Pawan Kalyan: ఒక రోజా వచ్చిందంటే.. దాని కారణం ఈయనే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan:పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రధారులుగా రూపొందించబడిన బ్రో సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. జూలై 28వ తేదీన రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాదులో ఘనంగా నిర్వహించారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథులుగా మెగా హీరోలు వైష్ణవ తేజ్, వరుణ్ తేజ్ హాజరుకాగా సినిమాలో కీలకమైన పాత్రలో నటించిన పవన్ కళ్యాణ్, సాయి ధరంతేజ్ కూడా హాజరయ్యారు. వాస్తవానికి ఈ ప్రీ రిలీజ్ వేడుక సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా హైదరాబాదులో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పోలీసుల సూచనల మేరకు 8:30 నుంచి ప్రారంభమైంది. అయితే ఈ కార్యక్రమానికి కాస్త లేటుగా విచ్చేసిన పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా సుదీర్ఘంగా తన అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. సుమారు అర్థగంటకు పైగా ప్రసంగించిన పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో అనేక విషయాలను స్పృశించారు.
“నేను 80 పర్సెంట్ సినిమాలో ఉంటాను. గెస్ట్ క్యారెక్టర్ ఏం కాదు.. చాలా ఫాస్ట్ గా చేశాను. అమెరికాలో ఉన్న విశ్వప్రసాద్ గారు.. తెలుగు సినిమాపై మక్కువతో ఈ సినిమాను నిర్మించారు. ఇక నా కాస్ట్యూమ్స్ డిజైన్ చేసిన నీతూ లుల్లూ.. నాకు మంచి లుక్ అందించారు. ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్ తో ఈ సినిమా ఉంది అంటే దానికి కారణం ఆమెనే. ఈ సినిమా చాలా బాగా వచ్చింది. నవ్వుతు ఏడుస్తాం. ఇలాంటి సినిమా తెలుగు ప్రేక్షకులకు అందించిన సముద్రఖని గారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. తమిళ చిత్ర పరిశ్రమకు కూడా నాదొక విన్నపం. పరిశ్రమలో మనవాళ్లే చేయాలి అనే ధోరణి నుంచి బయటకు రావాలి. ఈరోజున తెలుగు చిత్ర పరిశ్రమ అందరికి అన్నం పెడుతుంది. అందరిని తీసుకుంటుంది. తమిళ్ చిత్ర పరిశ్రమ కూడా అందరిని తీసుకోండి. తమిళ్ పరిశ్రమ తమిళ్ వారికే అంటే పరిశ్రమ ఎదగదు. ఈరోజున తెలుగు పరిశ్రమ ఎదుగుతున్నాం అంటే.. అన్ని పరిశ్రమలకు సంబంధించిన వారిని తీసుకుంటున్నాం. ఒక్కళ్ళు కాదు.. ఇది అన్ని భాషలు.. అన్ని కలయికలు ఉంటేనే సినిమా అవుతుంది తప్ప .. కేవలం మన భాష, మనమే ఉండాలి అంటే.. కుంచించుకుపోతాం. తమిళ్ భాష వారు తమిళ్ వాళ్లనే తీసుకుంటున్నాం అని బయట చెప్తుంటే వింటున్నాం. మీరు కూడా తమిళ్ పరిశ్రమ నుంచి బయటికి వచ్చి ఆర్ఆర్ఆర్ లాంటి సినిమా తీయాలని, మీ పరిశ్రమను విస్తృతం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఒక రోజా వచ్చిందంటే దానికి కారణం.. ఎఎం రత్నం గారు.. ఒక రోజా, జెంటిల్ మెన్.. ఇలాంటి సినిమాలు బయటకు వచ్చాయి. తమిళ్ సినిమా బయటకు వచ్చింది అంటే అది ఆయన వలనే. కళాకారుడుకు కులం, మతం, ప్రాంతం ఉంటే పరిశ్రమ ఎదిగాడు.. ఏవైనా కార్మిక సమస్యలు ఉంటే పరిష్కరించుకొని అందరు ఒక్కటిగా ఉండాలి. ఆ పరిధులను దాటి ఎదగాలని.. తమిళ్ పరిశ్రమ పెద్దలకు మనవి చేసుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చారు.
Also Read
- Irummudi: ‘బాహుబలి', 'పుష్ప' సినిమాలను వెనక్కి నెట్టిన రవితేజ ‘ఇరుముడి’!
- Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
- Aadarsha Kutumbam Postponed: వెంకీ మామా ‘ఆదర్శ కుటుంబం’ పోస్ట్పోన్.. కొత్త డేట్ ఇదేనా?
- Z5: బాలయ్య, వెంకీ, అఖిల్, చైతూలతో 'జీ5' సంచలనం..కళ్లు చెదిరే బ్లాక్ బస్టర్ లైనప్ ఇదే!
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు!
-
Irummudi: ‘బాహుబలి’, ‘పుష్ప’ సినిమాలను వెనక్కి నెట్టిన రవితేజ ‘ఇరుముడి’!
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!