నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ ఆధ్వర్యంలో విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్ హీరోహీరోయిన్లుగా నటించిన ‘కలియుగం పట్టణంలో’ రిలీజ్ కి రెడీ అవుతోంది. డిఫరెంట్ కాన్సెప్ట్తో రాబోతోన్న ఈ సినిమాను డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ మూవీకి కథ, డైలాగ్స్ ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఇలా అన్ని బాధ్యతలు రమాకాంత్ రెడ్డి చూసుకుంటున్నారు. ఈ సినిమాను డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మార్చి 22న రాబోతున్న ఈ మూవీలో చిత్ర శుక్లా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇక ఇటీవల విడుదల చేసిన మూవీ టీజర్ అందరినీ ఆకట్టుకుంది. టీజర్తో సినిమా మీద అంచనాలు రెట్టింపు అయ్యాయి.
ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ పెంచారు. ఈక్రమంలోనే చిత్రం నుంచి మంచి మెలోడీ సాంగ్ను రిలీజ్ చేశారు. ‘నీ వల్లే’ అంటూ సాగే ఈ మెలోడి పాటను ఎం.ఎం.మానసి ఆలపించారు. భాస్కరభట్ల సాహిత్యాన్ని అందించారు. అజయ్ అరసాడ అందించిన చక్కటి బాణీ ఎంతో వినసొంపుగా ఉంది. ఈ చిత్రాన్ని మార్చి 22న భారీ ఎత్తున విడుదల చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇక అజయ్ అరసాడ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి చంద్రబోస్, భాస్కర భట్ల సాహిత్యం అందించారు. గ్యారీ బీహెచ్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు.