొచ్చాడు.
Jailer Disaster: జైలర్ డిజాస్టర్.. విజయ్ ఫ్యాన్స్ అరాచకం
Also Read
- Varanasi: రూమరా? నిజమా? రాజమౌళి - మహేష్ బాబు సినిమాతో ఎన్టీఆర్ కొడుకు ఎంట్రీ!
- Srinivasa Mangapuram Trailer: మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి కొత్త హీరో.. ట్రైలర్తోనే అంచనాలు పెంచేసిన జై కృష్ణ!
- Johnny Master - Sekhar Master: టాలీవుడ్లో కలకలం.. జానీ మాస్టర్ - శేఖర్ మాస్టర్ వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం! వీడియో వైరల్
- Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సే డ్రీమ్ రోల్ ఇదేనట.. రాజమౌళి పేరు చెప్పి షాకిచ్చిన హీరోయిన్!
” గతంలో యుద్ధం జరిగినప్పుడు సినిమా ఇండస్ట్రీలో కూడా టికెట్ రేట్ పెంచండి.. కొంచెం హెల్ప్ అవుతుంది అని అప్పట్లో పెద్దలు చెప్పడం వలన టికెట్ రేట్స్ పెంచారు అని విన్నాను. మళ్లీ రేట్లు పెంచండి అని అడగడం ఇప్పుడే వింటున్నాను. అప్పుడంటే.. రీజన్ ఉంది.. యుద్ధం, ఆర్థిక వ్యవస్థ.. ఉండడం వలన పెంచారు. కానీ, ఇప్పుడు ఏం ఆర్థిక వ్యవస్థ దెబ్బ తిన్నది అని వీళ్లు టికెట్ రేట్స్ పెంచమని అడుగుతున్నారు అని అందరి ముందు జగన్ అన్నను అడిగాను. అందరు ఉన్నారు. పేర్ని నాని, చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, ఆలీ అందరు ఉన్నారు. ఇవన్నీ అన్నారో లేదో వారిని అడగండి.. నేను అనకపోతే ఇక్కడే అబద్దం చెప్పాను అని చెప్పుతో కొట్టుకుంటాను. అందరి ముందు నేనే చెప్పాను .. వీళ్లు.. 40 కోట్లు, 60 కోట్లు రెమ్యునిరేషన్ తీసుకుంటున్నారు. దేనికి పెంచాలి ఇంకా.. ఏ .. 10 కోట్లు, 20 కోట్లు తగ్గించుకొని సినిమా చేసుకోవచ్చుగా.. చిరంజీవి నా ఎదురుగా ఉన్నారు.. ఎందుకు పెంచాలి సర్.. వీళ్ళందరూ వెల్ సెటిల్డ్ .. ఎవరు సెటిల్ అవ్వలేదు.. చిన్న చిన్న జూనియర్ ఆర్టిస్టులు, లైట్ బాయ్స్, పనిచేసేవారు, చిన్న నిర్మాతలు నాశనం అయిపోయారు. నేను చెప్పింది అంతా అబద్దం అయితే.. వాళ్లనే నిజం చెప్పమనండి.. పేర్ని నాని.. నన్ను ఆపాడు. జగన్ అన్నకు సమస్య ఏంటో తెలియాలి అని ఇదంతా చెప్పాను” అని అడిగినట్లు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం పోసాని వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
తాజావార్తలు
-
Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
-
National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
-
Varanasi: రూమరా? నిజమా? రాజమౌళి – మహేష్ బాబు సినిమాతో ఎన్టీఆర్ కొడుకు ఎంట్రీ!
-
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
-
Srinivasa Mangapuram Trailer: మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి కొత్త హీరో.. ట్రైలర్తోనే అంచనాలు పెంచేసిన జై కృష్ణ!
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..