మొఘల్స్ పై ప్రముఖ నటుడి వివాదాస్పద వ్యాఖ్యలు… దారుణంగా ట్రోలింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మొఘలులపై ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటుడు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా వరుస వివాదాలతో సతమతమవుతున్నారు. సినిమాలే కాకుండా నసీరుద్దీన్ షా ఏ సమస్యపై మాట్లాడినా తరచూ వివాదాలకు తావిస్తుంటారు. తాజాగా అలాంటిదే ఒకటి జరగడంతో మరోసారి నసీరుద్దీన్ షాపై నెటిజన్లు గుర్రుగా ఉన్నారు. తన ఇటీవలి ఇంటర్వ్యూలో నసీరుద్దీన్ షా మొఘల్స్ ను శరణార్థులుగా వర్ణించాడు. భారతదేశాన్ని తమ మాతృభూమిగా మార్చడానికే మొఘలులు వచ్చారని ప్రముఖ నటుడు పేర్కొనడం వివాదాస్పదంగా మారింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో నసీరుద్దీన్ షా మాట్లాడుతూ మొఘలుల గురించి వివిధ వాదనలు చేయడం కన్పిస్తోంది. వీడియోలో నసీరుద్దీన్ షా ‘మొఘలుల దురాగతాలు అంటూ కొన్ని సంఘటనలు బట్టబయలు అవుతున్నాయి. మొఘలులు దేశం కోసం దోహదపడిన వ్యక్తులని మనం మర్చిపోతున్నాము. దేశంలో శాశ్వత స్మారక చిహ్నాలను విడిచి పెట్టిన వ్యక్తులు, నృత్యం, సంగీతం, చిత్రలేఖనం, సాహిత్యం సంప్రదాయాన్ని అందించిన వారు. మొఘలులు తమ మాతృభూమిగా చేసుకోవడానికి ఇక్కడికి వచ్చారు. కావాలంటే మీరు వారిని శరణార్థులు అని పిలవవచ్చు” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన వీడియో చూసిన నెటిజన్లు నసీరుద్దీన్ షాపై మండిపడుతున్నారు.
Also Read
- Lagaan Re Release Date : 25 ఏళ్ల తర్వాత థియేటర్లలోకి ఆమిర్ ఖాన్ 'లగాన్'... మచ్చటగా మూడు రోజులు మాత్రమే.!
- Raghavvi: రాఘవ లారెన్స్ కూతురు సంచలన నిర్ణయం.. హీరోయిన్గా కాకుండా ఆ రూట్లో ఇండస్ట్రీలోకి ఎంట్రీ!
- Ranveer Singh : రణ్వీర్ సింగ్ పై బ్యాన్ ఎత్తివేసిన FWICE
- AA 23 : అల్లు అర్జున్ - లోకేష్ కనకరాజ్ సినిమా ఆగిపోయిందా? అసలు నిజమిదే!
Mughals were the barbaric invaders who destroyed much of Hindu civilisation, religion, demography, culture etc. They are a root cause for creation of Pak, BD & of most other problems India has been facing. And you call them settlers or refugees? Shame on you #naseeruddinshah https://t.co/u08kRmePpL
— M. Nageswara Rao IPS (Retired) (@MNageswarRaoIPS) December 30, 2021
సీబీఐ మాజీ డైరెక్టర్ ఎం.నాగేశ్వరరావు కూడా నసీరుద్దీన్ షాను టార్గెట్ చేశారు. వైరల్ అవుతున్న వీడియోను ఎం.నాగేశ్వరరావు పంచుకుంటూ “మొఘలులు అనాగరిక ఆక్రమణదారులు… వారు హిందూ నాగరికత, మతం, జనాభా, సంస్కృతి మొదలైనవాటిని నాశనం చేశారు. పాక్, బీడీ, భారతదేశం ఎదుర్కొంటున్న అనేక ఇతర సమస్యల సృష్టికి మూల కారణం వారే. మీరు వారిని సెటిలర్లు లేదా శరణార్థులు అని పిలుస్తారా? ఇది మీకు అవమానకరం” అంటూ మండిపడ్డారు.
తాజావార్తలు
-
AI in Media: ఏఐ ప్రపంచాన్నే మార్చేస్తోంది.. కానీ జర్నలిజాన్ని భర్తీ చేయగలదా?
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
India S-400 Squadron: భారత్కు రష్యా నుంచి నాలుగో S-400 స్క్వాడ్రన్.. దేశ వైమానిక రక్షణ మరింత పటిష్టం
-
Jos Buttler: నెహ్రా నిర్ణయంతో షాకైన జోస్ బట్లర్.. గుజరాత్ ఫైనల్ ఓటమి వెనుక అసలు కథ ఇదే!
-
Vivek Agarwal’s Family: విధి ఆడిన వింత నాటకం.. తండ్రి కోసం వచ్చి ఢిల్లీ హోటల్ అగ్నిప్రమాదంలో ఆరుగురు మృతి!
ట్రెండింగ్
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!