Naga Chaitanya: ఆ డైరెక్టర్ కు ఉన్న కొంచెం పరువును కూడా తీసేసిన చైతన్య
Naga Chaitanya: అక్కినేని నాగ చైతన్య చాలా తక్కువ మాట్లాడతాడు అని అందరికి తెల్సిందే. సోషల్ మీడియాలో కూడా చాలా రేర్ గా కనిపిస్తాడు. అతని పర్సనల్ లైఫ్ ను సోషల్ మీడియాలో పంచుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. ఇక సమంతతో విడాకులు అయ్యాకానే కొద్దికొద్దిగా సోషల్ మీడియాలో కనిపిస్తున్నాడు. ఇక సాధారణంగా చై.. ఎవరి గురించి తప్పుగా కానీ, కోపంగా కానీ మాట్లాడలేదు. చివరికి విడాకులు ఇచ్చిన భార్య సమంత గురించి కూడా చై.. మంచిగానే మాట్లాడాడు. అయితే మొట్ట మొదటిసారి.. ఒక డైరెక్టర్ గురించి చై.. ఘాటు ఆరోపణలు చేశాడు. ప్రస్తుతం ఈ విషయమే సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది. యువత సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన డైరెక్టర్ పరుశురామ్ పెట్ల.. ఈ సినిమా తర్వాత.. సోలో, సారొచ్చారు, ఆంజనేయులు, శ్రీరస్తు శుభమస్తు లాంటి సినిమాలతో డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నా.. గీతా గోవిందం సినిమాతో స్టార్ డైరెక్టర్ లిస్ట్ లో చేరాడు.
Ooru Peru Bhairavakona Teaser: ‘విరూపాక్ష’ను మించి భయపెట్టేలా ఉందే
Also Read
- Yatra: హీరోగా రజనీకాంత్ మనవడు.. కొడుకు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపై ధనుష్ క్లారిటీ ఇదే!
- NBK - Koratala Siva మూవీ స్టోరీ లీక్.. మాఫియా డాన్గా బాలయ్య! ఇక నందమూరి ఫ్యాన్స్కు పూనకాలే..
- Tollywood Star Hero: ధురందర్ డైరెక్టర్ తో సినిమాకి తెలుగు స్టార్ హీరో యత్నాలు?
- Hero Dupes: డబ్బు పెట్టే వాడికి లేని నొప్పి మనకెందుకు? .. జేడీ కీలక వ్యాఖ్యలు
ఇక మొదటి నుంచి కూడా ఇతగాడిపై ఇండస్ట్రీలో ఎవరికి మంచి ఒపీనియన్ లేదని టాక్.. ఎందుకంటే.. ప్రొడక్షన్ కంపెనీల వద్ద సినిమాల కోసం అడ్వాన్సులు తీసుకొని.. సినిమాలను కంప్లీట్ చేయడని ఆరోపణలు ఉన్నాయి. కనీసం అరడజను సంస్థల నుంచి అతను పెద్ద మొత్తంలో అడ్వాన్సులు తీసుకొని ఎగొట్టినట్లు సమాచారం. అందులో నాగ చైతన్య ప్రాజెక్ట్ ఒకటి అని తెలుస్తోంది. గీతా గోవిందం తరువాత చై తో పరుశురామ్.. ఒక సినిమా ఒప్పుకున్నాడు. 14 రీల్స్ బ్యానర్ లో ఆ సినిమాకు అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు. అయితే.. తీసుకున్నాకా.. మహేష్ బాబు తో సర్కారు వారి పాట సినిమా అవకాశం రావడంతో చైతన్యను పక్కన పెట్టేశాడు.
Neha Shetty: రాధిక నిన్నలా చూస్తుంటే మైండ్లో కిరికిరి షురూ అవుతోంది
అడ్వాన్ ఇచ్చిన 14 రీల్స్ బ్యానర్ ను ఒప్పించి మహేష్ తో సినిమా చేసేలా చేశాడు. అలా చై సినిమా పక్కకు వెళ్లి.. మహేష్ సినిమా పట్టాలెక్కింది. ఇది జరిగి చాలా ఏళ్లే అయినా.. ఇప్పటికీ చై మర్చిపోలేని ఘటనల్లో ఇది ఒకటి. ఇక ఇదే విషయమై రీసెంట్ గా చై స్పందించాడు. పరుశురామ్ గురించి మాట్లాడడం టైమ్ వేస్ట్ అని, అతని గురించి మాట్లాడి.. తన టైమ్ ను వేస్ట్ చేయొద్దని చెప్పుకొచ్చాడు. అతను తన టైమ్ మొత్తం వేస్ట్ చేయించాడని చెప్పుకొచ్చాడు. ఇక ఇప్పటివరకు సర్కారు వారి పాట సినిమా డైరెక్టర్ గా కొద్దో గొప్పో మిగిలిన పేరు.. చై ఇలా చెప్పడం వలన పోయింది. సినిమా పూర్తి చేయలేని వాడు అడ్వాన్స్ లు తీసుకోవడం ఎందుకు అని నెటిజన్లు పరుశురామ్ ను ఏకిపారేస్తున్నారు. మరి ఈ విషయమై సదురు డైరెక్టర్ ఎలా స్పందిస్తాడో చూడాలి.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!