Dhanush: మ్యూజిక్ మ్యాస్ట్రో బయోపిక్.. ధనుష్ ఖాతాలో మరో రికార్డ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dhanush: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇక తాజాగా ధనుష్ మరో సినిమాతో రాబోతున్నాడు. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయ రాజా బయోపిక్ లో ధనుష్ నటిస్తున్నాడు. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో సంగీత జ్ఞానిగా తనదైన ముద్ర వేసిన ఈయనపై సినిమా రానుండటం అనేది సంగీతాభిమానులతో పాటు ఇళయరాజా అభిమానులను, సినీ ప్రేక్షకులను ఆనందోత్సహాల్లో ముంచెత్తింది. ఈ చిత్రాన్ని కనెక్ట్ మీడియా, మెర్క్యూరీ గ్రూప్ సంస్థలు కలిసి రూపొందించనున్నాయి. ఈ నిర్మాణ సంస్థల కలయికలో తొలి చిత్రంగా రూపొందనున్న ఈ బయోపిక్ షూటింగ్ అక్టోబర్ 2024లో ప్రారంభమై 2025 మధ్యలో విడుదల కానుంది. ఇకపై సరికొత్త సినిమాలను, కంటెంట్ను అందించేందుకు సిద్దమైంది. దక్షిణాదిలోని సినిమా, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి క్లాస్ గ్లోబల్ ప్రాక్టీస్లు, స్ట్రక్చర్డ్ స్టూడియో ప్రొడక్షన్లో అత్యుత్తమంగా తీసుకురావడంలో కొత్త శకానికి నాంది పలికినట్టు అవుతుంది. వీరి కలయిక రాబోయే దశాబ్దంలో గణనీయమైన వ్యాపార వృద్ధిని అందిస్తుంది. దీనిని ఇలంపరితి గజేంద్రన్ ముందుండి నడిపించనున్నారు.
దక్షిణాది చిత్ర పరిశ్రమ సంవత్సరానికి 900 కంటే ఎక్కువ సినిమాలను విడుదల చేస్తుంది. భారతీయ చిత్ర పరిశ్రమలో సౌత్ ఇండస్ట్రీ వాటా ఎక్కువ. కంటెంట్ సృష్టి పరంగా అగ్రగామిగా ఉంది. ఈ నేపథ్యంలో కనెక్ట్ మీడియా నుంచి వరుణ్ మాథుర్ మాట్లాడుతూ.. “మెర్క్యురి అనేది ప్రపంచ వినోద ప్రదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన పేర్లలో ఒకటి. మెగా-బడ్జెట్ చిత్రాలను నిర్మించడానికి వారితో చేతులు కలపడం పట్ల మేము సంతోషిస్తున్నాం. ప్రస్తుతం భారతీయ వినోద పరిశ్రమ చాలా కీలక పరిణామ దశలో ఉంది. రాబోయే రెండు దశాబ్దాలు ఇది మరింత అభివృద్ధి చెందుతుంది. ఒక జాతీయ స్టూడియోగా మెర్క్యురీతో మా భాగస్వామ్యం గొప్పగా ఉంటుంది. భారతదేశం, ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్దీ అభిమానులకు నచ్చే సినిమాలను అందించడంలో మా వంతు ప్రయత్నం చేస్తాం” అన్నారు.
Also Read
- Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
- Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్కు గుడ్బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
- Venkat K Narayana: జన నాయగన్ సినిమాలో ఆ 'టెక్నీషియన్ను మార్చాలన్న' దళపతి విజయ్.. కానీ!
- Toxic: 'టాక్సిక్'లో రొమాన్స్, వైలెన్స్ డోస్ ఎక్కువైందా? యష్ మూవీపై సోషల్ మీడియాలో హాట్ డిబేట్!
మెర్క్యూరీ గ్రూప్ సీఈవో, ఎండీ శ్రీరామ్ భక్తిశరణ్ మాట్లాడుతూ.. “ప్రస్తుతం ప్రాంతీయ కథలకు ఎక్కువగా డిమాండ్ ఉంది. ప్రాంతీయ కథలతో సినిమాలు తీస్తే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తోంది. మాకు ఇంటర్నేషనల్ వైడ్గా వ్యాపారం చేసిన అనుభవం ఉంది. ఇక ముందు లోకల్, ప్రాంతీయ కథలను అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కిస్తాం. కనెక్ట్ మీడియాతో ఏర్పాటు చేసిన ఈ వెంచర్ మీద మాకు ఎంతో నమ్మకం ఉంది. కనెక్ట్ మీడియా మాకు విశ్వసనీయ భాగస్వామి మాత్రమే కాకుండా వినోద పరిశ్రమపై స్పష్టమైన, బలమైన అవగాహన కలిగి ఉంది. పరిశ్రమలోని ఇతర విభాగాల వారితోనూ వివిధ వాటాదారులతో మంచి సంబంధాలు కూడా ఉన్నాయి” అని అన్నారు.
తాజావార్తలు
-
Criminal Lawyer: కోర్టులో లాయర్.. బయట గంజాయి స్మగ్లర్! పుష్ప స్టైల్లో స్మగ్లింగ్..
-
TG-AP THEFTS: తెలుగు రాష్ట్రాల్లో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు.. నిమిషాల్లోనే ఎలా చక్కబెట్టారంటే..!
-
Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
-
Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
-
Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!