Paruchuri :గురువృద్ధుడు… పరుచూరి అగ్రజుడు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్య ప్రముఖ దర్శకుడు జయంత్ సి.ఫరాన్జీ ఓ సారి ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు దగ్గరకు వెళ్ళి ఆయనతో ఫోటీ తీసుకున్నారు. ఆ ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేశారు. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అనేక చిత్రాల్లో ఎంతో చెలాకీగా కనిపించిన పరుచూరి వెంకటేశ్వరరావు, అంత ముసలివారా అని అందరూ అవాక్కయ్యారు. ఎంతోమంది దర్శకుల తొలి చిత్రాలకు పరుచూరి సోదరులు రచన చేసి అలరించారు. అలాగే జయంత్ మొదటి సినిమా’ ప్రేమించుకుందాం…రా’ కు కూడా వాళ్ళే రచయితలు. అందువల్ల గురుభక్తితో జయంత్ ఈ మధ్య పరుచూరి అగ్రజుని కలసినప్పుడు ఫోటో తీసుకొని షేర్ చేశారు. వెంకటేశ్వరరావు వయసు మీద పడినా, ఇప్పటికీ రచన చేయడానికి ఉత్సాహంగానే ఉన్నారాయన.
పరుచూరి వెంకటేశ్వరరావు 1943 జూన్ 21న జన్మించారు. చదువుకొనే రోజుల నుంచీ నాటకాలు రాయడం, వాటిని ప్రదర్శించడం చేసేవారు. హైదరాబాద్ ఏజీ ఆఫీసులో పనిచేసే రోజుల్లోనూ అదే వరస. పక్కనే ఉన్న రవీంద్ర భారతిలో ఆయన రాసిన పలు నాటకాలు ప్రదర్శితమయ్యాయి. తరువాత చిత్రసీమలో అడుగు పెట్టారు వెంకటేశ్వరరావు. ఆరంభంలో దేవదాస్ కనకాల, వేజెళ్ళ సత్యనారాయణ వంటి దర్శకుల చిత్రాలకు పసందైన పదాలు పలికించి, ఆకట్టుకున్నారు. ఈ అన్నకు తగ్గ తమ్ముడుగా పరుచూరి గోపాలకృష్ణ సైతం తన వేసవి సెలవుల్లో అన్నకు సాయంగా పలుకులు పలికించే వారు. అలా మొదలైన ఈ సోదరుల ప్రయాణం, యన్టీఆర్ వారికి ‘పరుచూరి బ్రదర్స్’ అని నామకరణం చేసి తమ ‘అనురాగదేవత’ ద్వారా వెలుగులోకి తీసుకు వచ్చారు. అక్కడ నుంచీ మరి వెనుదిరిగి చూసుకోలేదు ఈ సోదరులు.
Also Read
తెలుగు చిత్రసీమలో ఈ రోజున తొడలు చరిచి, మీసాలు మెలేసి, వీరావేశాలు ప్రదర్శించే సన్నివేశాలు కోకొల్లలుగా కనిపిస్తూ ఉంటాయి. అలాంటి సీన్స్ కు ఓ క్రేజ్ తీసుకు వచ్చిన ఘనత నిస్సందేహంగా పరుచూరి సోదరులదే! ఇక పురాణగాథలను, సాంఘికాలకు అనువుగా మలచడంలోనూ సిద్ధహస్తులు ఈ సోదరులు. వీరిలో అగ్రజుడు పరుచూరి వెంకటేశ్వరరావు, అనుజుడు గోపాలకృష్ణ. ఇద్దరూ ఇద్దరే!
పరుచూరి సోదరుల కలం బలంతో ఎంతోమంది స్టార్ డమ్ చేజిక్కించుకున్నారు. తెలుగునాట ఫ్యాక్షనిజం కథలకు దారి చూపింది ఈ సోదరులే. రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన పలు కథలు రూపొందించారు. వాటితో తెరకెక్కిన చిత్రాలన్నీ అలరించాయి. ఇక ‘సమరసింహారెడ్డి’తో ఫ్యాక్షనిజమ్ కు హీరోయిజం తీసుకు వచ్చిన ఘనత కూడా వీరిదే. ‘సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఇంద్ర, ఆది’ వంటి సూపర్ డూపర్ మూవీస్ లో పరుచూరి బ్రదర్స్ రాసిన సంభాషణలు ఎంతగా ఆకట్టుకున్నాయో చెప్పవలసిన పనిలేదు. నాలుగు దశాబ్దాలుగా ఈ సోదరద్వయం కలిసే రచన సాగిస్తూ ఉండడం విశేషం. చిరంజీవి ‘సైరా…నరసింహారెడ్డి’ రచనలోనూ ఈ సోదరులు పాలు పంచుకున్నారు.
ఈ సోదరులు దర్శకులుగానూ ఓ తొమ్మిది చిత్రాలను రూపొందించారు. అన్నదమ్ములిద్దరూ నటనలోనూ అడుగు పెట్టారు. పరుచూరి వెంకటేశ్వర రావు అనేక చిత్రాలలో కేరెక్టర్ యాక్టర్ గానూ, కొన్నిట విలన్ గానూ నటించి మెప్పించారు. ఇప్పటికీ తమ దరికి వచ్చిన సినిమాలకు రచన చేయడానికీ, పాత్రల్లో నటించడానికి పరుచూరి వెంకటేశ్వరరావు సిద్ధంగానే ఉన్నారు.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!