‘ఈషా’ ఫేమ్ త్రిగుణ్, ‘పాపం ప్రతాప్’ ఫేమ్ పాయల్ రాధాకృష్ణ జంటగా నటించిన హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’. మధుదీప్ చెలికాని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని CH.V.S.N బాబ్జీ సమర్పణలో లోటస్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్పై అరవింద్ మండెం నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. వేసవి కానుకగా మే 15న ఈ సినిమాను శ్రీ వెంకట సాయి ఫిలిమ్స్ ద్వారా ముత్యాల రామ్ దాస్ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించి సినిమా విశేషాలను పంచుకుంది.
హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ మాట్లాడుతూ “నాకు నటిగా గుర్తింపు ఇచ్చింది తెలుగు చిత్ర పరిశ్రమే. నేను ఇక్కడే సెటిల్ అవ్వాలని భావిస్తున్నాను. తాజాగా ‘పాపం ప్రతాప్’తో విజయం రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థాంక్స్. మే 15న అందరూ థియేటర్స్లో చూసి ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను ఆదరించాలి.” అన్నారు. హీరో త్రిగుణ్ మాట్లాడుతూ “ఇది ఫుల్ ఫన్ ఫిల్డ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇందులో ఒక మంచి కాన్సెప్ట్ కూడా దాగి ఉంది. ఈ సమ్మర్లో థియేటర్లకు వచ్చే ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. పాయల్ లక్ ఈ సినిమాకు కూడా కలిసి రావాలని కోరుకుంటున్నాను. కచ్చితంగా అందరికీ నచ్చే సినిమా ఇది.” అన్నారు.
