Naga Chaitanya: ఆ డైరెక్టర్ కు ఉన్న కొంచెం పరువును కూడా తీసేసిన చైతన్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Naga Chaitanya: అక్కినేని నాగ చైతన్య చాలా తక్కువ మాట్లాడతాడు అని అందరికి తెల్సిందే. సోషల్ మీడియాలో కూడా చాలా రేర్ గా కనిపిస్తాడు. అతని పర్సనల్ లైఫ్ ను సోషల్ మీడియాలో పంచుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. ఇక సమంతతో విడాకులు అయ్యాకానే కొద్దికొద్దిగా సోషల్ మీడియాలో కనిపిస్తున్నాడు. ఇక సాధారణంగా చై.. ఎవరి గురించి తప్పుగా కానీ, కోపంగా కానీ మాట్లాడలేదు. చివరికి విడాకులు ఇచ్చిన భార్య సమంత గురించి కూడా చై.. మంచిగానే మాట్లాడాడు. అయితే మొట్ట మొదటిసారి.. ఒక డైరెక్టర్ గురించి చై.. ఘాటు ఆరోపణలు చేశాడు. ప్రస్తుతం ఈ విషయమే సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది. యువత సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన డైరెక్టర్ పరుశురామ్ పెట్ల.. ఈ సినిమా తర్వాత.. సోలో, సారొచ్చారు, ఆంజనేయులు, శ్రీరస్తు శుభమస్తు లాంటి సినిమాలతో డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నా.. గీతా గోవిందం సినిమాతో స్టార్ డైరెక్టర్ లిస్ట్ లో చేరాడు.
Ooru Peru Bhairavakona Teaser: ‘విరూపాక్ష’ను మించి భయపెట్టేలా ఉందే
Also Read
- Upcoming K-Dramas : సస్పెన్స్ నుంచి రొమాంటిక్ దాకా... జూన్ లో చూడవలసిన 6 కొత్త కె-డ్రామాలు
- Chiranjeevi: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న చిరంజీవి ట్వీట్..'తండ్రిగా మాత్రమే కాదు.. నటుడిగా కూడా గర్వపడుతున్నా'
- Crime Thriller OTT : నమ్మిన వాళ్లే వెన్నుపోటు పొడిస్తే... ఓటీటీలోకి గూస్ బంప్స్ తెప్పించే కన్నడ క్రైమ్ థ్రిల్లర్
- Lagaan Re Release Date : 25 ఏళ్ల తర్వాత థియేటర్లలోకి ఆమిర్ ఖాన్ 'లగాన్'... మచ్చటగా మూడు రోజులు మాత్రమే.!
ఇక మొదటి నుంచి కూడా ఇతగాడిపై ఇండస్ట్రీలో ఎవరికి మంచి ఒపీనియన్ లేదని టాక్.. ఎందుకంటే.. ప్రొడక్షన్ కంపెనీల వద్ద సినిమాల కోసం అడ్వాన్సులు తీసుకొని.. సినిమాలను కంప్లీట్ చేయడని ఆరోపణలు ఉన్నాయి. కనీసం అరడజను సంస్థల నుంచి అతను పెద్ద మొత్తంలో అడ్వాన్సులు తీసుకొని ఎగొట్టినట్లు సమాచారం. అందులో నాగ చైతన్య ప్రాజెక్ట్ ఒకటి అని తెలుస్తోంది. గీతా గోవిందం తరువాత చై తో పరుశురామ్.. ఒక సినిమా ఒప్పుకున్నాడు. 14 రీల్స్ బ్యానర్ లో ఆ సినిమాకు అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు. అయితే.. తీసుకున్నాకా.. మహేష్ బాబు తో సర్కారు వారి పాట సినిమా అవకాశం రావడంతో చైతన్యను పక్కన పెట్టేశాడు.
Neha Shetty: రాధిక నిన్నలా చూస్తుంటే మైండ్లో కిరికిరి షురూ అవుతోంది
అడ్వాన్ ఇచ్చిన 14 రీల్స్ బ్యానర్ ను ఒప్పించి మహేష్ తో సినిమా చేసేలా చేశాడు. అలా చై సినిమా పక్కకు వెళ్లి.. మహేష్ సినిమా పట్టాలెక్కింది. ఇది జరిగి చాలా ఏళ్లే అయినా.. ఇప్పటికీ చై మర్చిపోలేని ఘటనల్లో ఇది ఒకటి. ఇక ఇదే విషయమై రీసెంట్ గా చై స్పందించాడు. పరుశురామ్ గురించి మాట్లాడడం టైమ్ వేస్ట్ అని, అతని గురించి మాట్లాడి.. తన టైమ్ ను వేస్ట్ చేయొద్దని చెప్పుకొచ్చాడు. అతను తన టైమ్ మొత్తం వేస్ట్ చేయించాడని చెప్పుకొచ్చాడు. ఇక ఇప్పటివరకు సర్కారు వారి పాట సినిమా డైరెక్టర్ గా కొద్దో గొప్పో మిగిలిన పేరు.. చై ఇలా చెప్పడం వలన పోయింది. సినిమా పూర్తి చేయలేని వాడు అడ్వాన్స్ లు తీసుకోవడం ఎందుకు అని నెటిజన్లు పరుశురామ్ ను ఏకిపారేస్తున్నారు. మరి ఈ విషయమై సదురు డైరెక్టర్ ఎలా స్పందిస్తాడో చూడాలి.
తాజావార్తలు
-
World Cup: కేవలం 30 సెకన్ల మీటింగ్.. వరల్డ్ కప్ కొట్టిన భారత్.. సంచలన రహస్యం చెప్పిన కెప్టెన్..
-
High Protein Roti Recipe: గోధుమ పిండిలో ఈ 3 పదార్థాలు కలపండి.. హై ప్రోటీన్ రోటీ రెడీ..
-
Ameerpet Fire Accident : అగ్ని సెగలతో మెట్రో పిల్లర్కు క్రాక్.. రంగంలోకి జేఎన్టీయూ నిపుణులు
-
Forbes Billionaires List: 4 గదుల ఫ్లాట్ నుంచి 92.8 బిలియన్ డాలర్ల సామ్రాజ్యం వరకు..! అంబానీని దాటేసిన టిక్టాక్ సృష్టికర్త..
-
DK.Shivakumar: డీకే.శివకుమార్ కేబినెట్పై విమర్శలు.. మహిళలకు చోటు లేకపోవడంపై నిలదీత
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!