మొఘల్స్ పై ప్రముఖ నటుడి వివాదాస్పద వ్యాఖ్యలు… దారుణంగా ట్రోలింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మొఘలులపై ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటుడు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా వరుస వివాదాలతో సతమతమవుతున్నారు. సినిమాలే కాకుండా నసీరుద్దీన్ షా ఏ సమస్యపై మాట్లాడినా తరచూ వివాదాలకు తావిస్తుంటారు. తాజాగా అలాంటిదే ఒకటి జరగడంతో మరోసారి నసీరుద్దీన్ షాపై నెటిజన్లు గుర్రుగా ఉన్నారు. తన ఇటీవలి ఇంటర్వ్యూలో నసీరుద్దీన్ షా మొఘల్స్ ను శరణార్థులుగా వర్ణించాడు. భారతదేశాన్ని తమ మాతృభూమిగా మార్చడానికే మొఘలులు వచ్చారని ప్రముఖ నటుడు పేర్కొనడం వివాదాస్పదంగా మారింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో నసీరుద్దీన్ షా మాట్లాడుతూ మొఘలుల గురించి వివిధ వాదనలు చేయడం కన్పిస్తోంది. వీడియోలో నసీరుద్దీన్ షా ‘మొఘలుల దురాగతాలు అంటూ కొన్ని సంఘటనలు బట్టబయలు అవుతున్నాయి. మొఘలులు దేశం కోసం దోహదపడిన వ్యక్తులని మనం మర్చిపోతున్నాము. దేశంలో శాశ్వత స్మారక చిహ్నాలను విడిచి పెట్టిన వ్యక్తులు, నృత్యం, సంగీతం, చిత్రలేఖనం, సాహిత్యం సంప్రదాయాన్ని అందించిన వారు. మొఘలులు తమ మాతృభూమిగా చేసుకోవడానికి ఇక్కడికి వచ్చారు. కావాలంటే మీరు వారిని శరణార్థులు అని పిలవవచ్చు” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన వీడియో చూసిన నెటిజన్లు నసీరుద్దీన్ షాపై మండిపడుతున్నారు.
Also Read
- NTR - Trivikram Movie: రేపే ఎన్టీఆర్-త్రివిక్రమ్ ‘God Of War’ అనౌన్స్మెంట్!
- Idupu Kayitham : రచ్చ రచ్చ చేస్తున్న 'ఇడుపు కాయితం'.. నేషనల్ ఇష్యూ చేశారంటూ నరేశ్ ఫైర్!
- Ravi Kishan: కూతురికి తల్లి లేని లోటు తెలియకూడదని.. మీసం తీసి, చీర కట్టేందుకు రెడీ అయిన స్టార్ విలన్!
- Srinivasa Mangapuram: ఘట్టమనేని ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్.. జూలై రేస్ నుంచి తప్పుకున్న జయకృష్ణ ‘శ్రీనివాసమంగాపురం’?
Mughals were the barbaric invaders who destroyed much of Hindu civilisation, religion, demography, culture etc. They are a root cause for creation of Pak, BD & of most other problems India has been facing. And you call them settlers or refugees? Shame on you #naseeruddinshah https://t.co/u08kRmePpL
— M. Nageswara Rao IPS (Retired) (@MNageswarRaoIPS) December 30, 2021
సీబీఐ మాజీ డైరెక్టర్ ఎం.నాగేశ్వరరావు కూడా నసీరుద్దీన్ షాను టార్గెట్ చేశారు. వైరల్ అవుతున్న వీడియోను ఎం.నాగేశ్వరరావు పంచుకుంటూ “మొఘలులు అనాగరిక ఆక్రమణదారులు… వారు హిందూ నాగరికత, మతం, జనాభా, సంస్కృతి మొదలైనవాటిని నాశనం చేశారు. పాక్, బీడీ, భారతదేశం ఎదుర్కొంటున్న అనేక ఇతర సమస్యల సృష్టికి మూల కారణం వారే. మీరు వారిని సెటిలర్లు లేదా శరణార్థులు అని పిలుస్తారా? ఇది మీకు అవమానకరం” అంటూ మండిపడ్డారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!