Dadasaheb Phalke : ఎన్టీఆర్ vs అమీర్ ఖాన్.. బయోపిక్ వార్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకేరోజు గంటల వ్యవధిలో బాలీవుడ్ నుంచి రెండు బిగ్ అప్డేట్స్ వచ్చాయి. భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే పాత్రలో ముందుగా జూనియర్ ఎన్టీఆర్ నటించనున్నట్టుగా కథనాలు వచ్చాయి. రాజమౌలి పర్యవేక్షణలో ఈ సినిమా వస్తుందని వార్తలు వెలువడ్డాయి. కానీ ఆ వెంటనే, అదే బయోపిక్ను అమీర్ ఖాన్ చేస్తున్నట్టుగా మరో ప్రకటన వచ్చింది. దీంతో అసలు ఈ బయోపిక్ ఎవరు చేస్తున్నారు? అనే డైలమాలో పడిపోయారు నెటిజన్స్.
Also Read : Kamal Haasan : తెలుగులో భారీ ఎత్తున థగ్ లైఫ్ ప్రమోషన్స్
Also Read
వాస్తవానికి రాజమౌళి రెండేళ్ల క్రితం తన సమర్పణలో ‘మేడ్ ఇన్ ఇండియా’ అనే ప్రాజెక్ట్ ప్రకటించారు. ఈ సినిమాను ఆయన తనయుడు కార్తికేయ, వరుణ్ గుప్తా సంయుక్తంగా నిర్మిస్తున్నట్లుగా తెలిపారు. నితిన్ కక్కర్ దర్శకత్వం వహిస్తారని వెల్లడించారు. కానీ హీరో ఎవరనే విషయాన్ని చెప్పలేదు. తాజాగా ఈ ప్రాజెక్ట్లో ఎన్టీఆర్ నటించనున్నట్లు ఫీలర్స్ వదిలారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్కు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కూడా ప్రచారం జరిగింది. ఈ ప్రకటన వచ్చిన వెంటనే అమీర్ ఖాన్ కూడా దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ చేస్తున్నాడని దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ తెరకెక్కిస్తున్నట్టుగా బాలీవుడ్ మీడియా తెలిపింది.
గత నాలుగేళ్లుగా ఈ బయోపిక్ స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నట్టుగా చెప్పుకొచ్చారు. దాంతో ఇప్పుడు ఈ బయోపిక్ వార్ ఎన్టీఆర్ వర్సెస్ అమీర్ ఖాన్గా మారిపోయింది. ఈ బయోపిక్ను ఎన్టీఆర్, అమీర్ ఖాన్ ఎవరి వెర్షన్లో వారు తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారట. కానీ ఇద్దరు దర్శక దిగ్గజాలు ఒకే బయోపిక్ను రెండు వెర్షన్స్ లో తెరకెక్కించడం ఎంత వరకు కరెక్ట్ అనే వాదన వినిపిస్తోంది. ఎవరో ఒకరు వెనక్కి తగ్గి దాదాసాహెబ్ కు గ్రాండ్ ట్రిబ్యూట్ గా ఈ సినిమాను రూపొందిస్తే బాగుంటుందని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Best Parathas for Summer: మీరు పరోటా ప్రేమికులా..? వేసవిలో ఆరోగ్యానికి బెస్ట్ పరోటాలు ఇవే.. రుచితో పాటు శరీరానికి చల్లదనం
-
Kangana Ranaut : సీక్రెట్గా పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన కంగనా
-
RCB vs SRH: ఆర్సీబీ మాస్టర్ ప్లాన్ సక్సెస్.. మ్యాచ్ ఓడినా టేబుల్ టాపర్గా నిలిచిన పాటిదార్ సేన..
-
Delhi Heatwave: ఢిల్లీలో నిప్పుల కొలిమి.. తారు రోడ్ల ఏకంగా 65°C ఉష్ణోగ్రత నమోదు!
-
Motorola Edge 70 Pro+: మోటరోలా ఎడ్జ్ 70 ప్రో+ త్వరలో భారత్ లో విడుదల.. 50MP ట్రిపుల్ రియర్ కెమెరా, 16GB RAM
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!