Naga Vamshi: ఆ షో వేసి తప్పు చేశా… సలార్ కి దీనికి ఉన్న తేడా అదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుంటూరు కారం… సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లాస్ట్ రీజనల్ సినిమా. త్రివిక్రమ్-మహేష్ కాంబినేషన్ అనగానే గుంటూరు కారం సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి. ఆ అంచనాలని మరింత పెంచుతూ ప్రొడ్యూసర్ నాగ వంశీ తన మాటలతోనే హైప్ క్రియేట్ చేసాడు. సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేసి జనవరి 12న రిలీజైన గుంటూరు కారం సినిమా డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. క్రిటిక్స్ నుంచి కూడా గుంటూరు కారం సినిమాకి యావరేజ్ రివ్యూస్ వచ్చాయి. క్రిటిక్స్ ఒపీనియన్స్ అండ్ రివ్యూస్ ని పక్కన పెడితే గుంటూరు కారం సినిమా టాక్ కి భిన్నంగా కలెక్షన్స్ ని రాబడుతోంది. మొదటివారం లోనే 212 కోట్లు రాబట్టి 90% బిజినెస్ ని రికవర్ చేసేసింది. గుంటూరు కారం సినిమాకి ఈ స్థాయి కలెక్షన్స్ వస్తాయని కూడా ఎవరు ఊహించి ఉండరు. అయితే మహేష్ చరిష్మా మాత్రమే గుంటూరు కారం సినిమాని నిలబెడుతోంది. ఫ్యామిలీ ఆడియన్స్ లో మహేష్ బాబుకి ఉన్న గ్రిప్ గుంటూరు కారం సినిమాకి హెల్ప్ అయ్యింది.
గుంటూరు కారం సినిమా సెకండ్ వీక్ లోకి ఎంటర్ అవుతున్న సందర్భంగా ప్రొడ్యూసర్ నాగ వంశీ ప్రెస్ మీట్ పెట్టి మొదటిరోజు నెగటివ్ టాక్ రావడానికి కారణం ఏంటో చెప్పేసాడు. గుంటూరు కారం సినిమాకి అర్ధరాత్రి 1కి కొన్ని చోట్ల షోస్ పడ్డాయి. ఈ షోస్ కారణంగానే నెగటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది కానీ ఆ తర్వాత సినిమా పుంజుకుంది. ఆ షో వేయడం కారణంగానే ఇదంతా జరిగింది. సలార్ సినిమా మాస్ సినిమా కాబట్టి ఆడియన్స్ చూసారు. ఇది ఫ్యామిలీ సినిమా కాబట్టి అర్ధరాత్రి షో వేయకుండా ఉండాల్సింది. సినిమా ఆ తర్వాత మళ్లీ పాజిటివ్ గా టర్న్ అయ్యింది కానీ మేము ఆశించిన స్థాయిలో రాలేదు. కొంతమంది గుంటూరు కారం సినిమా మీద స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించారు. ఈ సినిమాకి ఇంత కలెక్షన్స్ రావు అని వాళ్ళు ఊహించారు, డిస్ట్రిబ్యూటర్స్ కి కూడా ఫోన్లు చేసారు, వాళ్లందరికి చెప్తున్నా సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వబోతుంది, అందుకే ప్రెస్ మీట్ పెట్టా” అని చివరలో చాలా స్ట్రాంగ్ గా చెప్పాడు నాగ వంశీ.
Also Read
తాజావార్తలు
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
Ponnam Prabhakar: “ఆ రోజే అనుమానం వచ్చింది”.. పెట్రోల్ ధర పెరుగుదలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు..
-
Peddi: కథే ‘పెద్ది’కి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అంటున్న బుచ్చిబాబు..
-
PM Modi: యూఏఈపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం.. భారత్-యూఏఈ మధ్య కీలక ఒప్పందాలు
-
Dharmendra Pradhan: నీట్ ప్రశ్నాపత్రం లీక్పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన ప్రకటన!
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!