మోహన్లాల్, జీతు జోసెఫ్ కలయికలో వచ్చిన ‘దృశ్యం’ దాని సీక్వెల్ ‘దృశ్యం 2’ ఘన విజయం సాధించాయి. ఇప్పుడు వారు హ్యాట్రిక్ సినిమాగా ‘ట్వల్త్ మేన్’తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా కూడా వీరి ముందు సినిమా ‘దృశ్యం2’ లాగే డిజిటల్ లో రిలీజ్ కానుంది. డిస్నీ+ హాట్స్టార్లో నేరుగా విడుదల కానున్న ఈ సినిమా టీజర్ను తాజాగా విడుదల చేశారు. ప్రతి వ్యక్తికి సొంతదైన జీవితం, వ్యక్తిగత జీవితం, రహస్య జీవితం అనే మూడు విభిన్న జీవితాలు ఉంటాయని ఈ టీజర్ చెబుతోంది. టీజర్ చివర్లో ఫైనల్ విజిల్ వేసే సమయం వచ్చింది అనే మోహన్లాల్ డైలాగ్ టీజర్ పై ఆసక్తిని పెంచుతుంది. జీతూ, మోహన్లాల్ మరో థ్రిల్లర్ తో మన ముదుకు వస్తున్నట్లు అర్థం అవుతోంది.ఈ సినిమాలో ఉన్ని ముకుందన్, సైజు కురుప్, శివద, అను సితార, అనుశ్రీ, ప్రియాంక నాయర్, అను మోహన్ ఇతర కీలక పాత్రథారులు. దీని రిలీజ్ డేట్ ప్రకటించాల్సి ఉంది. ఇక మోహన్ లాల్ ‘దృశ్యం 2క, బ్రో డాడీ’ వంటి హిట్ చిత్రాల తర్వాత డైరెక్ట్ గా మరోసారి ఓటీటీలో రాబోతున్నాడు. మరి మోహన్ లాల్ ఓటీటీలో హ్యాట్రిక్ హిట్ కొడతాడేమో చూడాలి.