Parvathy Nair: ఇంట్లో అర్థరాత్రి మగవారితో ఆ పని.. సహించలేనన్న నటి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Parvathy Nair Gives Strong Warning To Media: నటీనటుల జీవితం ఎంత విలాసవంతంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. లక్షలు, కోట్లలో పారితోషికం వస్తుంది కాబట్టి.. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా ట్రిప్పులకు వెళ్లడం, పార్టీలు చేసుకోవడం వంటివి చేస్తుంటారు. కొంచెం టైం దొరికినా సరే, దాన్ని ఎంజాయ్ చేయడానికే వినియోగిస్తుంటారు. పైగా.. ఇండస్ట్రీలో ఉన్న వారు ఆడ, మగ అనే బేధాలు అస్సలు చూడరు. అందరితోనూ సమానంగా మెలుగుతూ.. పార్టీలు చేసుకుంటారు. ఇది ఓపెన్ సీక్రెట్టే! కానీ.. గుచ్చి గుచ్చి ప్రస్తావిస్తే మాత్రం, ఎవ్వరికైనా కోపం వస్తుంది. ఇప్పుడు పార్వతి నాయర్కు కూడా అలాగే కోపం వచ్చింది. మగవారితో రాత్రుల్లో పార్టీలు చేసుకుంటుందని మీడియాలో కథనాలు రావడంతో.. మీడియాపై ఫైర్ అయ్యింది. తన ఇమేజ డ్యామేజ్ చేసే విధంగా వార్తలు రాస్తే, సహించనంటూ వార్నింగ్ ఇచ్చింది.
అసలేం జరిగిందంటే.. చెన్నై నుంగంబాక్కంలో నివసిస్తున్న పార్వతీ నాయర్ ఇంట్లో ఇటీవల రూ.9 లక్షల విలువైన రెండు వాచీలు, లాప్ టాప్, సెల్ ఫోన్ చోరీకి గురయ్యారు. అదే సమయంలో.. ఆమె ఇంట్లో పని చేసే చంద్రబోస్ అనే వ్యక్తి కూడా కనిపించకుండా పోయాడు. దీంతో.. అతనిపై అనుమానంతో పార్వతీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతడే ఆ వస్తువుల్ని దొంగలించి ఉంటాడని ఫిర్యాదులో పేర్కొంది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే చంద్రబోస్ మీడియా ముందుకొచ్చి.. పార్వతీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. పార్వతీ నాయర్ తన ఇంట్లో రాత్రి మగ స్నేహితులతో పార్టీలు చేసుకుంటుందని ఆరోపించాడు. ఈ విషయాన్ని తాను గమనించడంతో.. కించపరిచే విధంగా తన పట్ల ప్రవర్తించిందని పేర్కొన్నాడు. ఈ వార్త పలు ఛానెళ్లలో ప్రసారమైంది. ‘మగ స్నేహితులతో పార్టీ’ అనే అంశాన్ని బాగా హైలైట్ చేశారు.
Also Read
- The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
- Swara Bhasker: ‘‘రామ మందిర తీర్పుతో బాధపడ్డా.. షారుఖ్, సల్మాన్లకు క్షమాపణలు’’.. స్వరా భాస్కర్ మరో వివాదం..
- Udaya Bhanu: 'పీఆర్' పాలిటిక్స్..ఉదయభాను బాధ కరెక్టే, కానీ తప్పదు?
- Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఆ వార్తలు చూసి తీవ్ర ఆగ్రహానికి గురైన పార్వతీ నాయర్.. తన గురించి తప్పుడు ప్రచారం చేస్తే సహించలేనంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. తన ఇమేజ్ డ్యామేజ్ చేసే చర్యలకు మీడియా పాల్పడుతోందని మండిపడింది. నిజానిజాలు తెలుసుకోకుండా, ఇష్టానుసారం వార్తలు ప్రసారం చేస్తే.. వారిపై తగిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించింది. అంతేకాదు.. తనకు కళంకం ఆపాదించే చర్యలకు పాల్పడే కొన్ని మీడియా సంస్థలపై పరువు నష్టం దావా కూడా వేస్తానని పార్వతీ తెలిపింది. దీంతో.. ఈ వ్యవహారం ఇప్పుడు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్గా మారింది.
తాజావార్తలు
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై 18% జీఎస్టీ? వ్యాపారులకు కొత్త ఛార్జీలు! నిపుణులు అంచనా ఇదే
-
The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
-
Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
-
Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
-
Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!